వెల్దుర్తి మాణిక్యరావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
నిరంకుశ నిజాం వ్యతిరేక పోరాటయోధుడు, రాజకీయ నాయకుడైన వెల్దుర్తి మాణిక్యరావు మెదక్ సమీపంలోని వెల్దుర్తి గ్రామంలో 1913 జనవరిలో జన్మించాడు. కళాశాల విద్య సమయంలో ఉద్యమాలపై ఆకర్షితుడైనాడు. ఇతను బహుభాషా పండితుడు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, కన్నడ, మరాఠి, పారశీక భాషలలో నిష్ణాతుడు. నిజాం ధోరణికి వ్యతిరేకిస్తూ ప్రజలను ఉత్తేజపర్చడానికి అనేక మార్గాలను అంవేషించి సఫలుడైనాడు. అణా గ్రంథమాలను నిర్వహించి సాహతోపేతమైన చర్యను నిర్వహించిన ప్రజ్ఞాశీలి మాణిక్యరావు. అనేక పుస్తకాల ద్వారా నిజాం పక్షపాత ధోరణిని ఎండగడ్డాడు. ఆనాటి రాజకీయ పరిస్థితులు, రైతుల సమస్యలను ప్రచురించాడు. ఈ చిన్న పుస్తంనిజాం గుండెల్లో రైళ్ళు పరిగెత్తించింది.<ref>మెదకు జిల్లా స్వాతంత్ర్యోద్యమము, సమరయోధులు, రచన ముబార్కపురం వీరయ్య, ప్రచురణ 2007, పేజీ 66</ref> సురవరం ప్రతాపరెడ్డి సంపాదకత్వంలో వెలువడిన గోల్కొండ పత్రికలో సహాయ సంపాదకులుగా పనిచేశాడు. అందులో కూడా ప్రజాభిప్రాయాలను నిర్భయంగా ప్రకటించేవాడు. చెన్నారెడ్డి సంపాదకత్వంలో వెలువడే హైదరాబాదు పత్రికలో కూడా ఇతను ఎన్నో వ్యాసాలు రచించాడు. అడవి బాపిరాజు సంపాద్ఫకత్వంలో వెలువడే మీజాన్ పత్రికలో గేయాలు రచించాడు. హైదరాబాదు స్వాతంత్ర్యోద్యమ చరిత్ర ఇతను రచించిన రచనలలో ప్రముఖమైనది. విమోచనోద్యమం తర్వాత కూడా రచనా రంగంలో కృషిచేసి 82వ ఏట 28-07-1994 నాడు మరణించాడు.
|