వేంగి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి యంత్రము కలుపుతున్నది: ca:Vengi |
చి r2.7.3) (బాటు: ja:ヴェンギ వర్గాన్ని ja:ヴェーンギーకి మార్చింది; పైపై మార్పులు |
||
పంక్తి 1:
క్రీ.శ.300 నుండి 1100 మధ్యకాలంలో తీరాంధ్రప్రాంతలో నెలకొన్న రాజ్యాన్ని '''వేంగి రాజ్యం''' అని, ఆ రాజ్యం రాజధాని లేదా ప్రధాన నగరాన్ని '''వేంగి నగరం''' లేదా '''విజయవేంగి''' అని చరిత్ర కారులు నిర్ణయిస్తున్నారు. అప్పుడు వేంగి అనబడే స్థలం ప్రస్తుతం [[పెదవేగి]] అనే
వేంగి రాజ్యం ఉత్తరాన గోదావరి నది, ఆగ్నేయాన మహేంద్రగిరి, దక్షిణాన కృష్ణానది మధ్య ప్రాంతంలో విస్తరించింది. వేంగి రాజ్యం ఆంధ్రుల చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. [[పల్లవులు]], [[శాలంకాయనులు]], [[బృహత్పలాయనులు]], [[తూర్పు చాళుక్యులు]] వివిధ కాలాలలో వేంగి రాజ్యాన్ని ఏలారు. వేంగి రాజ్యం ద్వితీయార్ధంలో, అనగా తూర్పు చాళుక్యుల కాలంలో (వీరినే "వేంగి చాళుక్యులు" అని కూడా అంటారు.) తెలుగు భాష రాజ భాషగా గైకొనబడి, పామర భాష (దేశి)
[[
== "వేంగి" పేరు ==
"వేంగి" అనే పేరు పురాతనమైనదిగా కనిపించడం లేదు. కంచి వద్ద 'వెంగో' లేక 'వేంగి' అనే పేరు ఉన్నదని, ఆంధ్ర దేశం మధ్యలో ఈ పేరు గల నగరం ఏర్పడడానికి కారణాన్ని ఆంధ్ర దేశపు చరిత్ర అధ్యయనం చేసినవారిలో ఆద్యుడయిన [[చిలుకూరి వీరభద్రరావు]] ఈ విధంగా ఊహించాడు.("ఆంధ్రుల చరిత్రము - ప్రధమ భాగము") <ref>[http://www.archive.org/details/andhrulacharitra025965mbp ఆంధ్రుల చరిత్రము - చిలుకూరి వీరభద్రరావు] ప్రచురణ: విజ్ఞాన చంద్రికా గ్రంధమండలి - 1910లో చెన్నపురి ఆనంద ముద్రణాశాల యందు ముద్రింపబడియెను. వెల ౧-౪-౦. రాజపోషకులు: బొబ్బిలి రాజా, పిఠాపురం రాజా, మునగాల రాజా </ref> -
:ఈ దేశము పూర్వము నాగులచే పరిపాలింపబడెడిది. దక్షిణ దేశమందలి నాగులలో "అఱవలార్" ఒక తెగ. కాంచీ పురమునకు దక్షిణదేశమున ఉండే వారు గనుక ఆ ప్రదేశం "ఆఱవనాడు" అనబడింది. కనుకనే టాలెమీ వంటి విదేశీ చరిత్రకారులు మైసోలియా (కృష్ణానది) దక్షిణ ప్రాంతాన్ని "ఆశార్నోరి" (అర్ వార్ నాయ్) అని పేర్కొన్నారు. మొట్టమొదట కృష్ణా గోదావరి మధ్య దేశం "కూడూహార విషయం" అనబడేది. దానికి రాజధాని "కూడూరా" (గూడూరు లేక గుడివాడ?). ఏ కారణము చేతనో రాజధాని మార్చుకొనవలసి వచ్చినది.
అసలు ఈ చిన్న గ్రామమే ఒకనాటి వేంగి మహానగరమా? అనే ప్రశ్నకు చిలుకూరి వీరభద్రరావు ఇలా వివరణ ఇచ్చాడు.
