పాలసేకరణ కేంద్రాలవారు పాలను గ్రామీణప్రాంతాలనుండి వారి సిబ్బందిద్వారా పాలను సేకరించెదరు.సేకరించుపాలలోవున్న వెన్నశాతం ఆధారంగానే పాల ధరను చెల్లించెదరు.పాలలో వెన్న6కొవ్వులు6-8% వరకు వుండును.ఇలా సేకరించిన పాలను మొదట శీతలీకరణయంత్రాలద్వారా చల్లబరచెదరు,ఇలా చల్లబరచటం వలన పాలనుండి వెన్న వేరు పడును.శీతలికరించినపాలను అపకేంద్రియయంత్రాలకు(centrifuges)పంపెదరు.సెంట్రిఫ్యుజ్లో ఒక బౌల్వుండును.ఇది మాటరుయంత్రంసహయంతో తిరుగునప్పుడు పాలను బౌల్లోకి పంపెదరు.సెంట్రిఫ్యుగల్బౌల్లో ఎక్కువసాంద్రత వున్న పాలు బౌల్యొక్క వెలుపలి తలంవైపు,తక్కువ సాంద్రత వున్న వెన్న బౌల్యొక్క కేంద్రభాగంవైపుకు వెళ్లును.బౌల్కేంద్రియభాగంపైన వున్న కవాటం(valve)ద్వారా వెలుపలికివెన్నవెలుపలికి వచ్చును.అలాగే వెన్న తీయబడిన పాలు మరో కవాటం ద్వారా వెలుపలికి వచ్చును.వెన్నను ఒకపాత్రలో నిల్వచేయుదురు.పాలను ఫస్చరైజెసనుచేసి,శీతలికరించి పాలను ప్యాకెట్ లలో నింపి,సీల్చేసి విక్రయించెదరు.ఇలావెన్నతొలగించిన పాలలో2.2-3.0%వరకు కొవ్వులు వుండును
ఇలాతయారైన వెన్న తెల్లగా,మెత్తగా వుండును.20-25% వరకు నీటిని కలిగివుండును.వెన్ననుండి నెయ్యిని తయారుచేయుదురుకావున వెన్న బౌతిక,రసాయనిక లక్షణాలు[[నెయ్యి]]లక్షణలులక్షణాలు ఒకటె