గయోపాఖ్యానం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
యమునా తీరంలో విహరిస్తూ శ్రీకృష్ణుడు తన చెలిగాడు కౌశికునితో తన శైశవ క్రీడలు వర్ణిస్తూ సంధ్యావందన సమయం సమీపించడంతో యమునా నదిలో దిగి దోసిలిలో నీరు తీసుకొని, సూర్యభగవానునికి అర్ఘ్యమిస్తూండగా నిష్ఠీరవం (ఉమ్మి) అతని దోసిలో వడుతుంది. శ్రీ కృష్ణునికి కోవం వచ్చి ఆ నిష్ఠీరవం వేసింది ఎవరని యమునా నదిని అడుగుతాడు. చిత్రరధుడనే గంధుర్వుడు (గయుడు) ఈ దుష్కార్యానికి పాల్పడడ్డాని తెలియడంతో అతనిని తన చక్రధారలతో ఖండిస్తానని తీవ్రంగా ప్రతిజ్ఞ చేస్తాడు. ఆకాశ యానం ముగించుకున్న గయుడు తన భార్యతో తన ఆకాశయాన విశేషాలను చెబుతు ఉండగా అతని పట్టపు ఏనుగు మరణించిందని వార్త తెలుస్తుంది. దానికి విచారిస్తున్న చిత్రరధునికి శ్రీకృష్ణుని ప్రతిజ్ఞ ఆకాశ వాణి ద్వారా తెలియ వస్తుంది. ప్రాణభీతితో గయుడు శంకరుని మొదలుకొని అందరినీ శరణు కోరతాడు. అతనికి అభయం లభించదు. ఆ సమయంలో నారదుడు ద్వైతవనంలో ఉన్న అర్జునుని శరణుకోరమని సలహా ఇస్తాడు. శ్రీకృష్ణునికి అత్యంత ఆప్తుడైన అర్జునుడు తనకు శ్రీకృష్ణుని వలన ప్రాణభయం కలింగిందంటే ఏ విధంగా అభయమిస్తాడని సందేహం వ్యక్తం చేస్తాడు గయుడు. అందుకు నారదుడు ముందుగా శరణు కోరి పిమ్మట తనకు ఆపద ఎందుకు వచ్చిందో తెలుప మంటాడు. అదే విధంగా గయుడు ఆర్తనాదం చేస్తూ అర్జునుని సమీపిస్తాడు. ఆర్తత్రాణ పరాయుణుడైన అర్జునుడు ఆర్తనాదం వింటూనే గయునికి అభయమిస్తాడు. గుయుడు ప్రాణభయం తీరి సేదతీరిన పిమ్మట శ్రీకృష్ణుని వలన తనకు ప్రాణభయం కలిగిందని తెలియ చేస్తాడు. అది తెలిసి అర్జునుడు నివ్వెరపోతాడు. జరిగిన విషయాన్ని అన్నదమ్ములతో చర్చిస్తాడు. అందరూ అర్జునుని సమర్ధిస్తారు కానీ, శ్రీకృష్ణునితో వైరం వచ్చిందని ఆందోళన చెందుతారు. శ్రీకృష్ణుని అక్రూరుని గయుని వదలమని రాయబారం పంపుతారు. అక్రూరుని సాదరంగా ఆహ్వనించిన పాండవులు, శ్రీకృష్ణుని పట్ల గౌరవం చూపుతూ ఆర్తత్రాణపరాయణత్వాన్ని వదలలేమని సున్నితంగా చెబుతారు. శ్రీకృష్ణుడు సభద్రను రాయబారం పంపుతాడు. అర్జునుడు ఆమె మాటలకు కోపగించుకొని, భర్త ఎంత అనురాగం చూపినా, ఆడవాళ్లకు పుట్టింటి వాళ్లపైన మమకారం ఎక్కువని నిందిస్తాడు. తిరిగివచ్చిన సుభద్ర శ్రీకృష్ణుని అనునింప చూస్తుంది. శ్రీకృష్ణుడు ఆడవాళ్లు పుట్టిళ్లను గుల్ల చేసి మధ్యవచ్చిన భర్త అంటే పడి చస్తారని నిష్ఠూరమాడతాడు. రాయబారం విఫలమవ్వడంతో శ్రీకృష్ణార్జునుల మధ్య యుధ్దం మొదలవుతుంది. యుధ్దం తీవ్రతరమవుతుంది. లోకాలు అల్లకల్లోలం కావడంతో శంకరుడు ప్రత్యక్షమై శ్రీకృష్ణార్జునులు నరనారాయణాంశతో జన్మంచిన వారని వారి మధ్య వైరం లోకానికి హితం కాదని నచ్చచెపుతాడు. శ్రీకృష్ణార్జునులు శాంతిస్తారు. యుధ్దం ముగుస్తుంది. గయుని శ్రీకృష్ణుడు క్షమించి ప్రాణదానం చేస్తాడు.
== పాత్రధారణలో అలరించిన నటులు ==
చిలకమర్తి లక్ష్మినరసింహం గారు నాటకం రచించినరచించ గానే అప్పట్లో యువకులైన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు వారి బృందంతో ఈ నాటకాన్ని ప్రదర్శించే వారట. టంగుటూరి ప్రకాశం గారు అర్జునుని పాత్ర ధరించేవారట. వారు నిటలాక్షుండిపుడెత్తి వచ్చిననురానీ అన్న పద్యం చదివే తీరు చిలకమర్తి లక్ష్మీనరసింహం గారికి ఎంతో నచ్చేదట. వారు పదే పదే ఆ పద్యాన్ని వారిచేత చదివి వినిపించుకునే వారట.<br />
బందా కనకలింగేశ్వర రావు, పీసపాటి నరసింహమూర్తి ఈ నాటకంలో శ్రీ కృష్ పాత్ర ధారణకు ఎంతో పేరు గడించారు. పీసపాటి నరసింహమూర్తి, బి.వి.రంగారావు అర్జునుని పాత్రకు పెట్టింది పేరు. ధూళిపాల సీతారామశాస్త్రీ గయుడి పాత్రకు తనదైన వరవడి సృష్టించుకున్నారు.
 
==ఇవి కూడా చూడండి==
* [[శ్రీకృష్ణార్జున యుద్ధము]] - గయోపాఖ్యానం కథ ఆధారంగా నిర్మించిన రమణీయమైన తెలుగు సినిమా.
"https://te.wikipedia.org/wiki/గయోపాఖ్యానం" నుండి వెలికితీశారు