గాలిబ్ గీతాలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 57:
*'''ఈ జగత్తు స్వభావమ్ము హీనమౌర!'''
'''మంచిచేసిన వానిని ముంచునౌర!'''
రానురాను ప్రపంచము లో మనస్సులమధ్య విలువలు నిస్సిగ్గుగా వలువలు విప్పుకుంటున్నాయి,నగ్నంగా నర్తిస్తున్నాయి.ఒక్కప్పుడు అందరికోసం ఒక్కడు-ఇప్పుడు నాకోసం అందరు.ఒకప్పుడు పక్కవాడికి మమమేమైన సహయపడగలమా? అని తోటి వాడు ఆలోచించేవాడు.మరినేడు మీఇంటికొస్తే ఏమిస్తావు!మాఇంటికొస్తే ఏమితెస్తావూ!.అపకారికి ఉపకారం చేయమన్నారు నాడు-నీకు ఉపకారంచేసినవాడికే ద్రోహం చెయ్యడం నేటి నీతి.
*'''వేరులో నుండి కొమ్మలు వెలసినట్లు'''
'''అన్ని శబ్ధాలు నిశ్శబ్దమందె పుట్టె'''
చెట్టు కాండం,కొమ్మలు,ఆకులు పెరగాలంటె దాని వేరే ములాధారం.అలాగే శబ్ధంకూడా నిశ్సబ్దంనుండె ఆవిర్భవించింది.ప్రణవనాదం(ఓం కారం)పుట్టుకకు ముందు విశ్వమంద నిశ్శబ్దమే రాజ్యమేలింది.బిగ్బ్యాంగ్ సిద్ధాంతం కూడా అదే చెప్పుతున్నది.
*'''తారలెల్ల పగలు పరదాల దాగె'''
'''రాత్రివేళ నవి దిగంబరమ్ములయ్యె.'''
ఈపద్యంలో ద్వందార్థాలు గోచరిస్తాయి పాఠకునికి.నక్షత్రాలు ఆకాశంలో ఎప్పడూ వుంటాయి.అయితే పగలు సూర్యకాంతి గగనమంతా పరచుకున్నందున,దాని ప్రకాశంలో చుక్కలు పగలు కంటికి ఆనవు.రాత్రివేళ గగనమంతా నిండుకొని కనులవిందు చేస్తాయి.పగటిపూట సూర్యాకాంతిని ఆకాశాన్ని కప్పిన పరదాగా భావించాలి.మరో అర్థంలో అంతపురంలోని గోషాస్త్రీలు బురకాలు ధరించి పరులకు,పురుషులకు కన్పించరు.రాత్రివేళ సంగమవేళ దిగంబరులవుతారు ప్రియునితోకూడుటకై.
*'''వలపు లేనాటికి నిష్పలము కావు,'''
'''కాయ గాయని వృక్షమ్ము కాదు వలపు.'''
|