త్రినాథ వ్రతకల్పం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 221:
 
; త్రినాధులు రాజుపై కోపించుట - యువరాజు మరణము :
ఈ సంగతి త్రినాధుల వారికి తెలిసి ఆ రాజునకు దండన విధించి నారు .దాని ఫలితముగా రాజకుమారుడు చనిపోయినాడు నగరంలో ఏడ్పు ఘోష వినిపించు చున్నది .ప్రజలందరూ రాజు వద్దకు పరుగెత్తినారు .రాజు దైవ కృప ,తప్పడం వలన తన కుమారుడు చనిపోయినాడని అనుకుంటున్నాడు కుమారుని ముఖం చూస్తూ రాజు ఏడ్చు చున్నాడు. తల్లి ,బంధువులు మొదలగు వారంతా దుఃఖించు చున్నారు. దహనము చేయుటకై స్వర్ణ భద్రా నదీ తీరమందు ఆ శవము నుంచినారు.
 
; త్రినాధుల దయతో యువరాజు బ్రతుకుట :
త్రినాదులకు దయ కలిగినది "రాజ కుమారుని బ్రతికించి వెతుమా ! మనకు పేరు ప్రఖ్యాతులు కలుగును ." అని బాగుగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ స్మశానమునకు వచ్చినారు. రాజును వారి సమూహమును చూసి "మీరందరూ ఈ నదీ తీరమునకు యెందుల కొచ్చినారు ?ఏల విచారముగా కూర్చున్నారు .ఈ పిల్లవాడు ఎందుకు పండుకొని యున్నాడు ? ఇతని శరీరములో చల్లదనము కలదే ? అని అడుగగా అంతా త్రిమూర్తులతో ఇలా అన్నారు . "మీతో ఏమి చెప్పగలం రాజ కుమారుడు చనిపోయినాడు ఆ రాజేమి దోషము చేసెనో కాని ఈతడు చనిపోయినాడు. " అనగా ఈ కుర్రవాడు చనిపోలేదు త్రినాధుల వారికి రాజు అపరాధము చేసినందు న ఈ చావు కలిగినది .ఇప్పుడు మీరందరూ త్రినాధులను భజించితే ఈ బాలుడు లేచి కూర్చుంటాడు . మా మేళా చేయుటకు రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బ్రతక గలడని చెప్పి త్రినాధ మూర్తులు అదృశ్యులైనారు .అందరూ వారి మాటలను విని త్రినాధ స్వాముల పేరు ఆ రాజ తనయుని చెవిలో చెప్పినారు. ఏడు మేళాలు చేయుటకు ఒప్పుకున్నారు .అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు. అది చూచి అందరును సంతోషము ను పొందినారు .అప్పుడు త్రిమూర్తుల పేరు మాటి మాటికి స్మరించినారు. అందరి నోటినుండి వెలువడిన పలుకులు సముద్ర గర్జన వలె వినిపించినవి .
 
