కుటుంబ నియంత్రణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
రోజురోజుకీ పెరుగుతున్న జనాభాతో వర్ధమాన దేశాలు సతమతమవుతున్నాయి. జననాలు బాగా తగ్గి [[స్పెయిన్]] దేశం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. జననాల సంఖ్య తగ్గించేందుకు మన దేశంలో ప్రభుత్వం అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రోత్సాహకాలు ప్రకటిస్తుంటే, స్పెయిన్ దానికి విరుద్ధంగా పిల్లల్ని కనడానికి ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఎక్కువమంది పిల్లల్ని భరించే శక్తిలేదని మన దేశం వాపోతోంటే, పిల్లల సంఖ్య తగ్గిపోయిందని స్పెయిన్ దేశం ఆవేదన చెందుతోంది. ప్రతి వెయ్యిమందికి సగటున 22.69 శాతం జననాల రేటుతో, ఇప్పటికే భారత జనాభా 1.12 బిలియన్లకు చేరుకుంది. కేవలం 10.06శాతం జననాల రేటుతో 45మిలియన్లు మాత్రమే జనాభా ఉన్న స్పెయిన్ ఆ లోటును పూడ్చుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. స్పెయిన్లో జననాల రేటు పెరగడానికి కొత్తగా ఒక పాప లేదా బాబుకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, పిల్లలను పెంచుకునే తల్లిదండ్రులకు స్పెయిన్ ప్రభుత్వం 2,500 యూరోల(139500 రూపాయల) ఆర్థిక బహుమతి ప్రకటించింది. ఇండియాలో జనసాంద్రత కి.మీ. కి 336 మంది. అదే స్పెయిన్ లో 88 మంది.
==ప్రోత్సాహకాలు==
మన దేశంలో కుటుంబ నియంత్రణను ప్రోత్సహించడానికి ఎస్‌సీ, ఎస్‌టీ, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు కు.ని. శస్త్రచికిత్సలు చేయించుకుంటే ట్యూబెక్టమీకి రూ.1350, వేసెక్టమీకి రూ. 1300 ప్రైవేటు ఆస్పత్రులకు ఇస్తున్నారు. మన రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న వారికి ప్రోత్సహక నగదుగామహిళకునగదుగా మహిళకు రూ.600, పురుషుడైతే రూ.1150 ఇస్తారు. ఆశ కార్యకర్తలకు ప్రోత్సాహకంగా మహిళను తీసుకొస్తే రూ.150, మగ అయితే రూ.200 నగదును అందిస్తున్నారు. జననీ సురక్ష యోజన పథకం ద్వారా ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం చేయించుకునే మహిళకు రూ.700 నగదు ఇస్తారు. ఒక సంతానం చాలనుకునే దంపతులను లక్కీడీప్‌ ద్వారా గుర్తించి జిల్లాకు ఒక్కరికి రూ.10 వేలు నగదు ప్రోత్సాహకంగా వైద్యఆరోగ్యశాఖవైద్య ఆరోగ్య శాఖ అందిస్తుంది.[[ప్రపంచ జనాభా దినోత్సవం]] ([[జూలై 11]]) సందర్భంగా అన్నిపేదదేశాల్లోఅన్ని పేదదేశాల్లో ఆపరేషన్ చేయించుకున్న దంపతులకు లక్ష రూపాయల ఆర్థిక బహుమతిని వరల్డ్ బ్యాంక్ సహకారంతో ప్రకటించితే బాగుండేది. అలాగే ఐక్యరాజ్యసమితి ఆయా దేశాలను సంప్రదించి అధిక జనాభాతో బాధ పడుతున్న దేశాలనుండి వలసపోవటానికి ఇష్టపడేవారిని అల్ప జనాభాతో బాధపడే దేశాలకు తరలిస్తే ప్రపంచదేశాల్లో జనాభా సమతుల్యంగా ఉంటుంది.
 
==మేమిద్దరం మాకిద్దరు==
'మేమిద్దరం... మాకిద్దరు' అన్న చందంగా పరిమిత కుటుంబ వ్యవస్థ రూపుదిద్దుకుంటోంది. కొన్ని కుటుంబాలైతే చైనా తరహాలో 'మేమిద్దరం... మాకొక్కరే చాలు' అంటున్నారు. కుటుంబ నియంత్రణ పాటించడం, ఉద్యోగాలు, ఉపాధి కోసం వలసలు అధికం కావడం చిన్న కుటుంబాల సంఖ్య పెరుగుదలకు ప్రధాన కారణం. దేశంలో పదిహేను రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లో జననాల రేటు తక్కువగా ఉంది. జాతీయ సగటు- 22.8. ఆంధ్రప్రదేశ్‌లో- 18.4.
"https://te.wikipedia.org/wiki/కుటుంబ_నియంత్రణ" నుండి వెలికితీశారు