ఇమ్మడి జగదేవరావు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''ఇమ్మడి జగదేవరావు''' సదాశివరాయల పాలనాకాలం నుండ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఇమ్మడి జగదేవరావు''' [[సదాశివ రాయలు|సదాశివరాయల]] పాలనాకాలం నుండి [[ఆరవీటి వంశము|ఆరవీటి వంశపు]] తొలిరోజుల వరకు, దక్షిణాపథ రాజకీయ చరిత్రలో ప్రముఖ వ్యక్తి<ref>[http://books.google.com/books?id=nLYPejP-iE8C&pg=PA204&lpg=PA204&dq=jagadeva#v=onepage&q=jagadeva&f=false Tidings of the King: A Translation and Ethnohistorical Analysis of the By Phillip B. Wagoner]</ref> 1580లో చెన్నపట్నంలో (ప్రస్తుతం [[కర్నాటక]] రాష్ట్రంలోని [[రామనగర జిల్లా]]లోని పట్టణం) కోటను కట్టించి, చెన్నపట్నం రాజధానిగా [[బారామహల్]] ప్రాంతాన్ని పాలించాడు. జగదేవరావు తొలుత [[గోల్కొండ]]లో [[కుతుబ్ షాహీ వంశము|కుతుబ్‌షాహీల]] సేవలోనూ, ఆ తర్వాత బేరార్లో ఇమాద్‌షా సేవలోనూ పనిచేశాడు.
 
==సుల్తానుల సేవలో==
పదహారవ శతాబ్దంలో గోల్కొండ రాజ్యంలోని కోటలను రక్షించడానికి [[నాయక్వారీలు|నాయక్వారీ]]లనే హిందూ సైనికదళముండేది. వారి నాయకుడైన జగదేవరావు ధైర్యవంతుడు మరియు చురుకైనవాడు. తొలుత జంషీద్ కులీ కుతుబ్‌షా వద్ద పనిచేసి కార్యదక్షతతో మంచిపేరు తెచ్చుకున్నాడు. [[1550]]లో [[జంషీద్ కులీ కుతుబ్ షా]] మరణించిన తర్వాత కొడుకు సుభాన్‌ను రాజమాత బిల్కిస్ జమాన్ కోరిక రాజ్యవ్యవహారాలు చూసుకోవటానికి ''ఐనుల్ ముల్క్''‌గా [[అహ్మద్‌నగర్]] నుండి సైఫ్ ఖాన్‌ను గోల్కొండకు పంపించారు. అయితే సైఫ్ ఖాన్ అధికారం మొత్తం తన చేతుల్లోకి తీసుకొని తనే రాజు అవ్వాలనే రాజ్యకాంక్ష పెంచుకున్నాడు. ఇది భరించలేక ముస్తఫా ఖాన్ వంటి కొందరు అధికారులు విజయనగరంలో ఉన్న ఇబ్రహీం కులీకి గోల్కొండకు తిరిగివచ్చి రాజ్యాన్ని చేపట్టవలసిందిగా రహస్య వర్తమానాన్ని పంపారు.
 
గోల్కొండలో ఉన్న జగదేవరావు, రాజ్యపాలన క్షీణించడం మరియు సైఫ్ ఖాన్ పాలనపై ఉన్న అసంతృప్తిని గమనించి, ఇదే అదనుగా ''పిచ్చి యువరాజు''గా పేరొందిన దౌలత్ ఖాన్ (కులీ కుతుబ్‌షా యొక్క మరో కుమారుడు) ను నామమాత్రపు సుల్తానును చేసి అధికారం చేజిక్కించుకోవాలనుకున్నాడు. ఈ పన్నాగాన్ని పసిగట్టిన సైఫ్‌ఖాన్ జగదేవరావును గోల్కొండ కోటలో బంధించాడు.
 
