సిద్దేంద్ర యోగి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
విస్తరణ జరుగుచున్నది |
విస్తరణ జరుగుచున్నది |
||
పంక్తి 1:
▲[[బొమ్మ:SiddEMdra yOgi.jpg|right|220px|సిద్దేంద్ర యోగి ]]
▲[[బొమ్మ:SiddEMdra yOgi text.jpg|right|220px|సిద్దేంద్ర యోగి ]]
''' సిద్ధేంద్ర యోగి''' (1672 - 1685) ప్రసిద్ధ [[కూచిపూడి (నృత్యము)|కూచిపూడి]] నాట్యాచార్యుడు. కూచిపూడి నాట్యానికి ఇతను మూలపురుషుడని జనశ్రుతిలోని మాట. ఇతడు ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లాకు చెందిన [[కూచిపూడి]] గ్రామానికి చెందినవాడు. ఇతని గురువు [[నారాయణ తీర్థులు]].
==జీవితం==
సిద్ధేంద్రయోగి జీవితాన్ని గురించి స్పష్టమైన ఆధారాలు లేవు. కనుక జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్న కథలే ప్రస్తుతం లభించిన ఆధారాలు. సిద్ధేంద్రయోగి పూర్వనామం సిద్ధప్ప అనీ, ఇతడు కూచిపూడి వాస్తవ్యుడనీ అనుకోవచ్చును. కూచిపూడి, మొవ్వ, శ్రీకాకుళం, ఘంటసాల ప్రాంతాలు అప్పుడు సమీపంలోనే ఉన్న సాంస్కృతిక కేంద్రాలు. సిద్ధేంద్రయోగి గురువైన నారాయణ తీర్ధులు 1580-180 మధ్యకాలంవాడు కావడం వలనా, సిద్ధేంద్రయోగి సమకాలికుడైన [[క్షేత్రయ్య]] 1590-1675 కాలంలో ఉన్నాడనడంవల్లా, సిద్ధేంద్రయోగి 1600-1700 మధ్యకాలంలో జీవించినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు.
ఈయన గురించి ఒక కథ ప్రచారంలో ఉన్నది. సిద్ధేంద్ర కాశీ లో చదువుకుంటున్నప్పుడు, భార్య గర్భాదానానికి సిద్ధమైనది అని కబురు వస్తుంది. యువ రక్తంలోని సహజ సిద్దమైన తొందరతో, ఆతురతతో, వేగంగా, ఉత్సాహంగా భార్య కడకు బయలుదేరి వస్తాడు, కాని, కూచిపూడి దగ్గరకు రాగానే [[కృష్ణానది]] పొంగి పరవళ్ళు తొక్కుతూ ఉంటుంది. అలలమీద అయినా నదిని దాటుదామని సిద్ధేంద్ర నదిలోకి దూకుతాడు. కాని దురదృష్టవశాత్తూ నది మధ్యలోకి రాగానే, నదిలో మునిగిపోవడం మొదలెడతాడు. 'ఇక ఎలాగైనా చావు తప్పదు' అని అనుకొని "కనీసం పుణ్యమైనా దక్కుతుందని" అక్కడికక్కడే తనకు తానే మంత్రం చెప్పుకొని సన్యాసం స్వీకరిస్తాడు. సంసార సాగరాన్ని దాటించగల ఆ కృష్ణ భగవానుడు, సిద్ధేంద్రను కృష్ణా నది కూడా దాటిస్తాడు.
Line 11 ⟶ 12:
==కూచిపూడి నాట్యం==
ప్రస్తుత కూచిపూడి నాట్యరీతి, సిద్ధేంద్ర యోగి స్థాపించిన నృత్యనాటక సంప్రదాయం, ''భాగవత మేళనాటకం'' నుండి ఆవిర్భవించింది. సిద్ధేంద్రయోగికి ముందే, అనగా 14వ, 15వ శతాబ్దాలలో కూచిపూడి భాగవతులు ఊరూరా ప్రదర్శనలిచ్చేవారని "మాచపల్లి కైఫీయతు" ద్వారా తెలుస్తున్నది. రకరకాలుగా విస్తరించిన కూచిపూడి నాట్యాన్ని సిద్ధేంద్రయోగి క్రమబద్ధం చేశాడని మనం గమనించవచ్చును.
తనను కృష్ణానదిలో మునిగి పోకుండా కాపాడిన ఆ కృష్ణుని స్తుతిస్తూ, సిద్ధేంద్ర యోగి [[పారిజాతాపహరణం]] నృత్యనాటికను వ్రాశాడనీ, అది కూచిపూడి నృత్యనాటకాలలో అతి పురాతనమైనదనీ చెబుతారు. .
|