బాల్ ఠాక్రే: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
| source =
}}
మరాఠీలా ఆరాధ్యదైవంమ్<ref>ఈనాడు దినపత్రిక, తేది 18-11-2012</ref>, [[శివసేన పార్టీ]] వ్యవస్థాపకుడైన బాల్ థాకరే [[జనవరి 23]], [[1926]]న జన్మించాడు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు [[మహారాష్ట్ర]] రాజకీయాలలో కాకుండా దేశ రాజకీయాలను సైతం ప్రభావితం చేసిన విలక్షణ వ్యక్తి బాల్ థాకరే. 1950లలో రాజకీయ వ్యంగచిత్రకారుడిగా (కార్టూనిస్టుగా) జీవనం ప్రారంభించిన థాకరే 1960 నాటికి సొంత రాజకీయ వారపత్రికను ప్రారంభించాడు. [[ముంబాయి]]లో మహ్రాష్ట్రేతరుల ఆధిపత్యాన్ని సహించక వారికి వ్యతిరేకంగా కార్టూన్లు వేసేవాడు. ఆ తర్వాత మరాఠా ప్రజల హక్కుల సాధనకై పోరాటం చేయడానికి 1966లో శివసేన పార్టీకి ఏర్పాటుచేశాడు. "మహారాష్ట్ర మహారాష్ట్రీయులకే' అనే ఉద్యమంలో భాగంగా ముంబాయిని వదిలిపోవాలని ప్రవాసులను హెచ్చరించాడు. హిందూత్వను, హిందూ జాతీయవాదాన్ని కూడా బలపర్చినాడు. జాతీయ రాజకీయాలలో [[భారతీయ జనతా పార్టీ]]తో జతకట్టి కీలక పాత్ర వహించాడు. శివసేన పార్టీ స్థాపించిననూ 1995లో మహారాష్ట్రలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిననూ బాల్ థాకరే మాత్రం ప్రత్యక్ష రాజకీయాలలోకి రాలేడు, ఎన్నికలలో పోటీచేయలేడు. పార్టీ అధినేతగానే ఉంటూ పార్టీని నడిపించాడు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి కూడా వెనుకంజ వేయలేడు. 86 ఏళ్ళ వయస్సులో [[నవంబరు 1817]], 2012న[[2012]]న ముంబాయిలోని తన నివాసం మాతోశ్రీలో మరణించాడు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/బాల్_ఠాక్రే" నుండి వెలికితీశారు