పుష్కర్: కూర్పుల మధ్య తేడాలు

*//pushkar//*
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
వజ్ర నాభ అనే రాక్షసుడు ప్రజలను హింసిస్తుంటే, బ్రంహ తన చేతిలో వున్న తామర పుష్పాన్నే ఆయుదంగా జేసి ఆ రాక్షసుణ్ణి సంహారించాడట. ఆ పూరేకులు మూడు చోట్ల పడి మూడు సరస్సులుగా ఏర్పడాయి. మొదటిది జేష్ట పుష్కర్, రెండవది మద్య పుష్కర్, చివరిది కనిష్ట పుష్కర్. [[ బ్రంహ]] చేతి (కర)_ లోని పుష్పం నుండి రాలిన రెక్క తో ఏర్పడిన సరస్సులు కాన వీటికి పుష్కర్ అని పేరు. బ్రంహ లోక కళ్యాణం కొరకు అక్కడ ఒక యజ్ఞాన్ని చేయ సంకల్పించి దానికి రక్షణగా దక్షిణాన రత్న గిరి, ఉత్తరాన నీల గిరి, తూర్పున సూర్య గిరి అనే కొండలను సృష్టించి దేవతల నందరిని ఆహ్యానించాడు. ముహూర్థం కాలం ఆసన్నమైనది. ఆహూతులందరు విచ్చేసారు. సావిత్రిని (ఈమెనె సరస్వతి అని కూడ పిలుస్తారు) పిలుచుకొని రమ్మని కుమారుడైన నారదుని పంపిస్తాడు బ్రంహ. నారధుడు వెళ్లె సరికి ఆమె సిద్దంగానె ఉంటుంది గాని మన కలహ భోజుడు ఊరికే వుంటాడా? నువ్వు ఒక్కదానివె వచ్చి అక్కడ ఏంచేస్తావు.... మీస్నేహితులను తీసుకరమ్మని సలహా ఇస్తాడు. దాంతొ తన సహ చరులైన లక్ష్మి పార్వతులతో కలిసి వద్దామని ఆగి పోతుంది. యజ్ఞ వాటిక యందు అందరు, రుషులు, దేవతలు సిద్దంగా వున్నారు. ముహూర్త కాలం దగ్గర పడుతున్నది. సావిత్రి జాడ లేదు. ముహూర్త సమయాని యజ్ఞం ప్రారంబించాలనే తలంపుతో బ్రంహ ఇంద్రుణ్ణి పిలిచి ఒక అమ్మాయి చూడమని ఆమెను పెండ్లాడి యజ్ఞాన్ని ప్రారంబిస్తానని చెప్తాడు. దాంతో ఇంద్రుడు సమీపం లో పాలమ్ముకునె ఒక గుర్జర్ల జాతి అమ్మాయి తీసుకొస్తాడు. శివుడు, విష్ణువు సలహా మేరకు ఆ అమ్మాయిని గోవులోని కి పంపి శుద్ది చేస్తారు. అలా చేస్తే పునర్జన్మ ఎత్తినట్టె నని ఆ అమ్మాయికి అబ్యంగన స్నానం చేయించి సర్వాలంకార శోబితు రాలిని చేస్తారు, గోవుతో సుద్ది చేయబడినది గాన ఆమెకు గాయిత్రి అని నామ కరణం చేసు నిర్ణీత సమయానికి యజ్ఞం ప్రారంబిస్తారు. యజ్ఞం పూర్తవుతున్న సమయాన పార్వతి అక్కడికి వచ్చి, బ్రంహ ప్రక్కన మారొ స్త్రీ కూర్చొని వుండగా చూసి ఆగ్రహించి బ్రంహ దేవునితో సహా అక్కడున్న వారినందరిని శపిస్తుంది. భర్తను వృద్దుడై పొమ్మని, అతనికి ఒక్క పుష్కరిణిలో తప్ప మరెక్కడా ఆలయాలు వుండవని శపిస్తుంది. అన్ని యుద్దాల్లో ఓటమి తప్పదని ఇంద్రుణ్ని, మానవా జన్మ ఎత్తి బార్య వియోగంతొ బాద పడతాడని విష్ణువును, శ్మసానంలో భూత ప్రేత గణాలతో సహ జీవనం చేయమని శివుణ్ణి, దారిద్ర్యంతో, ఇల్లిల్లు తిరిగి బిక్షాటన చేసుకొని బ్రతకమని బ్రాంహణులను, దొంగలచే ధనమంతా పోగొట్టుకొని నిరుపేదగా మారమని కుభేరుణ్ణి శపిస్తుంది. తర్వాత ఆమె రత్న గిరి పైకి వెళ్లి తపస్సు చేసి నదిగా మారిందని అంటారు. ఇప్పుడు ఆ రత్నగిరిపై చిన్న ఆలయం వున్నది. అక్కడే చిన్న సెలఏరు కూడ వున్నది. దీన్నె సావిత్రి నది అని పిలుస్తారు. ఈ దేవతను పూజించి, ఆ నదిలొ స్నానం చేస్తె నిత్య సుమంగళి గా వుంటారని భక్తుల నమ్మకం: సావిత్రి వెళ్ళిన తర్వాత బ్రంహ దేవుడు యజ్ఞాన్ని పూర్తి చేయమని బ్రాంహణులను కోరగా .... దానికి వారు తమను శాప విముక్తుల్ని చేయమని ఆ తర్వాతే యజ్ఞ క్రతువును చేస్తామని అంటారు. అప్పటికే యజ్ఞ ఫలంతో సిద్దించిన శక్తులతో గాయిత్రీదేవి ........ పుష్కర్ ప్రముఖ తీర్థ క్షేత్రంగా వర్తిల్లు తుందని ఇంద్రుడు తిరిగి స్వర్గాని గెలుచు కుంటాడని, విష్ణు మూర్తి రామునిగా జన్మింస్తాడని, బ్రాంహణులు గురువులుగా గౌరవాని పొందతారని శాప తీవ్రతను తగ్గిస్తుందట. బ్రంహ దేవాలయాలు అరుదుగా అక్కడక్కడ వున్న అవి ఇక్కడున్న దాని లాగ వుండవు. బ్రంహ దేవుడే స్వయంగా స్థలాన్ని నిర్ణయించగా యుగాంతాన విశ్వామిత్రుడు ఈ ఆలయాని కట్టించాడని అంటారు. ప్రపంచంలోకెల్ల పది పుణ్య క్షేత్రాలలో పుష్కర్ ఒకటని భారత్ లో హిందువులు దర్శించె మొదటి ఐదు క్షేత్రాలలో ఇది ఒకటని అంటారు. పౌరాణికంగా ప్రసస్తి గాంచిన పంచ సరోవరాల్లో దీని ప్రస్థానం వున్నది.
