రావిపూడి వెంకటాద్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{వికీకరణ}}
9.2.1922నరావిపూడి ప్రకాశం జిల్లా [[ఇంకొల్లు]] మండలం [[నాగండ్ల]] లో జననం.వెంకటాద్రి [[హేతువాది]] మాసపత్రిక సంపాదకుడు.[[మానవవాది]].1956 నుండి 1995 వరకు 40సంవత్సరాలు నాగండ్ల గ్రామ సర్పంచ్ గా పనిచేశారు.నాగండ్లలో 5.4.1943 న [[కవిరాజాశ్రమం]] స్థాపించారు.9.2.1922న ప్రకాశం జిల్లా [[ఇంకొల్లు]] మండలం [[నాగండ్ల]] లో జననం.
మానవతా విలువలు గుర్తించండి, గౌరవించండి, నిర్భయంగా జీవించండి, సాటి మానవుడిని మానవుడిగా గుర్తించండి అంటూ ఎనభై వరకు పుస్తకాలు రాసిన మానవతావాది, హేతువాది. హేతువాదానికి నమ్మకాలుండవు. సమ్మతాలు (కన్విక్షన్స్) ఉంటాయి అంటారు రావిపూడి వెంకటాద్రి. మానవవాదంతో సమాజాన్ని మానవ సంబంధాలైన ప్రేమ, ఆదరణ వైపు మళ్లించడానికి నిరంతరకృషి చేస్తున్నారు.
మానవులకు మార్గదర్శిగా హేతువాదం చేయూతనిస్తోందనీ, మూఢనమ్మకాలతో సతమతమవుతోన్నవారికి వెలుగు చూపుతోన్నదని వెంకటాద్రి నమ్మకం. హేతువాదం కూడా ఎక్కడో గాల్లోంచి పుట్టలేదు. వైజ్ఞానిక పద్ధతిలోనే పుట్టింది. ఎప్పటికప్పుడూ పరిణమిస్తూ ఉంటుంది. ప్రశ్నించే వారంతా హేతువులను కోరుతున్నట్లే లెక్క. హేతువాదానికి ఒక మతం ఉండదు. అది అన్ని మతాల్ని పరిశీలిస్తుంది. వాటి పరిణామం, పుట్టు పూర్వోత్తరాలు అన్వేషిస్తుంది.
 
ఎమ్.ఎన్. రాయ్ భావాలకు ఆకర్షితులై ''ర్యాడికల్ డెమోక్రటిక్ పార్టీ''లో చేరారు. ఆ తర్వాత మూడు సంవత్సరాలకి ర్యాడికల్ హ్యూమనిస్టు ఉద్యమంలో భాగస్వామి అయ్యారు. 1949లో భారత హేతువాద సంఘం ఏర్పాటైంది. ఆ సంఘం స్థాపన నుంచి వెంకటాద్రి అందులో సభ్యులయ్యారు.ఆంధ్రప్రదేశ్‌ హేతువాద సంఘం లో 1989 వరకు ఆ సంస్థ అధ్యక్షులుగా పనిచేశారు.1982నుంచీ 'హేతువాది' అనే మాసపత్రిక నడిపారు. 1988,1996ల్లో కవిరాజు త్రిపురనేని అవార్డు పొందారు. 1992లో తాపీ ధర్మారావు అవార్డును పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి అందుకొన్నారు.
==తెలుగు రచనలు==