గరిమెళ్ల సత్యనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Garimella Satyanarayana1.JPG|thumb|శ్రీకాకుళంలోని గరిమెళ్ళ సత్యనారాయణ విగ్రహం.]]
[[File:Garimella Satyanarayana2.JPG|thumb|శ్రీకాకుళంలోని గరిమెళ్ల సత్యనారాయణ విగ్రహం.]]
[[File:Garimella Satyanarayana3.JPG|thumb|గరిమెళ్ళ సత్యనారాయణ విగ్రహం క్రిందనున్న సమాచాల ఫలకం.]]
స్వాతంత్ర్యోద్యమ కవుల్లో '''గరిమెళ్ళ సత్యనారాయణ'''ది విశిష్టమైన స్థానం. గరిమెళ్ళ గేయాలు జాతీయ వీరరసంతో తొణికిసలాడుతూ పాఠక జనాన్ని ఉర్రూతలూగించాయి. అతను వ్రాసిన '''' మా కొద్దీ తెల్ల దొరతనం .... "''' పాట సత్యాగ్రహులకు గొప్ప తెగువను, ఉత్తేజాన్ని కలిగించింది. అలాగే " దండాలు దండాలు భారత మాత ' అనే గీతం కూడా ప్రజలను ఎంతగానో జాగృతం చేసి స్వాతంత్ర్య ఉద్యమంలోకి ఉరికే తెగువను కలగజేసింది.
దేశభక్తి కవితలు వ్రాసి జైలుశిక్ష అనుభవించిన వారిలో ప్రధముడు గరిమెళ్ళ. నిజాయితీకి, నిర్భీతికి గరిమెళ్ళ మారుపేరుగా నిలిచాడు. మాకొద్దీ తెల్ల దొరతనం పాట ఆనాడు ప్రతి తెలుగు వాడి నోటా మార్మోగేది. ఆయనంత ప్రసిద్ధినొందిన జాతీయకవి ఆ రోజుల్లో మరొకరులేరు. తెలుగునాట జాతీయ కవిత్వానికి ఒరవడి పెట్టిన కవి ప్రముఖుడు గరిమెళ్ళ.