ద్రౌపది: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 5:
రెండవ జన్మలో ఆమె కాశీరాజు పుత్రికగా జన్మించింది. చాలాకాలం కన్యగా ఉండి శివుని గురించి తీవ్ర తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మనగా 'నాకు పతి కావాలి' అని ఐదుసార్లు కోరింది. శివుడు తధాస్తు అన్నాడు. తరువాత శివుడు ఇంద్రున్ని ఐదు మూర్తులుగా రూపొందించి మానవులుగా పుట్టవలసిందని శాసించాడు. ఆ పంచేంద్రియాలే ధర్ముడు, వాయువు, ఇంద్రుడు, అశ్వినులు. వారి ద్వారా పంచపాండవులు జన్మించారు.
మూడవ జన్మలో ద్రుపదుని పుత్రికగా ద్రౌపదిగా జన్మించింది. [[ద్రోణుడు|ద్రోణాచార్యుని]] ఆఙ్ఞ ప్రకారం [[అర్జునుడు]], భీమునితో కలసి వెళ్ళి దృపదుని భందించి ద్రోణుని ముందుంచుతాడు. ద్రోణుని వలన కలిగిన గర్వభంగానికి భాదపడిన దృపదుడు, ద్రోణుని చంపగల కుమారుడు, మరియు పరాక్రమవంతుడైన అర్జునుని పెండ్లాడగలిగే కుమార్తెను పొందాలనే సంకల్పంతో యఙ్ఞం చేస్తాడు. ఆ [[యాగఫలం|యాగ ఫలంగా]] ద్రౌపది మరియు [[ధృష్టద్యుమ్నుడు]] జన్మించుట జరుగుతుంది.
|