నువ్వులు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
[[దస్త్రం:Sa white sesame seeds.jpg|thumb|right|తెల్లని నువ్వు గింజలు.]]
ఖరీప్‌ మరియు రబీ రెండు సీజనులలో నువ్వుల [[పంట]]ను సాగు చేయుదురు. అయితే ఖరీప్‌లో ఎక్కువ హెక్టరులో సాగు చెయ్యుదురు. ఖరిప్‌లో సాగు చేసిన పంట దిగుబడి అక్టొబరులో, రబీలో సాగు చేసిన జనవరిలో దిగుబడి వచ్చును. ఎక్కువ వర్షాధార పంటగా సాగుచెయ్యుదురు. ఖరీప్% సీజను అయ్యినచో జూన్-జూలైలో, రబీ అయ్యినచో అక్టొబరు, నవంబరులో విత్తడం మొదలు పెట్తారు. పంటసాగుకు 25-27 డిగ్రిలు అనుకూలం. క్షారలక్షమాలున్న తేలికపాటి స్యాండ్ సాయిల్ వ్యవసాయ భూములలో ఈ పంట బాగా దిగుబడి యిచ్చును. నువ్వుల మొక్క తల్లి వేరు మండలఓ కలిగి 2-5 అడుగుల ఎత్తు పెరుగును, సాఖలుండి వా ఎత్తు పెరుగును. కొమ్మలు కలిగి వుండును. కొన్ని ప్రాంతాలలో నువ్వుల పంటను జొన్నలు, వేరుశనగ, ప్రత్తి వంటి పంటలతో కలిపి మిశ్రమ పంటగా సాగు చెయ్యుదురు.
విత్తటానికి నెల రోజుల ముందే 20-25 టన్నుల కాంపొస్ట్‌ ఎరువు, సేంద్రియఎరువును/హెక్టరుకు పొలమంతట కలిసే కలియదున్నుదురు. కనీసం 50 మి.మీ వాన పడిన తరువాత విత్తడం మొదలు పెట్తెదరు. సాలుకు, సాలుకు (వరుస) మధ్య దూరం 45 సెం.మీ. సాలులోని మొక్కల మధ్య దూరం 15 సెం.మీ వచ్చెలా నువ్వులను విత్తవలెను. నేల లోపల 2-3 సెం.మీ. లోతులో వుండేలా విత్తవలెను. పంటకు పంటకాలం మొత్తం మీద 30 కీ.జిల నత్రజని,60 కే.జి.ల భాస్వరం, 20 కే.జి.ల పోటాసియం రసాయనిక ఎరువులను వాడ వలెను.పొటాషియం,భాస్వరంలను ఒకేసారి విత్త్నాలు విత్తితకు ముందు చల్లాలి.నత్రజనిని మాత్రం మూడు దపాలుగా,మొదటి మూడో వంతు విత్తనం విత్తెటప్పుడు,రెండో దపా విత్తిన 30రోజులకు,మూడొ దపా ,విత్తిన 40 రోజకు వెయ్యవలెను.పంటకాలంలో పైరుకు నీరు పెట్టాలి.పైరుకు నీరు మొదటిసారి విత్తిన 20-30 రోజులకు,రెండొ సారి పైరుపూతకు వచ్చే సమయానికి(45-50రోజులు),తరువాత కాయకాచే సమయంలో(65-70)పెట్టాలి.ఆకులు,కాయలు పసుపు రంగుకు రాగానే కోతచెయ్యలి.కాయ పూర్తిగా ఎండు వరకు వదలి వేసిన ,కాయ పగిలి నువ్వులు రాలి పోవును.ఒకకాయలో 60-100 నువ్వులు వుండును.అందువలన కాయ ప్సుపు రంగుకు వచ్చి కొద్ది పచ్చిగా వున్నప్పుడె కోతచేసి,కంకులను చినచిన్న కట్టలులుగా కట్టి,కాయలున్నభాగంపైకి వుండెలా,శుభ్రంగా వున్న కళ్లంలో ఆరబెట్టెదరు,ఆరిన కాయలున్న కట్తలు చేతులతో,కళ్లంనేల మీదకాని,లేదా వస్త్రాని పరచి దాని మీదకొట్టి,నువ్వులను నూర్చెదరు.మిగతా పంటలతో పొల్చిన నువ్వుల దిగుబడి తక్కువగా వుండును.తతిమా నూనె గింజల దిగుబడి 1.0-2.0 టన్నులు/హెక్టరుకు వుండగా నువ్వులు 0.35-.04టన్నులు మాత్రమే వచ్చును.నూనెను తీసిన నువ్వుల పిండిని(Til oil cake)పశువుదాణాగా,కోళ్లమేతలో వాడెదరు.నువ్వులనుండి ఎక్స్‌పెల్లరు అనే యంత్రాలద్వారా తీయుదురు(గానుకలు కనుమరుగై పోయాయి).ఎక్స్‌పెల్లరునుండి వచ్చు తెలగపిండి(til oil cake)లో 6-8% వరకు నూనె మిగిలి వుండును.ఆయిల్‌కేకునుండి సాల్వెంట్‌ఎక్స్‌ట్రాక్షన్‌ పద్దతిలో సంగ్రహించెదరు.సాల్వెంట్‌ఎక్స్‌ట్రాక్షన్ వలన అయిల్‌కేకు లోని మొత్తం నూనెను తీయడం జరుగుతుంది.
 
'''నువ్వుల ఎక్కువగా పండించే దేశాలు'''
 
1.ఇండియా 2.ఛైనా 3.మయన్మారు,4.సుడాను,5.ఉగాండా,6.యుథోపియా 7.నైగెరియా.
 
'''ఇండియాలో నువ్వులను సాగుచెయ్యు రాష్ట్రాలు''' 1.గుజరాత్2.పశ్చిమ బెంగాల్ 3.కర్నాటక 4.రాజస్ధాన్ 5.మధ్య ప్రదేశ్ 6.తమిళ నాడు 7.ఆంద్ర ప్రదేశ్ 8.మహరాష్ట్ర
 
[[వర్గం:పెడాలియేసి]]
"https://te.wikipedia.org/wiki/నువ్వులు" నుండి వెలికితీశారు