; వర్తకుడు త్రినాధుల మేళా చేయుటకు మ్రొక్కుకొనుట :
అటువంటి సమయమున ఒక వర్తకుడు ఆ వూరి మీదుగా తన ఓడలలో విదేశములకు సరుకులను తీసుకు వెళ్ళు చుండెను .ఆ ఓడను నడిపించుకొని స్వర్ణ భద్రానది తీరమున ప్రవేశించినాడు. ఘోష చేసిన స్థలము దగ్గరకు వెళ్ళినాడు. వారిని చూచి జనులారా ! త్రినాధుల పేర్లు యేమి పేర్లు ? మీరేల స్మరించు చున్నారు ? వినడానికి శ్రద్దగా ఉన్నవి .అనగా రాజుగారి మనుష్యులు ఇట్లన్నారు. ఓ వర్తకుడా ! వినుము. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనేవారు త్రినాధ స్వాములు అటువంటి ప్రభువులను మా రాజు గారు మన్నించ నందున అపరాదుడైనాడు . ఆ అపరాధము వలన ఈ రాజకుమారుడు చనిపోవుట చే ఇతనిని మేము తీసుకుని వచ్చి అగ్ని సంస్కారము చేయుటకు కూర్చుని యున్నాము. ఇది చూచి ప్రభువులకు దయకలిగినది వచ్చి వీనిని బ్రతికించి నారు .అందుకు ఏడు మేళాలు చేయుటకు ఒప్పుకున్నాము .వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చుండెను. ఈ విధంగా వారు చెప్పగా విని ,షావుకారు మదిలో సంతోషించి అటువంటి ప్రభువు లేక్కడుందురో ? చనిపోయిన రాకుమారుడు బ్రతికి కూర్చుండెను .నా ఓడలు ఓడలు ఒడ్డున అడ్డుకొని యున్నవి నేను ఈ ఒడపై వెళ్లి వస్తాను నా ఇంటికి సుఖంగా చేరుకుంటాను . నాకు వ్యాపారంలో నష్టము రాక పోయినట్లయిన ప్రభువులవారికి ఐదు మేళాలు చేస్తాను. ఇట్లు మనస్సులో సంకల్పించుకొని ఓడపై కూర్చుని నడిపించుకొని వెళ్ళిపొయినాడు. పైదేశము వెళ్లి అచ్చట గొప్ప లాభము పొంది తిరిగి వచ్చి ఓడ నడిబొడ్డున లంగరు వేయించి ఇంటికి వెళ్ళినాడు.
 
; మేళా చేయక పోవుటచే ఓడ మునుగుట :
తన నౌకర్లందరూ ఓడ లోని ధనము మోసుకొని పోయినారు.ధనమును ఇంటిలో వేసుకుని షావుకారు సంతోషముతో ఉన్నాడు. ధనం చూచి ప్రభువులవారి మేళాలు మరిచెను . అందుకు ప్రభువులకు కోపము కలిగి దండన వేసినారు ఓడ నీటిలో మునిగిపోయినది . నౌకర్లు, ఓడలో నున్న వారందరూ నీటిలో మునిగి పోయిరి .అది తెలిసిన అతను కూడా భూమిపై పడి గోల పెట్టినాడు. మరి కొంత సేపటికి తెలివి తెచ్చుకుని ఏడ్చు చుండగా ఆకాశములో నుండి త్రినాధులు నీవు మాకు మేళాలు ఇచ్చినావు కావు. అందుచేతనే ఓడ మునిగినది . నీవు ఐదు మేళాలు సమర్పించి నట్లయిన నీ ఓడ నీకు ప్రాప్తించును. అని సెలవిచ్చినారు అది విని షావుకారు మదిలో దుఃఖించి ముందు నేను సంకల్పము చేసియుంటిని ప్రభువుల మహిమను మరచితిని ఇప్పుడే త్రినాదులవారికి మేళా ఇస్తాను. అని మదిలో నిశ్చయించుకొని మేళాకు కావలసిన సామాగ్రి తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభువులవారికి మేళా సమర్పించి ప్రార్ధించినాడు .నీటిలో మునిగిపోయిన ఓడ వెంటనే పైకి తేలినది .అదిచూచి పట్టలేని సంతోషము పొందెను పరిచారకలు నౌకర్లు, ఓడలో గల మిగిలిన ధనము కొని పోయినారు. ధనము మోయించి షావుకారు ఇంటిలో ప్రవేశించెను.గంజాయి ఆకులు ,చెక్కలు అన్నీ స్వామి వారికి మేళా సమర్పించి సాష్టాంగ దండ ప్రణామంబులు చేసినారు .రాజ్యమంతా త్రినాధ స్వామి మేళా గురించి ప్రకటనలు పంపించి నారు.మేళాను చూచుటకు అంతా వస్తున్నారు .
 
==ఫలశ్రుతి==
"https://te.wikipedia.org/wiki/త్రినాథ_వ్రతకల్పం" నుండి వెలికితీశారు