జి.కిషన్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
| source =
}}
'''జి.కిషన్ రెడ్డి''' (G.Kishan Reddy) [[భారతీయ జనతా పార్టీ]]కి చెందిన యువనేత. . [[1964]]లో [[రంగారెడ్డి జిల్లా]] తిమ్మాపురం గ్రామంలో జన్మించిన కిషన్ రెడ్డి సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి [[మార్చి 6]], [[2010]]న భాజపా [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 07-03-2010</ref> 1980లో పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం సేవలందిస్తున్న కిషన్ రెడ్డి 2004 శాసనసభ ఎన్నికలలో తొలిసారిగా [[హిమాయత్‌నగర్ శాసనసభ నియోజకవర్గం|హిమాయత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం]] నుండి ఎన్నికయ్యాడు. 2009లో [[అంబర్‌పేట్ అసెంబ్లీ నియోజకవర్గం]] నుండి ఎన్నికై <ref>సూర్య దినపత్రిక, తేది 17-05-2009</ref>వరుసగా రెండోపర్యాయం రాష్ట్ర శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. జనవరి 19, 2012న మహబూబ్‌నగర్ జిల్లా కృష్ణా గ్రామం నుంచి 22 రోజులపాటు తెలంగాణ ప్రాతంలో కొనసాగే భాజపా పోరుయాత్ర ప్రారంభించాడు.
==వ్యక్తిగత జీవితం==
1964, మే 15న జి.స్వామిరెడ్డి, ఆండాలమ్మ దంపతులకు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురం గ్రామంలొ కిషన్ రెడ్డి జన్మించాడు. టూల్ డిజైనింగ్‌లో డిప్లోమా చేసిన కిషన్ రెడ్డి 1995లో కావ్యను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు సంతానం (వైష్ణవి, తన్మయ్).<ref>http://www.kishanreddy.com/biodata.html</ref>
"https://te.wikipedia.org/wiki/జి.కిషన్_రెడ్డి" నుండి వెలికితీశారు