:వేంగీ దేశమునకు ముఖ్య పట్టణముగా నుండిన వేంగి నగరం కృష్ణా మండలంలోని యేలూరుకు ఉత్తరాన ౮ మైళ్ళ దూరములోనున్నది. ఆ స్థానమున నిపుడు పెదవేగి, చినవేగి అను పల్లెలు మాత్రమున్నవి. వీనికి దక్షిణముగా ౫ మైళ్ళ దూరమున దెందులూరను గ్రామము కలదు. ఈ గ్రామమునకు గంగన్నగూడెము, సేనగూడెము అను శివారు పాలెములు చుట్టునునున్నవి. ఇవియన్నియుంగలిసి ఒక మహా పట్ణముగనుండి వేంగీపురమని పిలువంబడుచుండెను.
== చరిత్రలో వివిధ దశలు ==
పూర్వ కాలంలో కాలి నడక మార్గాలు, ఓడ రేవులు జనుల ప్రయాణాలకు, వివిధ సంస్కృతుల మేళనానికి ముఖ్యమైన వేదికలు. యాత్రికులు, పండితులు, వ్యాపారులు, కళాకారులు ఈ మార్గాలలో
పంక్తి 20:
పెదవేగి సమీపంలో [[గుంటుపల్లె]],
* బృహత్పలాయనులు - ఇక్ష్వాకుల తరువాతి కాలం (క్రీ.శ.300) - వేంగినగరం లేదా ఏలూరు లేదా దెందులూరు వారి రాజధాని కావచ్చును.
* శాలంకాయనులు -
* విష్ణుకుండినులు - క్రీ.శ. 375 - 555 - వీరి రాజధాని "శ్రీపర్వత ప్రాంతం"లో ఉండేది. తరువాత వేంగి సమీపంలోని "దెందులూరు"
* పల్లవులు - క్రీ.శ. 440 - 616 - వీరి రాజధాని వినుకొండ. వీరి రాజ్యంలో వేంగి కూడా ఒక ముఖ్య నగరం.
* తూర్పు చాళుక్యులు - క్రీ.శ. 616 నుండి
== శిధిలావశేషాలు ==
పెదవేగిలోని శిధిలాలు చారిత్రికమైన, పరిరక్షింపబడ వలసిన పురాతన అవశేషాలుగా [[భారత పురావస్తు శాఖ]] నిర్ణయించింది. <ref>http://asi.nic.in/asi_monu_alphalist_andhra.asp The complete list from West Godavari District is
:132. Mounds containing Buddhist remains - Arugolanu
పంక్తి 39:
</ref>
[[
పెదవేగిలోని ధనమ్మ దిబ్బ వద్ద జరిపిన త్రవ్వకాలలో దిబ్బ మధ్యన పెద్ద రాతి కట్టడము బయల్పడినది. దీనిని ఒక బౌద్ధ స్థూపముగా గుర్తించారు.
ఆ ప్రదేశములో దొరికిన వస్తువులలో మట్టి పాత్రలు, ఒక రాతి బద్దలో చెక్కబడిన నంది, పూసలు, కర్ణాభరణాలు మరియు పాచికలు కూడా ఉన్నవి. ఇంకో ప్రత్యేక కనుగోలు పారదర్శకమైన కార్నేలియన్ రాయితో తయారు చేసిన ఒక అండాకార భరిణె. 2x2x6 సె.మీల పరిమాణము కలిగిన ఈ భరిణపై ఒక దేవతామూర్తి చెక్కబడిఉన్నది. ఇది నగరాన్ని పర్యవేక్షించే [[గ్రామ దేవతలు|నగర దేవత]] అయ్యుండవచ్చని పురావస్తు శాఖ భావిస్తున్నది.<ref>http://www.ap.gov.in/aptourism/locations/rajahmundry/rajah_bottom6.html</ref> చాలా శిల్పాలను శివాలయంలోని వరండాలో ఉంచారు.
వేంగి రాజులు, ముఖ్యంగా శాలంకాయనులు "చిత్రరధస్వామి"ని పూజించినట్లు తెలుస్తున్నది (''భగవత్ చిత్రరధస్వామి పాదానుధ్యాతః''). ఈ చిత్ర రధ స్వామి శివుని రూపమో, విష్ణువు రూపమో, లేక సూర్యుని రూపమో తెలియడం లేదు.
("bhagavat Citraraihasvami padanudhyatah"). Sanskrit Lexicons
give Citraratha as the name of the sun, the vahana of Agni and some
పంక్తి 53:
of the ancient temple of Citrarathasvamin, the family deity of the
Salankayana Maharajas."
