సగ్గుబియ్యం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
 
*సగ్గు బియ్యాన్ని ఎలా తయారు చేస్తారు?.
సగ్గి బియ్యం తయారికి ముడి సరుకు కర్ర పెండలము. దీన్ని భూమిని నుండి త్రవ్వి బయటకు తీసిన 24 గంటల లోపు సగ్గు బియ్యం తయారీ కేంద్రానికి చేర్చాలి. ఆ దుంపలను నీటిలో బాగా శుబ్రంచేసి దానిపైనున్న తొక్కను యంత్రాలతో తొలిగిస్తారు. గతంలో ఈపనిని స్త్రీలు చేసే వారు. తొక్క తీసిన దుంపలను మరొక్కసారి నీళ్ళలో శుబ్ర పరుస్తారు. అప్పుడు ఆ దుంపలను క్రషర్ లో పెట్టి పాలను తీస్తారు. చెరుకు నుండి చెరుకు రసాన్ని తీసే పద్దతిలోనే ఈ దుంపలనుండి పాలను తీస్తారు. దుంపలనుంది వచ్చిన పాలు ఫిల్టర్ లలోనికి, అక్కడి నుండి సర్క్యులేటింగ్ చానల్స్ లోనికి వెళతాయి. ఈ క్రమంలో - పాలు లోని చిక్కని పదార్థం ముద్దలా ఉంటుంది. దానితోనే సగ్గు బియ్యం తయారు చేస్తారు. ఈ పిందిని వివిద రకాల పరిమాణంలో రంద్రాలున్న జల్లెడ లాంతి పాత్రలోకి వెళుతుంది. ఆ జల్లెడ అటు ఇటు కదులుతున్నందున ఆ జల్లెడ రంద్రాలనుండి తెల్లతి బాల్సు జల జలా రాలి పడతాయి. అప్పుడు అవి మెత్తగా వుంటాయి. వాటిని పెద్దపెనం మీద వేడి చేస్తారు. ఆ తరువాత వాటిని ఆరుబయట ఎండలో ఆర బెడతారు. ఇలా సుమారు 500 కిలోల దుంపల నుండి 100 కిలోల సగ్గు బియ్యం మాత్రమే తయారవుతాయి.
ఇది సగ్గు బియ్యం తయారీ విధానం:
మూలం: ఆది వార ఆంధ్ర జ్యోతి 3 జూన్, 2012.
"https://te.wikipedia.org/wiki/సగ్గుబియ్యం" నుండి వెలికితీశారు