వెంపటి చినసత్యం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[Image:CSATYAM.JPG]]
వెంపటి చిన సత్యం ఆంధ్ర నాట్యాలలో ప్రసిద్ది చెందిన [[కూచిపూడి]] నాట్యాచార్యుడు.ఈయన కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని [[కూచిపూడి]] అగ్రహారంలో 1929 అక్టోబరు 25న వరలక్ష్మమ్మ, చలమయ్య దంపతులకు జన్మించారు.కూచిపూడి నాట్యాన్ని దివంగత నాట్యాచార్యులైన వేదాంతం లక్ష్మీనారాయణశాస్త్రి, తాడేపల్లి పేరయ్యశాస్త్రి, వెంపటి పెదసత్యంల వద్ద అభ్యసించారు. సినీ నృత్య దర్శకులైన అన్న పెదసత్యం వద్ద 15 ఏళ్లపాటు నాట్యంలో మెలవకులు నేర్చుకున్నారు.చెన్నై లో భరతనాట్యమే విరాజిల్లుతున్న తరుణంలో కూచిపూడి నృత్య సంప్రదాయాన్ని చెన్నై కళాభిమానులకు పరిచయం చేసి, భరతనాట్యం చెంతన కూచిపూడికి దీటైన స్థానాన్ని సంపాదించి పెట్టారు. తన దగ్గర నృత్యం అభ్యసించే శిష్యుల వద్ద రుసుము సైతం వసూలు చేయకుండా నర్తనశాలను నిర్వహించారు.
కూచిపూడి నాట్యంలో నృత్యనాటికలను ఎన్నిటినో రూపొందించి దేశ విదేశాలలో ప్రదర్శించి వాటికి విశేష పేరు ప్రఖ్యాతులు వచ్చేలా చేసాడు.1963లో చెన్నైలో కూచిపూడి ఆర్ట్ అకాడెమీని స్థాఫించారు. వైజయంతిమాల, హెమమాలిని, మంజుభార్గవి,రాజసులోచన,ప్రభ,చంద్రకళ, రత్నపాప, పద్మామీనన్,వాణిశ్రీ,ఎన్టీఆర్‌ కుమార్తెలుపురంధేశ్వరి, భువనేశ్వరి వారి శిష్యులే.
"https://te.wikipedia.org/wiki/వెంపటి_చినసత్యం" నుండి వెలికితీశారు