....
Vaishnava leanings were at the same time worshippers of the Sun-
God also.
పంక్తి 62:
records throw any light on this question.''</ref>
== మౌర్యుల, శాతవాహనుల
{{main|మౌర్యులు}}
{{main|శాతవాహనులు}}
మౌర్య సామ్రాజ్యం క్రీ.పూ.322 నుండి
శాతవాహనులు క్రీ.పూ. 230 నుండి క్రీ.శ. 250 వరకు దక్కన్ ప్రాంత రాజ్యాన్ని ఏలారు. మౌర్య సామ్రాజ్య పతనానంతరం అధికారంలోకి వచ్చిన శాతవాహనులు బౌద్ధాన్ని, వైదిక ధర్మాన్ని కూడా ఆదరించారు. కనుక వారి కాలంలో కూడా ఈ ప్రాంతానికి కొంత ప్రాముఖ్యత ఉండి ఉండవచ్చును. అంతే కాక వారి కాలంలో విలసిల్లిన అనేక బౌద్ధ క్షేత్రాలు ఈ సమీపంలో ఉన్నాయి.
== ఇక్ష్వాకులు ==
{{main|ఇక్ష్వాకులు}}
శాతవాహనుల అనంతరం ఇక్ష్వాకులు క్రీ.శ.225 నుండి 300 వరకు, కృష్ణానది ముఖద్వారానికి ఇరువైపుల ఉన్న ప్రాంతాన్ని ఆక్రమించి రాజ్యమేలారు. వీరి రాజధాని అయిన విజయపురి శ్రీపర్వత ప్రాంతం యొక్క పశ్చిమపాదంలో ఉన్నదని చెప్పబడింది. వీరిలో శ్రీఛాంతమూలుడు (225-245) పెద్ద రాజ్యాన్ని ఏర్పరచాడు. నేటి ప్రకాశం, గుంటూరు, కడప, కర్నూలు, నల్లగొండ, గోదావరి జిల్లాలు అతని రాజ్యంలో ఉండేవి. కనుక వేంగి వారి రాజ్యంలో ఒక నగరమై ఉండాలి. ఇక్ష్వాకుల చివరిరాజు రుద్రపురుషదత్తుడు. ఇక్ష్వాకులను జయంచి పల్లవ రాజు సింహవర్మ విజ్యపురిని నాశనం చేసి, గుంటూరు ప్రాంతంలో పల్లవరాజ్యాన్ని క్రీ.శ.300లో స్థాపించాడు.ఇక్ష్వాకుల సామ్రాజ్యం పతనమయ్యేనాటికి
== బృహత్పలాయనులు ==
{{main|బృహత్పలాయనులు}}
పల్లవుల అధికారం కృష్ణానదీ తీరం దక్షిణ భాగానికే పరిమితమైన కాలంలో కృష్ణానది ఉత్తర తీరంలో కొద్దికాలం మాత్రమే బృహత్పలాయనుల అధికారం సాగింది. కనుక వేంగి ప్రాంతం వారి అధీనంలో ఉండి ఉండాలి. కాని వీరి గురించిన ఆధారాలు చాలా తక్కువ. ఒకే ఒక కొండముది తామ్రశాసనం ఆధారంగా వీరు 300 ముండి 325 వరకు రాజ్యం చేసినట్లు భావిస్తున్నారు. వీరి రాజధాని కోడూరు కావచ్చును.
== శాలంకాయనులు ==
{{main|శాలంకాయనులు}}
వేంగి రాజధానిగా పరిపాలించినట్లుగా స్పష్టమైన ఆధారాలతో (ఏలూరు శాసనం ద్వారా) తెలియవస్తున్న మొదటి రాజులు శాలంకాయనులు. "శాలంకాయన"
"మైసోలియా" (కృష్ణా తీర ప్రాంతం)లో "బెన్గొరా" (వేంగీపురం)చెంత "సాలెంకీనాయ్" (శాలంకాయనులు)ఉన్నట్లు గ్రీకు చరిత్ర కారుడు టాలెమీ క్రీ.శ.130లో వ్రాశాడు. <ref>The Ancient City of Vengipura : Archaeological Excavations at Peddavegi/I.K. Sarma. Delhi, Book India Publishing Co., 2002, ISBN 81-85638-15-2. https://www.vedamsbooks.com/cgi-bin/main.cgi?no31025.htm - ''Infact Ptolemy (140 A.D.), refers to Vengi as the capital city of the Salankayanas.''</ref> అయితే ఆ బెన్గొరా (Bengaouron) అనేది వేంగీపురం కాదని కొందరు చారిత్రికుల అభిప్రాయం.<ref> ''Excerpt from Gopalachari's thesis'':
పంక్తి 115:
metropolis, while Vengipura was certainly the capital of the kings
of the Salankayana gotra.</ref>
ఏలూరు, పెదవేగి, గుంటుపల్లె, కానుకొల్లు, కొల్లేరు, కంతేరు, పెనుగొండ వంటి వివిధ శాసనాల ద్వారా శాలంకాయనుల గురించి కొన్ని వివరాలు తెలుస్తున్నాయి.
