పాండవ ఉద్యోగ విజయములు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
==== పడక సీను ====
ఉపప్లావ్యము నుండి అర్జునుడు శ్రీ కృష్ణుని సాయం కోరడానిక ద్వారకకు బయలుదేరతాడు. కాస్త ముందుగా దుర్యోధనుడు హస్తినా పురం నుండ శ్రీ కృష్ణుని సాయం కోరి వస్తాడు. శ్రీ కృష్ణుడు పగటి నిద్ర నటిస్తాడు. శ్రీ కృష్ణుని తల వైపు ఒక ఆసనము, కాళ్ల దగ్గర ఒక ఆసనము ఉంటాయి. ముందుగా వచ్చిన దుర్యోధనుడు తలపైపు ఉన్న ఆసనం పైన కూర్చొగా, అర్జునుడు శ్రీ కృష్ణుని కాళ్ల దగ్గర నిలుచుంటాడు. శ్రీకృష్ణడు నిద్ర లేచి అర్జునుని ముందు చాసి, పిమ్మట దుర్యోధనుని చూస్తాడు. దుర్యోధనుడు కౌరవులకు పాండవులకు యుధ్దము రానున్నదని శ్రీకృష్ణుని సాయము కోరి వచ్చామని తెలియ చేస్తాడు.. శ్రీకృష్ణుడు తన సైన్యాన్ని రెండు భాగాలు చేసి తానొక్కడు ఒక వైపూ, మిగిలిన సైన్యమంతా ఒక పైవు అనీ, తాను యుద్దము చే.యక తోచిన సాయం చేస్తానంటాడు. ముందుగా అర్జునుని చూసాడు కాబట్టి ముందు అర్జునుడు కోరుకోవాలని అంటాడు. దుర్యోధనుడు సైననంతా అర్జునునికి ఇవ్వడానికి శ్రీకృష్ణుడు ఈ ఎత్తు ఎత్తాడని అనుకుంటాడు. కానీ, అర్జునుడు శ్రీకృష్ణుని కోరుకుంటాడు. దుర్యోధనుడు పరిశేష న్యాయమన మిగిలిన సేన తీసుకుంటానని ఆనందిస్తూ వెళ్లిపోతాడు. శ్రీకృష్ణుడు, అర్జునుని పరీక్షించడానికి "ఎంత పని చేసావు బావా - సేన అంతా దుర్యోధనుడు తీసుకున్న"డనగా అర్దునుడు "నీ యుధ్దము వద్దు నా రధము మీద ఉండమ"ని కోరగా శ్రీకృష్ణుడు "విజయ సారధి, పార్ధ సారధి పేర్లతో నేను నీ రధము మీద ఉంటాన"ని అబయఅభయ మిస్తాడు.
 
==== ఉపప్లావ్యము సీను ====
శ్రీకృష్ణుడు పాండవుల రాయబారిగా హస్తినపురానికి బయలు దేరుతూ పాండవుల అభిప్రాయాల్ని తెలుసుకునే క్రమంలో ముందు ధర్మరాజునుద్దేశించి అతని మనసులో మాట చెప్పమని అది తనకు మించిన పనైనా చేస్తానంటాడు. ధర్మరాజు సంధికోరగా ద్రౌపది, ధర్మరాజు వైఖరిని ఈసడిస్తుంది. భీముడు ఇంతకూ సంధి ఏమని అడిగితే ద్రౌపది ఐదూళ్లు ఇచ్చిన చాలని అంటుంది. మంత్రానికి కట్టుబడ్డ పాముకి మల్లే ఉండిపోయానని అనుకంటూ ఇంతలోనే సంధికుదిరినా కౌరవులను మట్టుపెడతానని భీముడునగా ద్రౌపది భీముని వాక్శూరుడని నిందిస్తుంది. ధర్మరాజు వారిద్దరినీ శాంతింప చేస్తాడు. సంధిమాట ఎటలైనా శతృరాజుల బలాన్ని చూడవచ్చని అందుకైనా హస్తినకు వెళ్లాలని శ్రీకృష్ణుడు అనగా భీముడు ధర్మరాజు సంధి కోరమనగా శ్రీ కృష్ణున ి వైఖిరి మరో విధంగా ఉందంటే ఇవి భీముని మాటలేనా అని భీముడు యుధ్దానికి బెదురుతున్నాడంటే శ్రీకృష్ణుని నిందిస్తాడు భీముడు. తమ్ములు భీముని శాంతింప చేయబోతే ఖేదపడి గదతో మోదుకోపోతే ధర్మజుడు అడ్డుకొని ఇదంతా తనవలనే్ అని ఖిన్నుడవుతాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజునోదార్చి వచ్చు సంగరంలో భీముడే ప్రధాన పాత్ర వహించాలని బాల్యం నుండి అనేక విధాలుగా బాధించిన వారితో సంధి కి ఎలా ఒడంబడుతున్నావని ఆశ్చర్యపడి అడిగితే అన్న గారి మాటమీద ద్రౌపదికి జరిగిన అవమానాన్ని ద్రిగమింగి, అరణ్యవాసం చేసి అజ్ఞాత వాసంలో దాస్యం చేసిన విధంగా సంధికి ఒడంబడుతున్నానని చెబుతాడు. అందరి అభిప్రాయాలు తెలుసుకొనగా ద్రౌపది తన పరాభవాన్ని గుర్తు చేసు కుంటుంది. ఆమె మనసు తనకు తెలుసని యుధ్దము తప్పదని ద్రౌపది ప్రతిన నెరవేరుతందని తెలపుతాడు. ధర్మరాజు శ్రీకృష్ణుడు ఏది తలచితే అది అవుతుందని, ఇద్దరూ కావలిసిన వారేనని అతని ఇష్టప్రకారం జరుగనిమ్మని అంటాడు. .