 
ప్రస్తుతం ఇక్కడున్న దేవాలయం పదునాలుగ శతాబ్దంలో కట్టిందని, కాని దానికి పూర్వం రెండు వేల సంవత్సరాల క్రితంమే అక్కడ ఆలయం వుండేదని అంటారు. తర్వాత ఆది శంకరాచార్య ఒకసారి, మహారాజ జనత్ రాజు మరోసారి ఆలయాన్ని పునరుద్దరించారని చరిత్ర కారుల నమ్మకం. ఆలయంలోని గోడలకు వెండి నాణేలు అంటించి వున్నాయి. భక్తులు తమ పేరు చెక్కిన వెండి నాణేలను దేవునికి సమర్పిస్తుంటారు. పాల రాతి మెట్లు ఎక్కి మండపం దాటి గర్బ గుడిలోకి వెళ్లగానె హంస వాహనం మీద వున్న చతుర్ముఖ బ్రంహ విగ్రహం కనిపిస్తుంది. ఆయన నాలుగు చేతుల్లో వరుసగా అక్షమాల, కమండలం, పుస్తకం, దర్బలు ఉంటాయి. ఆలయ గోడల మీద సరస్వతి దేవి, ఇతర దేవీ దేవతల బొమ్మలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఆలయంలొ పూజాదికాలు సనాతన ధర్మం ప్రకారమే జరుగు తుంటాయి. గర్బగుడి లోని విగ్రహాన్ని పెళ్లైన పురుషులు పూజించ రాదు. కేవలం సన్యసించిన వారె పూజించాలి. ఆ సాధువులు కూడ పుష్కర్ లోని పరాశర గోత్రీకులు మాత్రమే అయి వుండాలనేది నిభందన. గర్బ గుడికి ఎదురుగా వున్న మండపంలో వెండి తాబేలు వున్నది. ప్రతి ఏటా కార్తీక పౌర్ణమితో బాటు ప్రతి పౌర్ణమి , అమావాస్య రోజు న ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. కార్తీక మాసంలోనె పుష్కర్ జాతర కూడ జరుగుతుంది. ఇది దీపావళి తరవాత వచ్చే ఈకాదశి నాడు మొదలై పౌర్ణమి వ్రకు జరుగుతుంది. జాతర సమయంలో వేలాది భక్తులు వస్తుంటారు. ఈ జాతర హస్త కళలకు పెట్టింది పేరు. గుడి కెదురుగ వున్న రెండు కొండలపై వున్న సావిత్రి, గాయిత్రి దేవతలను కూడ దర్శించు కుంటారు భక్తులు. సావిత్రి ముఖ కవళికలు కోపంగాను, గాయిత్రి విగ్రహం భయపడు తున్నట్టుంటాయి. ఈ చుట్టుపక్కల ఇంకా అనేక దేవాలయాలున్నాయి. అందులో ముఖ్యమైనది అగస్తేస్వర్ ఆలయం. అందులోని లింగం బ్రంహ చేత ప్రతిష్టించ బడిందని, ఇక్కడ పూజలు చేసి, అభిషేకం చేసిన వారికి మోక్ష ప్రాప్తి కలుగు తుందని భక్తుల నమ్మకం. పెద్దదైన ఈ శివ లింగం పై రాగి తో చేసిన పాము చుట్టు కొని వున్నట్టుటుంది. శివరాత్రి రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. తర్వాత మరో ఆలయం పేరు రంగ్ జీ ఆలయం. ఇక్కడి విష్ణు మూర్తిని రంగ్ జీ అని పిలుస్తారు. ఈ ఆలయం దక్షిణాది శైలిలో వుంటుంది. మరో ముఖ్య మైన ఆలయం వరాహ దేవాలయం. ఇక్కడ విష్ణు మూర్తి వరహా రూపంలో దర్శనమిస్తాడు. ఇలా ఈచుట్టుపక్కల అనేక దేవాలయాలున్నాయి. Bhaskaranaidu 13:38, 12 సెప్టెంబర్ 2011 (UTC)
(నూలం, ఈనాడు....ఆదివారం....నవంబరు 7........2010)
"https://te.wikipedia.org/wiki/పుష్కర్" నుండి వెలికితీశారు