పంక్తి 121:
హస్తివర్మ కుమారుడు నందివర్మ (350-385). ఇతడు తిరుగుబాటుదారులను అణచివేసి [[కృష్ణానది]] దక్షిణానికి కూడా వేంగి రాజ్యాన్ని విస్తరింపజేశాడు. ఇతడు ధార్మిక చింతనపరుడు. "వివిధధర్మ ప్రధానస్య" అని పెదవేగి శాసనంలోను (కనుక వారు బౌద్ధ, వైదిక ధర్మాలను రెంటినీ ఆదరించినట్లు తెలుస్తున్నది), "ఆర్జిత ధర్మ ప్రదానస్య, గీసహస్రదాయి" అని గుంటుపల్లి శాసనంలోను వర్ణింపబడ్డాడు. ఇతని తరువాత ఇతని తమ్ముడు దేవవర్మ, కొడుకు అచండవర్మల మధ్య అధికారం కోసం అంతర్యుద్ధం జరగడం వలన శాలంకాయనుల ప్రతిష్ఠ దిగజారింది. అంతే గాకుండా ఉత్తరాన పిష్ఠపురం ([[పిఠాపురం]])లో మాఠరులు, దక్షిణాన కర్మరాష్ట్రంలో బలవంతులై శాలంకాయనులతో పోరాడసాగారు. క్రీ.శ.5వ శతాబ్ధి
శాలంకాయనులకు ఇంచుమించు సమకాలికులుగా కృష్ణానది దక్షిణాన కర్మరాష్ట్రాన్ని ఆనందగోత్రిజులు పాలించారు. కళింగాంధ్ర (ఉత్తరాంధ్ర) ప్రాంతం 'సింహపురి' (శ్రీకాకుళం వద్దనున్న సింగపురం) రాజధానిగా కళింగులు, తరువాత మాఠరులు పాళించారు. ఉత్తరాన పిష్ఠపురం ప్రాంతాన్ని కొంతకాలం కళింగులు, తరువాత మాఠరులు, తరువాత వాసిష్ఠులు పాలించారు.
== విష్ణుకుండినులు ==
{{main|విష్ణుకుండినులు}}
శాతవాహనులు, చాళుక్యులు మధ్యకాలంలో ఆంధ్ర దేశాన్ని పాలించిన వారిలో విష్ణుకుండులు ప్రసిద్ధులు. ఒక శతాబ్దం కాలం
విష్ణుకుండి రాజులందరిలో మాధవవర్మ (465-515) ప్రసిద్ధుడు. జైత్రయాత్రలు సాగించి రాజ్యాన్ని విస్తరించాడు. వాకాటకులతో వివాహసంబంధం కలుపుకొని నర్మదానది వరకూ రాజ్యాన్ని విస్తరించాడు. ఉత్తరాన కళింగాన్ని జయించాడు. అదను చూసుకొని మరలా కృష్ణాతీరం వరకు ఆక్రమించిన పల్లవులనోడించి కర్మరాష్ట్రాన్ని తిరిగి స్వాధీనం చేసుకొన్నాడు. కళింగ దండయాత్ర తరువాత మాధవవర్మ వేంగి సమీపంలోని దెందులూరు పురానికి తన రాజధానిని మార్చాడు.<ref name="BSL"/>.
