దక్షిణ భారతదేశం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 3:
==ఉపోద్ఘాతం==
దక్షిణ భారతీయులు ముఖ్యంగా [[ద్రవిడ భాషలు]] మాట్లాడెదరు అనగా [[తెలుగు]], [[తమిళం]], [[కన్నడ]], [[మలయాళం]].కానీ కొన్నిచోట్ల [[కొంకణి]], [[తుళు]] వంటి భాషలు కూడా మట్లాడెదరు. దక్షిణ భారతాన్ని ఎందరో రాజులు పరిపాలించారు. అందులో ముఖ్యులు [[శాతవాహనులు]], [[ఆంధ్ర ఇక్ష్వాకులు]], [[చోళులు]], [[పాండ్యులు]], [[చేరులు]], [[చాళుక్యులు]], [[రాష్ట్రకూటులు]], [[హొయసల సామ్రాజ్యం|హొయసల]] మరియు [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర రాజులు]]. దక్షిణ భారత రాజవంశాలు [[శ్రీలంక]] మరియు [[శ్రీవిజయ]]లను జయించడం వలన ఇప్పటికీ దక్షిణ భారత సాంస్కృతిక ప్రభావం వారి జీవన విధానాలలో కనిపిస్తుంది.
ఇచట వ్యవసాయం ప్రధాన వృత్తి. మొత్తం స్థూల ఉత్పత్తిలో [[వ్యవసాయం|వ్యవసాయాని]]దే మొదటి స్థానం. [[సాఫ్టువేరు]] రంగం ఇచట చాలా వేగంగా విస్తరిస్తోంది. దేశంలోని సాఫ్టువేరు ఉత్పత్తిలో అధికశాతం దక్షిణ భారతదేశంలోని నగరాలలోనే తయారవుతోంది. చలన చిత్ర రంగం లో కూడా దక్షిణాది తనదైన ప్రత్యేకతతో ప్రపంచం లోని వివిధ దేశాల ప్రజలను అలరిస్తోంది. దక్షిణ భారతదేశంలోని ప్రజలు దేశంలోని మిగిలిన ప్రజలకన్నా [[విద్యారంగం]]లో ముందుండి అత్యధిక [[తలసరి ఆదాయం]] కలిగియున్నారు. ఇచటి విద్యారంగం మరియు వ్యవసాయం రెండు వేల సంవత్సరాలుగా తన వైశిష్ట్యాన్ని, ప్రత్యేకతను చూపుతున్నాయి. ఇచటి రాజకీయాలలో ప్రాంతీయ పార్టీల ప్రభావం అధికం.
పంక్తి 83:
దక్షిణ భారతంలో ద్రవిడ భాషలు ప్రధానమైనవి. ద్రవిడ భాషలు సుమారుగా 73 ఉన్నాయి. <ref>[http://www.ethnologue.com/show_family.asp?subid=90422 Language Family Trees - Dravidian.] [[Ethnologue]].</ref>. ద్రవిడ భాషల పుట్టుక మరియు వివిధ భాషల తో సంబంధం గురించి వివిధ బాషా శాస్త్రజ్ఞులు వేరు వేరు రకాలుగా చెపుతారు. 1816 లో బ్రిటిష్ అధికారి అయిన ఫ్రాన్సిస్ ఎలిస్ (Francis W. Ellis) ద్రవిడ భాషలను ఏ ఇతర భాషా సమూహానికి చెందని భాషలుగా అభివర్ణించాడు. ద్రవిడ భాషల్లో ప్రధానమైనవి [[తెలుగు]], తమిళం, కన్నడ మరియు మలయాళం. ద్రవిడ భాషలను దక్షిణ ద్రవిడ భాషలు, దక్షిణ మధ్య ద్రవిడ భాషలుగాను విభజించవచ్చు. తమిళం, మలయాళం, కన్నడ మరియు తులు భాషలను దక్షిణ ద్రవిడ భాషలుగాను; తెలుగు మరియు గోండి లను దక్షిణ మధ్య ద్రవిడ భాషలుగాను విభజించారు. 1956 లో ఏర్పడిన భాషాప్రయుక్త రాష్త్రాలలో ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాలుగా విభజించారు.
2001 జనాభా లెక్కల ప్రకారం తెలుగు 8 కోట్లతో హిందీ తరువాతి స్థానాన్ని ఆక్రమించింది. 6.4 కోట్లతో తమిళం, 5 కోట్లతో కన్నడ మరియు 3.57 కోట్లతో మలయాళం తరువాతి స్థానాలు ఆక్రమించాయి. తెలుగు,తమిళం,కన్నడ,సంస్కృతం భాషలను భారత దేశ ప్రభుత్వం ప్రాచీన భాషలుగా(Classical Languages) గుర్తించింది. ఈ నాలుగు భాషలను జాతీయ భాషలుగా గుర్తించారు. [[ఇండో-ఆర్యన్]] సమూహానికి చెందిన కొంకణి భాషను [[గోవా]], [[కోస్తా కర్ణటక]], [[కేరళ]] మరియు [[మహారాష్ట్ర]]ల యందు విరివిగా మాట్లాడుతారు. [[కొంకణి]] భాష మీద కన్నడ మరియు మలయాళం భాషల ప్రభావం ఎక్కువగా వుండి ఈ రెండు భాషలనుండి చాలా పదాలను అరువు తెచ్చుకుంది. ఉత్తర దక్కను మరియు కొంకణ్ ప్రాంతాలలో [[మరాఠి]] ఎక్కువగా మాట్లాడుతారు. [[బార్కూరు]] సమీపంలో [[తులు]] బాషలో వున్న శాసనాలు (inscriptions) లభ్యమయ్యాయి. వీటిని జాగ్రత్త పరచడం ఎంతైనా అవసరం.
==ఆదాయ వనరులు==
పంక్తి 116:
డిఎంకె పార్టీ మొట్ట మొదటి సారిగా 1968లోనూ మరలా 1978 లోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే తరువాతి సంవత్సరమే [[ఎం జి రామచంద్రన్]] డిఎంకె నుంచి విడిపోయి [[ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం]] (AIADMK) ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం ఈ రెండు పార్టీలే తమిళనాడులో 60% శాతం వోటుబ్యాంకును కలిగి ఉన్నాయి.
[[ఆంధ్ర ప్రదేశ్]] లో మెజారిటీ కుసస్థులు [[
[[బొమ్మ:Soudha.jpg|thumb|left|200px|[[బెంగళూరు|బెంగలూరు]] లోని [[కర్నాటక]] అసెంబ్లీభవనం [[విధాన సౌధ]].]]
|