సూరపనేని లక్ష్మీపెరుమాళ్ళు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
వీరు [[కృష్ణా జిల్లా]] లోని [[ఉంగుటూరు]] లో జన్మించారు. చిన్నతనం నుండి పాటలు పాడడంలో ప్రావీణ్యం సంపాదించి జిల్లాలోని విజ్ఞానిక ఉద్యమం వైపు ఆకర్షితుడై ప్రాచీన కళారూపాల్ని పునరుద్ధరించడానికి పూనుకున్నారు. వీరు బుర్రకథకులుగా [[సుంకర వాసిరెడ్డి]] రచించిన "కష్టజీవి" బుర్రకథను చెబుతూ నాటి కరువు పరిస్థితులను, యుద్ధాల భీభత్సాన్ని నాటి రాజకీయాల్ని, భూస్వామ్య వర్గాల దోపిడీ విధానాన్ని లంచగొండి తనాన్ని కళ్ళకుకట్టినట్లు చిత్రించినట్లు ప్రదర్శించేవారు. కరువు ప్రాంతాల సహాయ కార్యక్రమాలలో పనిచేశారు.
 
కృష్ణా జిల్లా ప్రజా నాట్యమండలి లో ప్రధాన బాధ్యతలను నిర్వహించారు. సుంకర వాసిరెడ్డి రచించిన "ముందడుగు" నాటకాన్ని కోడూరు అచ్చయ్య గారి దర్శకత్వంలో అద్వితీయంగా ప్రదర్శించి ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. ఆ నాటకంలో వీరు కథానాయకుని ముసలి తల్లిగా నటించి మెప్పించారు.
 
తర్వాత మద్రాసు చేరి దాదాపు 50 తెలుగు సినిమాలలో పాత్రలు పోషించారు. వీరు ధరించిన పాత్రలలో [[రోజులు మారాయి]]లో కథానాయకుని తండ్రి పాత్ర, [[వరకట్నం]]లో కథానాయకురాలి తండ్రి పాత్ర, [[ప్రజానాయకుడు]] చిత్రంలో కోటేశు పాత్రలు ముఖ్యంగా చెప్పుకోదగ్గవి.
 
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]