పంక్తి 134:
తరువాతి రాజులలో క్రమంగా అంతఃకలహాలు, పశ్చిమాన చాళుక్యుల విజృంభణ, పల్లవులతో కొనసాగుతున్న వైరం - ఇవి క్రమంగా విష్ణుకుండినుల అధికార పతనానికి దారి తీశాయి. 566లో పల్లవరాజు పృథ్వీమహారాజుతో జరిగిన యుద్ధంలో అప్పటి విష్ణుకుండి రాజు విక్రమేంద్రుడు మరణించడంతో విష్ణుకుండి వంశం పాలన అంతమయ్యింది.
== పల్లవులు, రణ దుర్జయులు ==
{{main|పల్లవులు}}
[[
''ఏ ఎర్ర సంజెలో నెలమి పల్లవరాజకాంతలు కాళ్ళ పారాణులిడిరొ?'' - అని కవి సామ్రాట్ [[విశ్వనాధ సత్యనారాయణ]] తన "[[ఆంధ్రప్రశస్తి]]" ఖండ కావ్యంలో "వేంగి క్షేత్రము" అనే కవితలో వ్రాశాడు. శాతవాహనుల తరువాత పల్లవులు విజృంభించి కృష్ణానదికి దక్షిణ ప్రాంతాన్ని, తమిళ ప్రాంతాన్ని కూడా పాలించారు. క్రీ.శ. 280 నుండి 630 వరకు పల్లవుల పాళన సాగింది. వారు కర్మ రాష్ట్రంపై అధిపత్యం కోసం ఆనంద గోత్ర, శాలంకాయన, విష్ణుకుండి వంశాల రాజులతో తెరిపిలేని పోరాటాలు సాగించారు. మహేంద్రవర్మ, నందివర్మ, విజయస్కందవర్మ, సింహవర్మ, శివస్కందవర్మ వీరిలో ముఖ్యులైన రాజులు. వీరిలో పాలక్కడ ప్రాంతాన్ని పాలించిన సింహవర్మ 'వెంగో'రాష్ట్రంలో దాన ధర్మాలు చేసినట్లు మంగడూరు శాసనం ద్వారా తెలియవస్తుంది. అయితే ఈ వెంగో అంటే వేంగి అవునా కాదా అన్న విషయంపై విభేదాలున్నాయి. ఎందుకంటే అప్పటికి వేంగిలో విష్ణుకుండులు బలవంతులైయున్నారు.
పంక్తి 144:
బాదామి చాళుక్య రాజైన రెండవ పులకేశి దండయాత్రలలోని వేరు వేరు యద్ధాలలో రణదుర్జయ పృథ్వీమహారాజు, పల్లవుల మహేంద్ర వర్మ మరణించారు. పృథ్వీమహారాజు నుండి వేంగి చాళుక్యుల వశమైంది. దక్షిణాంధ్రప్రాంతంలో పల్లవుల అధికారం అంతమై, వారి పాలన తమిళ దేశానికే పరిమితమైంది.
== వేంగి చాళుక్యులు ==
[[
{{main|తూర్పు చాళుక్యులు}}
వేంగిలో చాళుక్య రాజ్య స్థాపన ఆంధ్రచరిత్రలో ఒక నూతన అధ్యాయానికి నాంది. తూర్పు చాళుక్యులనబడే వీరు తీరాంధ్రాన్ని మాత్రమే పాలించారు. ఆంధ్ర దేశ ఐక్యతను సాధించలేకపోయారు ([[శాతవాహనులు|శాతవాహనుల]] తరువాత [[కాకతీయులు]] మాత్రమే ఈ పని చేశారు.) ఇతర ప్రాంతాలలో పల్లవ సామంతులు, బాణ వైదుంబులు, రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు పాలన సాగించారు. అంతే గాకుండా వేంగి చాళుక్యులు పశ్చిమ (కన్నడ) ప్రాంతంనుండి దండెత్తి వచ్చినవారు అయినా కాని వీరు ఆంధ్రులకొక వ్యక్తిత్వాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని సాధించగలిగారు. "జన్మభూమిశ్చాళుక్యానాం దేశో వేంగితి పశ్రుతః" అని చాటి ప్రజా క్షేమాన్ని
క్రీ.శ. 624లో (ఈ సంవత్సరం పై విభిన్నాభిప్రాయాలున్నాయి) బాదామి చాళుక్య రాజు రెండవ పులకేశి వేంగి రాజ్యాన్ని (ఏలూరు దగ్గర జరిగిన యుద్ధంలో) జయించాడు. అతని తమ్ముడు కుబ్జ విష్ణువర్ధనుడు (624-641) అన్న ఆశీస్సులతో వేంగిని స్వతంత్రరాజ్యంగా పాలించనారంభించాడు. ఇతడు మహావీరుడు. పరిపాలనా దక్షుడు. ఇతని భార్య అయ్యణమహాదేవి జైన మతాభిమాని.
