మురారిరావు ఘోర్పడే: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''మురారిరావు'''గా పేరొందిన '''మురారిరావు ఘోర్పాడే''' మరాఠా సర్దారు, సందూరు సంస్థానపు రాజు, గుత్తి దుర్గాధిపతి. 18వ శతాబ్దపు దక్కన్ చరిత్రలో ప్రముఖ చారిత్రక వ్యక్తి.
మురారిరావు 1699 ప్రాంతంలో జన్మించాడు. ఈయన తండ్రి సిద్ధోజి రావు సందూరు రాజ్యాన్ని స్థాపించాడు. సిద్ధోజీ రావు తాత, మల్లోజీ రావు ఘోర్పాడే బీజాపూరు సుల్తాను సేవలో అధికారిగా పనిచేశాడు.<ref>[http://books.google.com/books?id=2MwNAAAAIAAJ&pg=PA101&lpg=PA101#v=onepage&q&f=false A collection of treaties, engagements, and sanads relating to ..., Volume 8 By India. Foreign and Political Dept]</ref> మురారి రావు తండ్రి మరణం తర్వాత 1731లో రాజయ్యాడు. 1729 జూన్లో మొదటి భార్య సగుణాబాయిని వివాహం చేసుకున్నాడు. ఈయన రెండవ భార్య పేరు తెలియలేదు. కానీ ఆమె 1791లో, శ్రీరంగపట్నంలో టిప్పూసుల్తాను అదేశంపై చంపబడిందని తెలుస్తున్నది. <ref>http://www.royalark.net/India2/sandur3.htm</ref>
మురారిరావు చాకచక్యమైన భాగస్వామిగా, తన స్వతంత్రతను కోల్పోకుండా మరాఠులతో వ్యవహారాలు సలిపాడు. 1940లో మురారిరావు జీవితాన్ని సమీక్షిస్తూ చరిత్రకారుడు గోవింద్ సఖారామ్ సర్దేశాయి "మరాఠా చరిత్రలో మురారిరావు లాంటి రోమాంచిత రాజకీయ వ్యాసంగాన్ని మరేవ్వరూ కొనసాగించలేదు - ఆయన జీవితం మొత్తం అద్భుతమైన గెలుపులు, అనుకోని ఓటములు, నాటకీయ ఘట్టాలు, ముందుచూపుల్తో నిండిపోయిన ఒక మహోత్కృష్ట పోరాటం" అని తేల్చాడు.<ref name=outlook/>
1752 నవంబర్లో ఫ్రెంచి వారితో ఒప్పందం కుదుర్చుకుని, వారితో పాటు బ్రిటీషు వారిపై యుద్ధం చేశాడు. 1754లో తన రాజధానిని గుత్తికి మార్చి అక్కడ స్థిరనివాసమేర్పరచుకున్నాడు.
[[గుత్తి]] దుర్గాన్ని పాలిస్తూ 1756లో పీష్వా [[బాలాజీ బాజీరావు]]కు కప్పం కట్టడానికి నిరాకరించాడు. అదే సమయంలో [[నిజాం]]కు కప్పం కట్టకుండా ఎదురు తిరిగిన సావనూరు నవాబు అబ్దుల్ హకీం ఖాన్ ఆఫ్ఘానీతో పరస్పర సహకార ఒప్పందం కుదుర్చుకున్నాడు.<ref>[http://books.google.com/books?id=9Fb26pWqhScC&pg=PA90&lpg=PA90&dq=murari+rao#v=onepage&q=murari%20rao&f=false Nizam-British Relations, 1724-1857 By Sarojini Regani]</ref> మురారిరావు [[తిరుచిరాపల్లి]] ముట్టడిలో ఫ్రెంచి వారికి సహాయం చేశాడు. ఆ సహాయానికి గానూ ఫ్రెంచివారు మురారిరావుకు పద్నాలుగు లక్షలు బాకీ పడ్డారు. కానీ కర్నాటకంలో కలిసిరాక, వర్తకం దెబ్బతిని మురారిరావు బాకీ చెల్లించలేకపోయారు. అందుకే తొలుత పీష్వాకు మురారిరావుకు మధ్య విభేదాలలో బుస్సీ, తమ బకాయిలను మాఫీ చేస్తాడనే ఆశతో మురారిరావు పక్షం వహించాడు. కానీ మురారిరావు, సావనూరు నవాబుతో చేతులు కలిపి నవాబు అధికారాన్ని కూడా ధిక్కరించడంతో, సలాబత్ జంగుకు విపక్షం వహించలేని బుస్సీ, చేసేదేమీ లేక మురారిరావుపై నిజాం, పీష్వాలతో సహా యుద్ధానికి సిద్ధమయ్యాడు.
మరాఠులు పొరుగురాజ్యమైన మైసూరుతో ఎప్పుడూ యుద్ధం చేస్తూనే ఉన్నారు. హైదర్ అలీ ప్రాబల్యం పెరిగిపోతుందని గ్రహించిన పీష్వా మాధవరావు మురారిరావు సహాయంతో మైసూరుపై దండెత్తాడు. ఈ దండయాత్ర 1764 నుండి 1765 జూన్ వరకు కొనసాగింది. యుద్ధంలో గెలవలేక హైదర్అలీ పీష్వాతో సంధి చేసుకోని 28లక్షలు కప్పం చెల్లించాడు. తిరిగి 1770లో మాధవరావు శ్రీరంగపట్నానికి చేరుకున్నప్పుడు 40 లక్షలు కప్పం చెల్లిస్తానని సంధి చేసుకున్నాడు.
మురారి రావుకు ఇద్దరు కుమారులు. వారు బాల్యంలోనే మరణించడంతో చనిపోయేముందు దూరపు బంధువైన యశ్వంతరావు కుమారుడు శివరావు బాపాను దత్తత తీసుకున్నాడు. 1775 డిసెంబర్లో [[హైదర్ అలీ]] బళ్ళారిని కైవసం చేసుకొని గుత్తిపై ముట్టడి చేశాడు. 1776, జనవరి 10న గుత్తి దుర్గంపై దండెత్తి మురారి రావును బంధించి తొలుత శ్రీరంగపట్నంలోనూ, ఆ తర్వాత కబ్బాలదుర్గ్లో బందీగా ఉంచాడు.<ref>[http://books.google.com/books?id=_7QIAAAAQAAJ&pg=PA23&lpg=PA23&dq=murarirao#v=onepage&q=murarirao&f=false Memoirs of Hyder and Tippoo: rulers of Seringapatam, written in the Mahratta ...By Ram Chandra Rao Punganuri]</ref> ఆ తర్వాత కొన్నాళ్ళకే మురారిరావు కారాగారంలో 70
==మూలాలు==
|