జంషీద్ కులీ కుతుబ్ షా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''జంషీద్ కులీ కుతుబ్ షా''' (? - [[1550]]), [[గోల్కొండ]]ను పాలించిన [[కుతుబ్ షాహీ వంశము|కుతుబ్ షాహీ వంశానికి]] చెందిన రెండవ సుల్తాను. ఈయన [[1543]] నుండి [[1550]] వరకు పాలించాడు. జంషీద్ పాలన గురించి ఖచ్చితముగా తెలిసినది చాలా స్వల్పము. కానీ అతని కౄరత్వము చాలా ప్రసిద్ధి చెందినది.
జంషీద్ తండ్రి, [[సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్]], గోల్కొండ సామ్రాజ్యాన్ని స్థాపించి ఆంధ్ర దేశాన్నంతటిని పరిపాలించిన తొలి [[ముస్లిం]] పాలకుడయ్యాడు. జంషీద్ కులీ కుతుబ్ షా తండ్రిని చంపి, సోదరుని కళ్లు పీకేసి రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు. జంషీద్ మరో సోదరుడు [[ఇబ్రహీం కులీ కుతుబ్ షా]], విజయనగరానికి పారిపోయి [[రామ రాయలు|రామరాయల]]ను ఆశ్రయించాడు.
==బీదరుతో వైషమ్యాలు==
ఆదిల్షా ఆక్రమించుకొన్న బీదరు ప్రాంతాల మూలంగా ఆయనకు నిజాంషా కంటే కొంత పైచేయి అయ్యింది. ఈ విషయాన్ని నిరసించిన నిజాంషా, ఆదిల్షాను చికాకు పెట్టేందుకు, ఆదిల్షాకు ఆధీనంలో ఉన్న షోలాపూరు కోటపై దండెత్తాడు. ఇద్దరి బలాలు సమానంగా ఉండటంతో ఇబ్రహీం ఆదిల్షా తనకు మద్దతుగా జంషీద్ కులీని సహాయాన్ని కోరాడు. జంషీద్ అందుకు అంగీకరించాడు కానీ, ప్రతిగా అలీ బరీద్ ను విడుదల చేయాలని షరతు పెట్టాడు. ఆదిల్షా, అలీ బరీదును విడుదల చేసిన వెంటనే, జంషీద్ ఆదిల్షాకు సహాయం చేయకుండా బీదరు వెళ్లి అలీ బరీదును ఏ సింహాసనం నుండైతే తను పూనుకొని దించాడో మళ్లీ అదే సింహాసనం ఎక్కించాడు. దీనితో పరిస్థితి యధాస్థితికి చేరుకొని బీజాపూరు, అహ్మద్నగర్ మధ్య వైషమ్యాలు కొన్నాళ్ళు చల్లబడ్డాయి.
జంషీద్ ఎప్పుడైనా సిద్ధమే అని కయ్యానికి కాలుదూసే సుల్తాను. ధైర్యశాలి. దక్కను సుల్తానుల మధ్య గొడవల్లో అవసరమైన దానికంటే ఎక్కువగానే తలదూర్చేవాడు. ఈయన పాలనాకాలంలో బీదరు, బీజాపూరు మరియు అహ్మద్నగర్ మధ్యన జరిగిన అనేక గొడవల్లో స్వయంగా పాల్గొన్నాడు. ఈయన దౌత్య చతురత అనేక విషయాల్లో ఈయన్ను విజేతల వైపుకు దగ్గర చేసింది. ఈయన కవి కూడా.
==చరమదశ==
[[దస్త్రం:Qutub Shahi Tombs 101.JPG|thumbnail|ఎడమ|జంషీద్ కులీ కుతుబ్షా సమాధి]]
[[దస్త్రం:Qutub Shahi Tombs 96.JPG|thumbnail|జంషీద్ కులీ కుతుబ్షా సమాధి మందిరం]]
ఈయన మరణించే ముందు రెండు సంవత్సరాల పాటు కాన్సర్కు గురయ్యాడు. క్రమంగా క్షీణించి తన కాన్సర్ బాధను మరిపించేందుకు విలాసాలకు బానిసయ్యాడు. ఈయన ఆరోగ్యంగా ఉన్న రోజుల్లోనే కౄరునిగా పేరొందాడు, అందునా కాన్సర్ బాధ దాన్ని మరింత ప్రజ్వలింపజేసి తన పాలనలోని చివరి రోజులు భయంకరంగా తయారయ్యాయి. చిన్నచిన్న నేరాలకు కూడా చాలామందికి పెద్దపెద్ద శిక్షలు వేశాడు. ఏడేళ్ల పాటు పాలించిన జంషీద్ [[1550]]లో మరణించాడు. ఈయన మరణము తర్వాత, ఇబ్రహీం కులీ కుతుబ్ షా గోల్కొండకు తిరిగివచ్చి సింహాసనాన్ని అధిష్టించాడు.
▲జంషీద్ పాలన గురించి ఖచ్చితముగా తెలిసినది చాలా స్వల్పము. కానీ అతని కౄరత్వము చాలా ప్రసిద్ధి చెందినది. జంషీద్ గోల్కొండ సింహాసనాన్ని అధిష్టించగానే బీదర్ సుల్తాను అలీ బరీద్ గోల్కొండపై దండయాత్ర చేశాడు. గోల్కొండ కోటకు ఏడు మైళ్ళ దూరంలో ఉండగా ఆ విషయాన్ని తెలుసుకొన్న జంషీద్ కులీ వెంటనే సైన్యాన్ని కూడగట్టుకొని మెరుపువేగంతో బీదర్ వైపు సైన్యాన్ని కదిలించాడు. ఈ పైఎత్తు ఫలించి అలీ బరీద్ తన రాజధానిని రక్షించుకోవటానికి సేనలను గోల్కొండ నుండి వెనక్కు మరలించాడు. అలీ బరీద్ ముప్పు శాశ్వతంగా వదిలించుకోవటానికి జంషీద్ కులీ బీజాపూరు సుల్తాను ఇబ్రహీం ఆదిల్ షాతోనూ, అహ్మద్నగర్ నవాబు బుర్హాన్ నిజాంషాతో చేతులు కలిపాడు. ఆ సుల్తానులు బీదరుపై ఉన్న పాత కక్షలతో అందుకు సమ్మతించారు. బుర్హాన్ నిజాంషా బీదరు ఆధీనంలో ఉన్న కాందార్ ను ఆక్రమించుకొన్నాడు. అలీ బరీద్, ఆదిల్ షాను సహాయం అర్ధించడానికి వస్తే ఆయన్ను ఆదిల్షా బంధించాడు. [[1550]]లో ఈయన మరణము తర్వాత, కుమారుడు ఇబ్రహీం కులీ కుతుబ్ షా గోల్కొండకు తిరిగివచ్చి సింహాసనాన్ని అధిష్టించాడు.
{{క్రమము|
|