పంక్తి 155:
కుబ్జ విష్ణువర్ధనుని తరువాత గుణగ విజయాదిత్యుడు, వాళుక్యభీముడు,
తరువాతి రాజులలో [[గుణగ విజయాదిత్యుడు]] (848-891) తూర్పు చాళుక్యులలో అగ్రగణ్యుడు. ఒక యుద్ధంలో రాష్ట్రకూట రాజు (రట్టేశుని) చేత ఓడిపోయాడు. తరువాతి యుద్ధంలో వారిని ఓడించి, వారి రాజ్యాలలో వీరవిహారం చేసి తూర్పు చాళుక్యులు పొందిన పరాభవాలకు ప్రతీకారం చేయడమే కాక దక్షిణాపథంపై అధిపత్యం సాధించాడు. ఇతని తరువాత అంతఃకలహాలవల్ల వేంగి రాష్ట్రకూటుల దండయాత్రలకు తట్టుకొనే శక్తి కోల్పోయింది. కొన్ని యుద్ధాలలో జయం, కొన్నింట పరాజయం సంభవిస్తూ ఉండేవి. రెండవ అమ్మరాజు వేంగి సింహాసనాన్ని 25 సంవత్సరాలు పాలించాడు. తరువాత జటాచోడభీముడు వేంగి, కళింగ రాజ్యాలలో ఎదురు లేకుండా పాలించాడు.
== చాళుక్య చోళులు ==
ఆ సమయంలో దక్షిణాన రాజరాజు నాయకత్వంలో చోళ వంశం బలపడుతున్నది. కనుక వేంగిని తమ అధీనంలో ఉంచుకొంటే దక్షిణాపధంలో చోళసామ్రాజ్యానికి మార్గం సుగమం అవుతుందని, చాళుక్యులతో తలపడే అవసరం ఉండదని
చోళ సైన్యాల సాయంతో శక్తివర్మ (909-1011) చోడ భీముని జయించి వేంగి రాజ్యాన్ని ఆక్రమించుకొన్నాడు. తరువాత కొంతకాలం సత్యాశ్రయుని నాయకత్వంలో పశ్చిమ చాళుక్యులకు, చోళులకు యుద్ధాలు జరిగాయి. దాక్షిణాత్య సార్వభౌమత్వం ఆశించిన పశ్చిమ చాళుక్యులకు, చోళులకు వేంగి యుద్ధరంగమయ్యింది. <ref name="BSL"/>
1019లో రాజరాజ నరేంద్రుడు రాజయ్యాడు. అతని పట్టాభిషేకాన్ని ప్రతిఘటించి, విజయాదిత్యుడు కళింగ కుంతల రాజుల సాయంతో వేంగిని ఆక్రమించినాడని, రాజేంద్రచోళుడు వేంగి వరకు నడచి తన కుమార్తె అమ్మంగదేవిని రాజరాజ నరేంద్రునికిచ్చి పెళ్ళి చేసి పట్టాబిషేకాన్ని చేయించాడని చరిత్రకారుడు నేలటూరి వెంకటరమణయ్య అభిప్రాయపడ్డాడు. పట్టాభిషేకం అయిన 9 సంవత్సరాల తరువాత
== వేంగి ప్రాభవం క్షీణత ==
తిరిగి 1042 నుండి రాజరాజ నరేంద్రుని అధికారానికి ప్రమాదం వాటిల్లింది. ఈ కాళంలో చాళుక్య చోళ సంఘర్షణలు తారస్థాయికి చేరడంతో వేంగి రాజ్యం అల్లకల్లోలమయ్యింది. సోమేశ్వరుడనే రాజు 1045 ప్రాంతంలో వేంగి, కళింగ రాజ్యాలను జయించి "వేంగి పురవరేశ్వర" అనే బిరుదు ధరించాడు. చోళ రాజులు ధరణికోట వద్ద జరిగిన పెద్ద యుద్ధంలో చాళుక్యులను జయించారు గాని వేంగిపై మాత్రం పశ్చిమ చాళుక్యుల పెత్తనం కొనసాగింది. రాజరాజ నరేంద్రుడు ఆహవమల్ల సోమేశ్వరునితో సమాధానపడి అతని సార్వభౌమత్వాన్ని అంగీకరించి వేంగిని పాలించాడు. తరువాత 1061 వరకు రాజరాజనరేంద్రుని పాళన ప్రశాంతంగా సాగింది. అతడు పండిత గోష్టిలో ఆసక్తి కలిగిన పరమ ధార్మికుడు. ఈ కాలంలోనే భారతాంధ్రీకరణ జరిగి ఉండవచ్చును. అది తెలుగు సాహిత్య చరిత్రలో ఒక సువర్ణ ఘట్టం.
