గుత్తికొండ నరహరి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
[[File:Guttikonda Narahari.jpg|thumb|గుత్తికొండ నరహరి]]
==జీవన సరళి==
తెలుగు రాజకీయ రంగంలో అసమాన వక్తగా, రాజకీయ విశ్లేషకుడుగా రాణించిన గుత్తికొండ నరహరి ఆగస్ట్ 10, 1918 న ఆంజనేయులు, రాఘవమ్మ దంపతులకు యెలవర్రు గ్రామం, [[తెనాలి]] తాలుకా ([[గుంటూరు జిల్లా]]) లో పుట్టాడు. ఈ గ్రామం ప్రసిద్ధులకు కాణాచి. సుప్రసిద్ధ సైంటిస్ట్ నాయుడమ్మ అక్కడివాడే. సమీపంలో వున్న తురుమెళ్ళ పాఠశాలలో చదువుకొన్నాడు. యెలవర్తి రోసయ్య, మల్లంపాటి మధుసుధన ప్రసాద్ తన సహాధ్యాయులు. కాలేజీలో చేరకుండానే బర్మా లోని రంగూన్ వెళ్ళి రెండేళ్ళు జర్నలిస్ట్ గా పనిచేసి , తిరిగి వచ్చి గుంటూర్ ఎ.సి. కాలేజీలో బి.ఎ. పూర్తి గావించాడు. [[మద్రాస్]] లో లా లో చేరి మధ్యలోనే స్వస్తిపలికి , ఎం.ఎన్.రాయ్ ప్రభావంలో నవ్య మానవవాద రాష్ట్ర పార్టి కార్యదర్శి అయ్యాడు. 1944 లో గూడవల్లి లో, మేనమామ కూతురు సరోజిని తో పెళ్ళి అయింది. ఈ వివాహం లౌకిక (Secular way) పద్ధతిలో జరిగి, నమోదు చేయబడినది.▼
▲తెలుగు రాజకీయ రంగంలో అసమాన వక్తగా, రాజకీయ విశ్లేషకుడుగా రాణించిన గుత్తికొండ నరహరి ఆగస్ట్ 10, 1918 న ఆంజనేయులు, రాఘవమ్మ దంపతులకు
== రాజకీయాలు ==▼
1946 ఎన్నికలలో నరహరి యువత నుద్దేశించి పదవులకు రాజీనామాలు చేయమని, స్వాతంత్ర్యం రానున్నందున త్యాగం చేస్తే తరువాత వున్నత పదవులు వస్తాయని బోధ చేశాడు. రాడికల్ రాజకీయాలలో అటు కమ్మూనిస్ట్ లను, ఇటు కాంగ్రెస్ వారిని ఎదురుకొని , తన ధారాళ ఉపన్యాసాలతో జనాన్ని ఆకట్టుకున్నాడు. ములుకోల, ప్రజామిత్ర, సమీక్ష పత్రికలలో వ్యాసాలు వ్రాసాడు. విహారి, ఆంధ్రా లేబరు పత్రికల సంపాదకత్వం వహించాడు. రాజకీయ పాఠశాలలో ఎందరినో సుశిక్షితులను గావించాడు. గోపిచంద్, ఆవుల గోపాలకృష్ణమూర్తి , ఎం.వి.రామమూర్తి, కోగంటి రాధాకృష్ణమూర్తి , పి.వి.సుబ్బారావు, రావిపూడి వెంకటాద్రి, ఎన్.వి.బ్రహ్మం లతో నవ్య మానవ వాద వుద్యమంలో పనిచేశాడు. ఎ.సి.కాలేజి ప్రిన్సిపాల్ టి.ఎస్.పాలస్ కు దగ్గర మిత్రుడు. కొన్నాళ్ళు ఆచార్య రంగా తో పనిచేశాడు. 1972లో క్షాత్ర ధర్మ పరిషత్ అనే రాజకీయ పార్టి పెట్టి, లోక్ సభకు పోటీ చేశాడు. అసంపూర్తిగా వదిలేసిన లా ను పూర్తి చేసి, 1974 లో, హైదరాబాద్ లో ప్రాక్టీస్ చేసాడు.▼
▲1946 ఎన్నికలలో నరహరి యువత నుద్దేశించి పదవులకు రాజీనామాలు చేయమని, స్వాతంత్ర్యం రానున్నందున త్యాగం చేస్తే తరువాత
== పొగాకు వ్యాపారం ==▼
గుంటూర్ లో పొగాకు కంపనీ పెట్టి [[వ్యాపారం]] చేశాడు. [[కొత్త రఘురామయ్య]]తో కొన్నేళ్ళు కలసి పనిచేశాడు. అప్పుడే వి.కె.కృష్ణ మీనన్ కు చేరువయ్యాడు. పొగాకు వ్యాపారంలో దెబ్బతిన్న తరువాత తన ప్రతిభవ్యుత్పన్నతను రచనలకు వినియోగించాడు. కాని అవి ఇప్పుడు లభించడం లేదు. పొగాకు వాణిజ్యం కోసం , కంపెనీల ఆర్డర్లు పొందడానికి తొలుత జపాన్ వెళ్ళాడు. పిమ్మట అనేక దేశాలు పర్యటించి ఆర్డర్లు తెచ్చాడు. వాణిజ్య పరమైన సమావేశాలు జరిపి, పొగాకు నాణ్యతపై వ్యాసాలు ప్రత్యేక సంచికలలో రాశాడు.▼
▲
==మానవతా వాది ==
1955 లో ఆంధ్ర ప్రభ ఎడిటర్ [[నార్ల వెంకటేశ్వరరావు]] కు ఎం.ఎన్.రాయ్ పూర్తి సాహిత్యం అందచేసి ఆయన నవ్య మానవ వాదిగా మారడానికి నరహరి కారకుడయ్యాడు. ఎం.ఎన్.రాయ్ 1955 లో మరణించినప్పుడు ఆయనపై సంపాదకీయం రాయక పోగా, వార్త కూడా ఆంధ్ర ప్రభలో వేయనందుకు ఆవుల గోపాల కృష్ణమూర్తి విరుచుకపడి నార్లను దుయ్యపట్టాడు. అప్పుడు నరహరిని కోరి, రాయ్ సాహిత్యం, నార్ల తెప్పించుకున్నాడు. నార్ల ఆలోచనా విధానం పై ఎం.ఎన్.రాయ్ రచనలు, సిద్ధాంతాలు ప్రభావితం చేశాయి.
==హేతువాది==
[[కొండవీటి వెంకటకవి]] తన నెహ్రు కావ్యం ద్వితీయ భాగాన్ని నరహరికి అంకితం ఇచ్చాడు. ఎన్.కె.అచార్య, ఆలపాటి రవీంద్రనాథ్, ఎన్. ఇన్నయ్య లతో హేతువాద, మానవవాద విషయాలలో కలసి పనిచేశాడు. నరహరి రాష్ట్ర రాడికల్ డెమొక్రాటిక్ పార్టి కార్య దర్శిగా మానవ విలువలను ప్రజలలోకి తీసుకెళ్ళడానికి కృషి చేశాడు. మూఢనమ్మకాలు వున్న జనానికి చక్కగా శాస్తీయ విషయాలు విడమరచి చెప్పడంలో అందెవేసిన నరహరి,1985 మార్చ్ 27 న చనిపోయాడు.
[[వర్గం:1918 జననాలు]]
|