పి.శంకరరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
శంకర్రావు తొలిసారిగా 1983లో షాద్‍నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైనాడు. 1989లో రెండోసారి అదే స్థానం నుంచి ఎన్నికకాగా 1994లో తెలుగుదేశం పార్టీకి చెందిన బక్కని నర్సిములు చేతిలో పరాజయం పొందినాడు. 1999లో మళ్ళీ అదే స్థానం నుంచి పోటీచేసి మూడవసారి శాసనసభలో ప్రవేశించాడు. 2004లో కూడా షాద్‌నగర్ నుంచి సిటింగ్ ఎమ్మెల్యేగా పోటీచేసి బక్కని నర్సిములుపై విజయం సాధించాడు. [[వై.ఎస్.రాజశేఖరరెడ్డి|వైఎస్సార్]] మంత్రివర్గంలో చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశాడు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో ఈ నియోజకవర్గం జనరల్‌కు మారడంతో 2009లో శంకర్రావు సికింద్రాబాదు కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన జి.శాయన్నపై 4 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు.<ref>ఈనాడు దినపత్రిక, హైదరాబాదు జిల్లా టాబ్లాయిడ్, తేది 17-5-2009</ref> [[కొణిజేటి రోశయ్య]] మంత్రివర్గంలోనూ ప్రస్తుతం [[నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి|కిరణ్ కుమార్ రెడ్డి]]లోనూ మంత్రిపదవి పొందినాడు.
==సంచనల వ్యాఖ్యలు==
మంత్రివర్గంలో ఉంటూ తెలంగాణ విషయంలో ముఖ్యమంత్రిపైనా, అవినీతి విషయంలో తోటి మంత్రులపైనా సెప్టెంబరు 26, 2011న విమర్శలు చేసి సంచలనం సృష్టించాడు. అవినీతి పరులైన మంత్రులను తొలిగించనిచో తాను మంత్రిపదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించాడు.<ref>సాక్షి దినపత్రిక, తేది 23-09-211</ref> తోటిమంత్రులపై శంకర్రావు చేసిన వ్యాఖ్యలను హైకోర్టు సుమోటాగా స్వీకరించి సిబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. అంతకు క్రితం [[వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి]]పై అక్రమ ఆస్తుల విషయంలో హైకోర్టులో పిటిషన్ వేశాడు. దీనిపై ఇంకనూ సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పి.శంకరరావు" నుండి వెలికితీశారు