ఆనాటి వాన చినుకులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
'''.......క్యాసెట్టు అయిపోయింది.నాగస్వరం ఆగిపోయింది.తన్మయత్వంతో ఆడిన పాము అక్కడ నిశ్శబ్బం ఏర్పడేసరికి 'బుస్స్ స్స్..'మని టేపురికార్డరు మీద మూడు కాట్లువేసింది.అప్పటికీ నాగస్వరం వినిపించకపోవడంతో,దగ్గరలో వున్న నాగరాజును ఏమి చెయ్యకుండా తనదారిన తను శరవేగంతో వెళ్ళిపోతుంటే మిడిగుడ్లతో ఆ పామునే చూస్తూవుండిపోయినాతడు.ఇక జన్మలో పామంటే భయపడలేదు.అలా ఆ నాగుపాము తన శరీరం మీద కాకుండా తనభయం మీద కాటు వేయడంతో ఈ జన్మకి పాము అంటే భయం పోయింది నాగరాజ్‍కి '''.
 
'''బాచి:'''బాచి రచయితకు మిత్రుడు.బాచి తత్వమేమిటో వూర్లో వారికే కాదు,రచయితకు కూడా పూర్తిగా తెలియదు.అతడుచేసే పనులు అలాంటివి.ఒకసారి నిద్రపోతున్న వాళ్ల నాయనమ్మ బంగారపుమురుగుని సబ్బుబిళ్లరుద్ది లాగేసి ద్రాక్షారామమ్లోని బేబి అనే టీచరుకిచ్చాడు.ఆమేకు భర్తలేడు.ఇద్దరు పిళ్లలు.పేళ్ళాడతానని కొన్నాళ్ళు వెంటతిరిగాడు.మరోసారి ఆదిరెడ్డిగారి కోడలికి దయ్యం పవిడిపించటానికొచ్చిన భూతవైద్యుని పళ్ళూడకొట్టాడు.మురమళ్ళలోని బాలింతరాలికి కాంపు కష్టమైతే రాజమండ్రి తీసికెళ్లి వైద్యం చేయించాడు.మరోసారి చిట్తిపంతులుగారింటి వెనుక పడిపోయిన గోడలలో పాము చేరితే దాన్ని పట్తుకొని,సాయంత్రం వరకు గుడి అరుగు మీద ఆడించి ఆతరువాత వూరిచివర సమాధి వద్ద వదలి వేశాడు.వూరివాళ్ళ దృష్టిలో తింగర మనిషి.బాచి స్నేహితుడు/రచయిత మద్రాసు వెళ్ళిపోయి,20 సంవత్సరాల తరువాత ఆ వూరువచ్చినప్పూడు బాచి గురించి ఆరా తీస్తాడు.కపాలేశ్వరుడు గుడి వుద్యోగి చెల్లెల్తో ఊరువిడచి వెళ్ళిపోయడని వూర్లోజనంచెప్తారు.ఆలా ఎందుకు చేసాడని అడగగా 'ఆ మదపిచ్చోడి గురించి చెప్పెదేముందంటారు.ప్రస్తుతం బాచి యానాం రేవుకు పదిమైళ్ల దూరంలోని పిచ్చుకల లంకలో వుంటున్నట్లు తెలుసుకొని రచయిత అక్కడికి వెళ్తాడు.అక్కడ తిప్ప అంచున వుంది బాచి ఇళ్లు. రచయిత మాటల్లో'''....ఆ ఇసుక తిప్ప మధ్యలో నిలబడి ఎటుచూసినా గోదావరే కంపిస్యున్నది.పచ్చి ఇటుకల గోదల్ని పేడతో అలికి సున్నం ముగ్గులు పెట్టి,పైన రెల్లు గడ్దితో నేసిన కుటీరం ఒకటి తిప్ప అంచుననే వున్నది.పచ్చి వెదుళ్లతో చుట్టూ కట్టిన దడికి ఒక మూల చుక్కుడుపాదూ,ఇంకోమూల పుచ్చ పాదూ పాకి వున్నాయికుటీరం వెనకాల తులసికోటా,దానికి కాస్త దూరం లో గోరింటాకు మొక్కా,కరివేరపూలమొక్క వున్నాయి.'''కుటిరంలో వున్న ఆడు మనిసి నల్లబోర్డరున్న బూడిదరంగు చీరకట్తుకుంది.అడ్డపాపిటతీసి,జడవేసుకొని పెద్ద కుంకుమ బొట్తు పెట్తుకునివుంది.ఆమెకు కుడికాలు లేదు.బాచి మిత్రున్ని సంతోషంగా ఆహ్వనించి అథితి సత్కారంచేసాకా ,ఇలా ఎందుకు జరగిందని అడుగుతాడు.బాచీ జరిగింది చెప్పాడు.ఉళ్ళో కొవ్వూరి రాములు,సంఛారతెగకు చెందిన వెంకటలక్ష్మి ని పెళ్ళి చేసుకుంటానని నమ్మించి,వాళ్ల పొలంలోని పాకలో వుంచి,బిడ్దపుట్టగా,ఆబిడ్డనోట్లో వడ్లగింలు వేసి చంపగా ,అదితెలుసుకున్న బాచీ పంచాయితి పెట్తించి,వెంకటలక్ష్మి మెళ్ళో రాములు చేత మూడు మూళ్లు వేయించాడు.ఆ విధంగా వూర్లోని అగ్ర కులాలవారి కోపానికి గురైనాడు.రెండు మూడ దపాలు చంపించాడానికి ప్రయత్నింఛారు.అదృష్టవశాత్తు ఆచి తప్పించుకున్నాడు.కపాలేశ్వరస్వామి దేవాలయంలో ఈ వుద్యోగి చెల్లెలికి షుగరు వ్యాథి వచ్చి కాలు తీసెస్తే భర్త వదిలేశాడమెని.బాచి మీద పగ పెంచుకున్న వూరిజనం ఏ ఆధారంలేని వుద్యోగి చెల్లెల్ని పెళ్లిచేసుకొని దారి చూపించు అని బాచిని రెచ్చ గొట్టారు.
"https://te.wikipedia.org/wiki/ఆనాటి_వాన_చినుకులు" నుండి వెలికితీశారు