గోల్కొండ సేనానులు ఇబ్రహీంను రాజ్యం చేపట్టడానికి రావలసిందిగా ఆహ్వానించారు కానీ ఇబ్రహీంకు సై‌ఫ్‌ఖాన్‌ను ఎదుర్కొనేందుకు సైనిక సహాయం కావలసి ఉంది. అటువంటి సహాయం కేవలం నాయక్వారీల నుండి కానీ విజయనగరం రాజునుండి కానీ అందగలదు. విజయనగరం రాజు నుండి సహాయం తీసుకోవటానికి వారు ఇష్టపడలేదు. ఇక నాయక్వారీల నాయకున్ని సైఫ్‌ఖాన్ బంధించడంతో వాళ్లను సై‌ఫ్ ఖాన్ వ్యతిరేకంగా కూడగట్టడానికి అట్టే సమయం పట్టలేదు. నాయక్వారీలతో ఒప్పందం కుదరగానే ఇబ్రహీం విజయనగరం నుండి బయలుదేరి గోల్కొండ రాజ్యపు సరిహద్దులలో [[కోయిలకొండ]]లో ముస్తఫా ఖాన్, సలాబత్ జంగ్ తదితర సేనానులను కలుసుకొని, కోయిలకొండలోని నాయక్వారీ సైన్యంతో గోల్కొండ వైపు కదిలాడు. ఇబ్రహీం వస్తున్నాడన్న వార్త అందగానే గోల్కొండ కోటలోని నాయక్వారీలు తిరగబడి, సుభాన్ కులీని బంధించి,<ref name=bilgrami>[http://books.google.com/books?id=wgo97XF0XuYC&pg=PA197&lpg=PA197&dq=naikwaris#v=onepage&q&f=false Landmarks of the Deccan: A Comprehensive Guide to the Archaeological Remains By Syed Ali Asgar Bilgrami]</ref> జగదేవరావును చెరనుండి విడిపించారు. అలా నాయక్వారీలు, ఇతర సేనానుల మద్దతుతో ఇబ్రహీం, సైఫ్ ఖాన్ ను ఓడించి, గోల్కొండను చేజిక్కించుకున్నాడు. యుద్ధంలో ఓడిపోయిన సైఫ్‌ఖాన్ పారిపోయి బీదరులో తలదాచుకున్నాడు. కోటలోకి అడుగుపెట్టి ఇబ్రహీం పట్టాభిషిక్తుడయ్యాడు.
 
తనకు సహాయం చేసిన జగదేవరావును ప్రధానమంత్రిగా నియమించాడు. అయితే కొంతకాలానికి జగదేవరావు ఇబ్రహీం కులీని గద్దెదించి యువరాజు దౌలత్ ఖాన్‌ను సుల్తాను చేసేందుకు పథకం వేశాడు. అది ఇబ్రహీం కులీ కుతుబ్‌షాకు తెలియగానే పాలుపంచుకొన్నవారందరిని హతమార్చాడు. జగదేవరావు బేరారుకు పారిపోయి అక్కడ ఆశ్రయం పొందాడు. 1556లో [[ఎలగందల్]]పై దాడిచేశాడు కానీ కుతుబ్‌షా తిప్పికొట్టాడు.<ref name=bilgrami/> జగదేవరావు తన కలలు సాకారం చేసుకోవటానికి బేరారు సరిపోదని గ్రహించి ఒక చిన్న బృందంతో విజయనగరానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో గోల్కొండ రాజ్యం గుండా వెళుతూ అనేక గ్రామాలను నేలమట్టం చేశాడు. ఆయన్ను ఎదిరించడానికి కుతుబ్‌షా ముస్తఫాఖాన్ ను పంపించాడు. ముస్తఫా ఖాన్ చేతిలో [[ఖమ్మం|ఖమ్మంమెట్టు]] వద్ద ఓడిపోయి జగదేవరావు విజయనగరంలో ఆశ్రయం పొందాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఇమ్మడి_జగదేవరావు" నుండి వెలికితీశారు