కదిరి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Raghuramacharya (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 15:
[[బొమ్మ:Kadiri sri lakhmi web.jpg|right|100px]]
లక్షీనరసింహాస్వామి దేవాలయం [[నవ నారసింహ క్షేత్రాల]] లో ఒకటి. ఇక్కడి విశిష్టత ఏమిటంటే మరే నారసింహ క్షేత్రములో లేని విధంగా స్వామి వారు ప్రహ్లాదుని సమేతముగా దర్శనము ఇస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం నరసింహస్వామి [[బ్రహ్మోత్సవాలు]] అత్యంత వైభవముగా జరుగుతాయి. ప్రధానముగా బ్రహ్మగరుడ సేవ, అత్యంత ప్రధానముగా జరిగే బ్రహ్మ రథోత్సవము(తేరు) అతి వైభవముగా జరుగుతాయి. వీటిని దర్శించేందుకు కదిరి చుట్టుపక్కల జిల్లాల ప్రజలే కాక కర్ణాటక, తమిళనాడు ప్రజలు కూడ పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. తేరు రోజున కదిరి జనసంద్రమును తలపిస్తుంది. దేవస్థానముకు సంభందించిన తీర్థాలు కదిరికి చుట్టుపక్కల చాలా ఉన్నాయి. అవి భృగు తీర్థము (కోనేరు), ద్రౌపది తీర్థము, కుంతి తీర్ఠము, పాండవ తీర్థము, వ్యాస తీర్థము మొదలగునవి.
==మిగతా దేవాలయాలు==
కదిరిలో వెలసిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయము చూడచక్కగా అధ్యాత్మిక ప్రవచనాలతో విరజిల్లుతూ వుంటుంది. ఈ దేవాలయములో ప్రతి సంవత్సరం వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.ఆరాధన మహోత్సవాల సంధర్బంగా తిరునాల నిర్వహిస్తారు.ఈ సందర్బంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు దేవాలయాన్ని దర్శించుకుంటారు
==చంద్రవదన మొహియార్ సమాధి ==
చంద్రవదన మొహియార్ ప్రేమ గాధ కదిరిలో జరిగిన యధార్ద సంఘటన, సుమారు 200-300 సంవత్సరాలకు పూర్వం చంద్రవదన రాజకుమారి కదిరికి రాగా, మొహియార్ ఆమెను ప్రేమించినాడు. వీరి ప్రేమకున్న అన్నిరకాల అడ్డంకులనూ, మత కట్టుబాట్లనూ అధిగమించి వివాహ బంధనముతో ఒకటైనారు. వేర్వేరు మతాలకు చెందిన వీరి ప్రేమ గాధ కదిరిలొ మతసామరస్యనికి ప్రతీక. వీరిని గుర్తుచేసుకుంటూ కదిరి [[పురపాలక సంఘం]] ఒక ప్రాధమిక పాఠశాలను నెలకొల్పినది.
|