పండూరివారి మామిడి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
==చరిత్ర==
పూర్వం [[ఆంధ్ర క్షత్రియులు]] (రాజులు) తమ రాజ కోట బృందావనాల్లో ఈ రకం చెట్లు పెంచుకొనేవారు. ఆ కాలంలో రాజులు ఈ కాయల రుచిని ఆస్వాదించేవారు, తమ రాయల్టీ నిలబెట్టుకోవడం కోసం బంధువులకు, స్నేహితులకు, మిత్ర సామ్రాజ్యపు రాజులకు పంచిబెట్టుకునేవారు. ఒకప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వెలగదురు గ్రామ పరిసర ప్రాంతాలలో పురాతన పండూరివారి మామిడి చెట్టు ఉండేది. దీని ఆవిర్బావం గురించి చాలా కధనాలు ఉన్నాయి. ఒక కధనం ప్రకారం దొంగలు రాజుల ఉద్యాలవనం నుండి ఒక మామిడి కాయను దొంగిలించి వెలగదురు ప్రాంతంలో టెంకను పాతారు. ఆ తల్లి చెట్టు మరణించే సమాయానికి దాని నుండి చాలా అంట్లు కట్టుట జరిగింది. ఉభయ గోదావరి జిల్లాల్లో నేటికీ రాజులు తమ రాయల్టీ నిలబెట్టుకోవడానికి ఇతరులకు పంచిబెట్టుకుంటారు. అయితే పండూరివారి మామిడి రకం పుట్టు పూర్వోత్తరాలు, నామ ధేయ పూర్వోత్తరాలు మాత్రం లభ్యం కాలేదు.
 
==ప్రస్తుత పరిస్థితి==
 
ఇటీవల పండూరివారి మామిడి జాతి అంతరించిపోవుచున్నది. అయితే ఈ జాతిని కాపాడటం కోసం ఫారెస్టు డిపార్టుమెంట్ వారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు, తూర్పుగోదావరి జిల్లా కడియపులంకలో నర్సరీల వారు పండూరివారి మామిడి అంట్లను కట్టి అమ్ముతున్నారు. అంట్ల విధానం (గ్రాఫ్టింగ్ ) వల్ల నేడు దాదాపుగా ఉభయ గోదావరి జిల్లాలలో చాలా చోట్ల పండూరివారి మామిడి చెట్లు విస్తరించాయి.
 
==ఇంకా చదవండి==
"https://te.wikipedia.org/wiki/పండూరివారి_మామిడి" నుండి వెలికితీశారు