స్వాతి కిరణం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపమైన వాడు గురువు. తల్లిదండ్రులను గురువును దైవంగా భావించాలి. ఇది మన సాంప్రదాయం. శిష్యులకు మార్గదర్శకుడు గురువు. తాము చూపిన మార్గంలో ప్రజ్ఞాపాటావాలలో తమను అధిగమిస్తే గురువుకు అంత కంటే గర్వకారణం ఇంకేముంది..ప్రతిభ ఒకరి స్వంతం కాదు.. ప్రతిభ ఎక్కడ ఉన్నా దాన్ని ప్రోత్సహించాలి..దానికి పదును పెట్టాలి..కొత్తతరానికి పాత తరం దారి చూపాలి..దారి ఇవ్వాలి.. ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం లో గొప్పతనం ఉంది.. కానీ శిష్యుల ఉన్నతిని కోరని గురువులు, తమని మించి పోతారనే భావనతో శిష్యుల భవిష్యత్తును సమాధి చేస్తారు.. శిష్యుల ప్రజ్ఞను తమ ప్రగతికి సోపానం గా మార్చుకునే గురువులూ ఉన్నారు.. వారు ఏకలవ్యుని బొటన వ్రేలుని గురుదక్షిణ కోరిన ద్రోణుడికి ప్రతి రూపాలు.. ఆ కోవకి చెందిన సంగీత విద్వాంసుడు అనంత రామశర్మ.. బాల మేధావి గంగాధరం..గంగాధరాన్ని మాతృభావంతో చేరదీసే అనంతరామశర్మ భార్య.. వీరి మధ్యనడచిన కథ స్వాతికిరణం.
== చిత్రకథ ==
దేశాలు పట్టి తిరుగుతూ ఉంటే ఒక దేశదిమ్మరి (మమ్ముటి) ని పిల్లలను పట్టుకు పోయేవాడని భ్రమించిన పల్లె వాసులు అతణ్ని పోలీస్ స్టేషన్లో అప్పజెబుతారు..అక్కడ సబ్ ఇన్సపెక్టర్ (అచ్యుత్) దేశదిమ్మరిని అనంత రామశర్మగా పోలుస్తాడు.. <br />
కథ గతంలో కి వెళ్తుంది. <br />
అత్యంత ప్రతిభా పాటవాలు ఉన్న బాల సంగీత విద్వాంసుడు గంగాధరం (మాస్టర్ మంజునాధ్)..అతని తల్లి దండ్రులు (ధర్మవరపు సుబ్రహ్మణ్యం, డబ్బింగ్ జానకి) ఒక చిన్న హొటల్ నడుపుకుంటూ ఉంటారు.. పక్షితీర్ధం మామ్మ (జయంతి) గారి దగ్గర సంగీతం నేర్చుకుంటూ ఉంటాడు గంగాధరం.. స్ధానిక దేవాలయంలో ఉత్సవాలకు వచ్చిన అనంత రామశర్మ కు ఆధిత్యం ఇచ్చే అవకాశం వస్తుంది పక్షితీర్ధం మామ్మగారికి.. గంగాధరం ప్రతిభ గమనించిన పక్షితీర్ధం మామ్మగారు గంగాధారాన్ని అనంత రామశర్మ కి శిష్యునిగా చేద్దామను కుంటుంది.. కానీ బాల చాపల్యంతో, దేవాలయంలో అనంత రామాశర్మగారు మంత్రపుష్న్నాన్ని చదివిన విధానాన్ని దృష్టిలో ఉంచుకొని పురుష సూక్తాన్ని ఆకతాయి తనంతో పాడతాడు.. ఆగ్రహిస్తాడు అనంత రామశర్మ..గణపతి సచ్చినాంద స్వాముల వారు వారి ఆశ్రమంలో ఉన్న సరస్వతీ స్తోత్రాలను స్వర పరిచే అవకాశం అనంత రామశర్మకు దక్క్తుతుంది.. ఇంతలో కాలేజి లో జరిగే ఆడిషన్ కి గంగాధరాన్ని తీసుకు వస్తారు పక్షితీర్ధం మామ్మగారు.. ఆ సందర్భంగా అనంత రామశర్మ ఇంటికి వచ్చిన గంగాధరం, అనంత రామశర్మ స్వర పరచిన పాట వింటాడు.. కాలేజి లో ఆడషన్ లో మరో స్వరం తో అదే పాట వినిపిస్తాడు..అనంత రామశర్మ గంగాధరం దరఖాస్తుని తిరస్కరిస్తాడు..అనంత రామశర్మ నిస్సంతు.. అతని భార్య (రాధిక) గంగాధరాన్ని తమ వద్ద ఉంచుకుందామంటుంది.. గంగాధరం ప్రతిభకు లోకమంతా నీరాజనం పట్టినా అనంత రామశర్మ గంగాధరానికి ఇంకా శిక్షణ కావాలంటూ ఉంటాడు.. అనంత రామశర్మ వలన కాని స్వర రచన ను గంగాధరం ప్రయత్నిస్తాడు..ఆ స్వరరచన ఆమోదయోగ్యంగా లేదంటునే ఆ స్వరాలను భద్రపరచుకుంటాడు.. తనని అధిగమిస్తాడనే అభద్రతా భావంతో రగిలి పోతున్నాడని పోలీస్ సబ్ ఇన్స్ పెక్టర్ గా సెలక్టై ట్రైనింగ్ అవుతున్న పక్షితీర్ధం మామ్మగారి మేనల్లుడు గ్రహిస్తాడు.. అనంత రామశర్మ అసూయతో గంగాధరం మరణానికి కారణ భూతమవుతాడు.. ఈ సంఘటన తో అనంత రామశర్మ భార్యకు మతి భ్రమిస్తుంది..<br />
కథ ప్రస్తుతానికి వస్తుంది..<br />
అనంత రామశర్మ పక్షితీర్ధం మామ్మగారి ఇంటి దగ్గర దించిన తరువాత అనంత రామశర్మకు స్వస్తత చేకూరుతుంది.. కోలుకున్న అనంత రామశర్మ భార్య గంగాధరం పేరు మీద సంగీత అకాడమీ స్థాపిస్తుంది .. భార్య సంగీతం నేర్పుతూ ఉంటే తరగతిలో శిష్యులలో కూర్చొంటాడు అనంత రామశర్మ.. పాఠాన్ని సాధన చేస్తూ ఉన్న అనంత రామశర్మను శృతి సరి చేసుకోమంటుంది సంగీతం నేర్చుకుంటున్న బాలిక.. దానితో సినిమా ముగుస్తుంది..<br />
 
"https://te.wikipedia.org/wiki/స్వాతి_కిరణం" నుండి వెలికితీశారు