రాజరాజ నరేంద్రుని మరణానంతరం జరిగిన సంఘటనలలో చరిత్రకారులకు ఏకాభిప్రాయం లేదు. కాని అప్పటికి వేంగి రాజ్యానికి పూర్తిగా వ్యక్తిత్వం నశించి చోళ, చాళుక్య సార్వభౌములలో విజేతలైనవారి పక్షమో, లేక వేంగిపై దండెత్తి వచ్చినవారి పక్షమో వహించవలసిన దయనీయ స్థితికి దిగజారిపోయింది <ref name="BSL"/>. అనేక యుద్ధాలు, రాజుల మధ్యలో పంపకాలలో వేంగి నలిగిపోయింది. అవకాశం చిక్కినపుడల్లా ఇతరులు వేంగిని కొల్లగొట్టసాగారు. 1073లో దాహళ ప్రభువు చేది యశఃకర్ణదేవుడు, తరువాత కొద్దికాలానికి గంగరాజ దేవేంద్రవర్మ పెద్ద దండ్లను పంపి వేంగిని దోచుకొన్నారు. 1075లో సప్తమ విజయాదిత్యుడు మరణించడంతో తూర్పుచాళుక్య వంశం అంతరించింది.
== ఇతరాలు ==
{{main|నన్నయ}}
* పైన చెప్పినట్లుగా వేంగి రాజ్యం, తూర్పు చాళుక్యుల పాలన తెలుగువారి చరిత్రలో సాంస్కృతికంగా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్న కాలం. నన్నయ భట్టు, నారాయణ భట్టు మహాభారత ఆంధ్రీకరణను ప్రారంభించారు.
* చరిత్రలో చాలా సార్లు జరిగినట్లుగానే రాజవంశాలలోని అంతఃకలహాలు, పొరుగు రాజ్యాల సామ్రాజ్య విస్తరణాకాంక్ష దేశాన్ని బలపడకుండా చేశాయి. వేంగి, ధరణికోట, యనమదల, కంభం, నెల్లూరు వంటి వగరాలు పలుమార్లు ధ్వంసం చేయబడ్డాయి.
పంక్తి 189:
* బౌద్ధం క్షీణించిన అనంతరం జైనమతం వ్యాపించి మరల క్షీణించింది. వైదిక మతం క్రమంగా బలపడింది. కుల వ్యవస్థ వేళ్ళూనుకోసాగింది. జాతరలు, ఆచారాలు, మూఢ విశ్వాసాలు వ్యాప్తి పొందాయి.
* వైశ్యులు జైన మతాన్ని
*
== ఇవి కూడా చూడండి ==
* [[పెదవేగి]]
* [[తూర్పు చాళుక్యులు]]
* [[ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర]]
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
== వనరులు ==
* K.A. Nilakanta Sastri, A History of South India (Madras, 1976).
* [http://www.archive.org/details/earlyhistoryofth035387mbp Early_History_Of_The_Andhra_Country] - Thesis paper of Dr.Gopalachari (work done in 1941), Published by Madras University.
పంక్తి 208:
* డా.బి.ఎస్.ఎల్.హనుమంతరావు - ఆంధ్రుల చరిత్ర
== బయటి లింకులు ==
<!-- వర్గాలు -->
<!-- అంతర్వికీ లింకులు -->▼
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర]]
▲<!-- అంతర్వికీ లింకులు -->
[[en:Vengi]]
[[ca:Vengi]]
[[it:Vengi]]
[[ja:ヴェーンギー]]
|