రెడ్డి రాజవంశం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: కొండవీడు రెడ్డిరాజుల రాజధాని. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{వికీకరణ}}
కొండవీడు రెడ్డిరాజుల రాజధాని. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా [[కొండవీడు]] గ్రామంలో ఉన్న కోటను కొండవీటి కోట అంటారు. దీనికి చారిత్రకంగా చాలా ప్రాముఖ్యత ఉంది. 13వ శతాబ్దంలో ఒరిస్సా రాజులు ఈ కోట నిర్మాణం చేపట్టారని చెప్తారు. ఈ ప్రాంతాన్ని రెడ్డి రాజులు 1328 నుంచి 1428 వరకు పరిపాలించారు. కొండవీటి కోటలో ప్రధానమైన కోటతో పాటు మరో రెండు కోటలు కూడా ఉన్నాయి. రెడ్డి రాజులలో మొదటివాడైన ప్రోలయ వేమారెడ్డి ముందుగా ప్రధానకోటను నిర్మించారని చరిత్రకారులు భావిస్తున్నారు. 1353 వరకు కొండవీటి ప్రాంతాన్ని పాలించిన ప్రోలయ వేమారెడ్డి రాజ్యరక్షణ వ్యవస్థను బలోపేతం చేయటానికి అనేక కోటలు నిర్మించాడు. ఆ కోటల్లో ఒకటి కొండవీటి కోట. ఆయన రాజధానిని అద్దంకి నుంచి కొండవీటికి మార్చారు.
 
సుమారు వేయి అడుగులకు పైగా ఎత్తులో ఉన్న ఈ కోట ఆ ప్రాంతంలో కెల్లా దృఢమైనది. కోట లోపల 21 రకాల నిర్మాణాలు ఉన్నట్లుగా గుర్తించారు. ఈ కోటలోకి వెళ్లటానికి రెండు ప్రధాన ద్వారాలు ఉంటాయి. వాటిలో ఒకటి కోలపల్లి దర్వాజా, మరొకటి నాదెండ్ల దర్వాజా. ప్రవేశ ద్వారాన్ని గ్రానైట్ రాళ్లతో మూడంతస్తులుగా నిర్మించారు. ఈ కోటలో నివసించే వారికి మూడు ముఖ్యమైన చెరువుల ద్వారా నీటి సరఫరా జరిగేది. అవి ముత్యాలమ్మ చెరువు, పుట్టలమ్మ చెరువు, వేదుల్ల చెరువు.
"https://te.wikipedia.org/wiki/రెడ్డి_రాజవంశం" నుండి వెలికితీశారు