క్షీరసాగర మథనం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 75:
::భారతి యెక మంచితారహారము నిచ్చెఁబాణిపద్మము నిచ్చెఁబద్మభవుఁడు
 
సముద్రుడు ఆమెకు పట్టు బట్టలు ఇస్తాడు. వరుణుడు వైజయంతి మాల ఇస్తాడు. విశ్వకర్మ సువర్ణ అలంకారలు ఇస్తాడు. ఆమె వైపే ఓర చూపుతో చూస్తున్న విష్ణువు చెంత చేరి లక్ష్మీ దేవి(శ్రీదేవి), దేవదానవులతో, "మీ ఎవ్వరితో చేరినా సుఖం ఉండదు. శ్రీమహావిష్ణువు చెంత ఉంటే నిత్య సుమంగళి గా ఉంటాను" అని చెప్పి మహావిష్ణువు మెడ లో పూల మాల వేసింది. అప్పుడు సముద్రుడు [[కౌస్తుభమణి]] ని తీసుకొని విష్ణువుకి ఇచ్చాడు. విష్ణువు ఆ కౌస్తుభమణి తో పాటు మహాలక్ష్మిని తన వక్ష స్థలం పై విరాజిల్లచేశాడు.

::::మ్రోసెన్ శంఖ మృదంగ వేణు రవముల్ మున్నాడి పెంజీఁకటుల్
::::వాసెన్ నర్తన గానలీలల సురల్ భాసిల్లిరార్యుల్ జగ
::::ద్వాసుల్ విష్ణుని బ్రహ్మ రుద్ర ముఖరుల్ దల్లింగమంత్రంబులం
::::బ్రాసక్తిన్ వినుతించి రుల్లసిత పుష్పశ్రేణి వర్షింపుచున్

దేవదానవులు మళ్లీ మథనం ఆరంభించారు. అప్పుడు [[వారుణి]] (సుర లేదా కల్లు) పుట్టింది. వారుణి తమకు కావాలని రాక్షసులు అడుగగా వారుణి ని దానవులకు ఇస్తారు. క్షీరసాగర మథన సమయంలో ఎన్నో అనర్ఘమైన వస్తువులు ఉద్భవించాయి. అన్నింటినీ దేవతల లోని ముఖ్యులు పంచుకున్నారు. రాక్షసులకు మాత్రం సురాభాండాన్ని ఇచ్చారు, స్వేచ్ఛగా సురను త్రాగి, సాగర మథనం చేసిన శ్రమను పోగొట్టుకోవడానికి(కాబోలు).
 
== క్షీరసాగర మథన సమయం లో పుట్టిన అనర్ఘ రత్నాలు ==
"https://te.wikipedia.org/wiki/క్షీరసాగర_మథనం" నుండి వెలికితీశారు