త్రినాథ వ్రతకల్పం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 216:
; త్రినాధులు బ్రాహ్మణుని అనుగ్రహించుట :
త్రిమూర్తుల వద్ద శలవు పొంది కొంచెము దూరము నడచి వెళ్ళు చుండగా త్రోవలో ఆవును, దూడను చూసి సంతోషించి " త్రినాదులవారు నాయందు దయ ఉంచి ఆవును ,పెయ్యను తెచ్చి ఇచ్చినారు వారి పూజ బాగుగా చేసినాను" అని భావించుకొని ఆవును దూడను తోలుకొని పోయి ఇంటికి చేరినాడు. చూడగా తన ఇంటిలో సిరి సంపదలు పరిపూర్ణముగా యున్నవి అది చూసి అధికముగా సంతోషము పొంది, కడు శ్రద్ధతో పూజ నర్పించినాడు . చేయ వలసిన కార్యక్రమముల నందరికీ విశదముగా తెలియ పరచినాడు. తన స్నేహితులను రప్పించి వెనుకటి వలెనె మేళా సమర్పించినాడు. మేళా చేయు పద్దతిని అందరికి చెప్పగా అంతా ఒప్పుకున్నారు. ఆ రాజ్యములో ఉన్న ప్రజలందరూ త్రినాధ పూజ చేసినారు. అందరి ఇండ్ల యందు సుఖ సంతోషములు నిండెను. దానివల్ల షావుకార్లు అందరూ వ్యాపారములు మూసివేసినారు. అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసినారు .
 
; రాజు త్రినాధులను తూలనాడి మేళాను నిషేదించుట :
వారిని చూచి రాజు " మీరందరూ యెందుకు వచ్చినారు ? అని అడుగగా " అయ్యా మాఫిర్యాదు మీరు వినవలయును మధుసూదనుడను పేద బ్రాహ్మణుడు ఒకడు బిక్ష మెత్తుకుని జీవించెడివాడు శ్రీపురము వెళ్లి వచ్చి త్రినాధ మేళాను ఆచరించినాడు .త్రినాదులు యే దేవతలో ? వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతనికి కలిగినవి . ఊరిలో నున్న రైతులు యావన్మంది త్రినాధ మేళా చేసినారు గ్రుడ్డివారు ,కుంటివారు, అందరూ కూడా ఈ మేళాను చేసినారు. అందరూ మోక్షమంది నారు. ధన ధాన్యాలు కలిగి కుబేరునితో సమానమై పోయినారు.మా వ్యాపారములు పోయినవి మా క్రయ విక్రయములు ఏలాగున జరుగుతాయి .!" అని చెప్పగా రాజు ఆ మాటలు విని చాలా కోపము తెచ్చుకొని సకల జనులను పిలిపించి కోపముతో ఇట్లన్నాడు."త్రినాదులు అనే దేవతలు యేమి దేవతలు ? వారిని మీరు యెందుకు పూజించు చున్నారు. ? నేను చెప్పుచున్నాను వినండి ఆ పూజ మీరు చేయకూడదు అట్లు పూజ ఎవరు చేస్తారో వారు ఐదువందల రూపాయలు జరిమానా ఇచ్చి ఆరు మాసములు ఖైదులో ఉండవలసింది .అటుల కాని యెడల శూలం వేయబడునని రాజు గారు ప్రజలందరికి తాఖీదు ఇచ్చి పంపినారు.
 
==ఫలశ్రుతి==
"https://te.wikipedia.org/wiki/త్రినాథ_వ్రతకల్పం" నుండి వెలికితీశారు