ఆనాటి వాన చినుకులు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 30:
'''.......క్యాసెట్టు అయిపోయింది.నాగస్వరం ఆగిపోయింది.తన్మయత్వంతో ఆడిన పాము అక్కడ నిశ్శబ్బం ఏర్పడేసరికి 'బుస్స్ స్స్..'మని టేపురికార్డరు మీద మూడు కాట్లువేసింది.అప్పటికీ నాగస్వరం వినిపించకపోవడంతో,దగ్గరలో వున్న నాగరాజును ఏమి చెయ్యకుండా తనదారిన తను శరవేగంతో వెళ్ళిపోతుంటే మిడిగుడ్లతో ఆ పామునే చూస్తూవుండిపోయినాతడు.ఇక జన్మలో పామంటే భయపడలేదు.అలా ఆ నాగుపాము తన శరీరం మీద కాకుండా తనభయం మీద కాటు వేయడంతో ఈ జన్మకి పాము అంటే భయం పోయింది నాగరాజ్కి '''.
'''బాచి:'''బాచి రచయితకు మిత్రుడు.బాచి తత్వమేమిటో వూర్లో వారికే కాదు,రచయితకు కూడా పూర్తిగా తెలియదు.అతడుచేసే పనులు అలాంటివి.ఒకసారి నిద్రపోతున్న వాళ్ల నాయనమ్మ బంగారపుమురుగుని సబ్బుబిళ్లరుద్ది లాగేసి ద్రాక్షారామమ్లోని బేబి అనే టీచరుకిచ్చాడు.ఆమేకు భర్తలేడు.ఇద్దరు పిళ్లలు.పేళ్ళాడతానని కొన్నాళ్ళు వెంటతిరిగాడు.మరోసారి ఆదిరెడ్డిగారి కోడలికి దయ్యం పవిడిపించటానికొచ్చిన భూతవైద్యుని పళ్ళూడకొట్టాడు.మురమళ్ళలోని బాలింతరాలికి కాంపు కష్టమైతే రాజమండ్రి తీసికెళ్లి వైద్యం చేయించాడు.మరోసారి చిట్తిపంతులుగారింటి వెనుక పడిపోయిన గోడలలో పాము చేరితే దాన్ని పట్తుకొని,సాయంత్రం వరకు గుడి అరుగు మీద ఆడించి ఆతరువాత వూరిచివర సమాధి వద్ద వదలి వేశాడు.వూరివాళ్ళ దృష్టిలో తింగర మనిషి.బాచి స్నేహితుడు/రచయిత మద్రాసు వెళ్ళిపోయి,20 సంవత్సరాల తరువాత ఆ వూరువచ్చినప్పూడు బాచి గురించి ఆరా తీస్తాడు.కపాలేశ్వరుడు గుడి వుద్యోగి చెల్లెల్తో ఊరువిడచి వెళ్ళిపోయడని వూర్లోజనంచెప్తారు.
|