సీమ కథలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 1:
[[బొమ్మ:Sima kathalu.jpg|thumb|right|250px|సీమ కథలు పుస్తక ముఖచిత్రం]]
===తొలిమాట===
''' సీమ కథలు '''-సింగమనేని నారాయణ సంకలనసారధ్యంలో వెలువడిన కథల సంపుటం.పద్దెనిమిదిమంది రాయలసీమ కవుల కలాలనుండి జాలువారిన కథలనుండి,ఆణిముత్యాలవంటి కథలను ఏరి,కూర్చి ప్రచురించిన కథల సంకలనం ఈపుస్తకము.తెలుగు కథా సాహిత్యానికి దాదాపు వందేళ్ల చరిత్ర వున్నది.పలు తెలుగుపత్రికలు కథలకు ప్రోత్యాహంయిస్తూ,ప్రచురిస్తున్నాయి.అయినప్పాటికి ప్రస్తుతం నవలలకే అగ్రతాంబులం అందుతున్నది.వారపత్రికలలోనవలలే సిరియల్లుగా వస్తున్నాయి.తెలుగునవలలనే ప్రచురణకర్తలు/పుస్తక ప్రకాశకులు ఎక్కువసంఖ్యలో అచ్చువేస్తున్నారు.అయితే
సీమ కథలు పుస్తకాన్ని విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్,హైదరాబాదువారు మొదటిసారిగా1992లో ప్రచురించారు.మలిముద్రణ1994లో జరిగినది.ఆతువాత మూడవముద్రణ 2010లో.పుస్తకంలోని కథల సంకలనం:రాయలసీమరచయిత'సింగమనేని నారయణ'.ఇందులో మొత్తం పద్దెనిమిదికథలున్నాయి,పద్దెనిమిది రచయితలు తమఅనుభవాలను,వాస్తవ గ్రామీణుల యధార్దవ్యధలను,వెతలను పాఠకుల ముందించిన,బతుకు అనుభవాలను పిండిరాసిన కథలివ్వి.ఈపుస్తకంలోని కథలన్ని అంతకుముందే వివిధపత్రికలో అచ్చయిన కథలు.తెలుగురాష్ట్రంలో మిగతాప్రాంతాలకన్న ఒకప్రత్యేకమైన ఆర్ధిక,సాంఘిక, సాంస్కృతిక జీవనజీవితమున్న గడ్డ-సీమగడ్డ.సీమప్రాంత గ్రామీణజనజీవనం వ్యవసాయంతో ముడివడివున్నది.భారతదేశంలో అతితక్కువ వర్షపాతమున్నప్రాంతంగా నమోదయినప్రాంతం'రాయలసీమ'గడ్డ. అందులో అనంతపురంజిల్లా,దేశంలోనే తీవ్రవర్షాభావంవున్న రెండోజిల్లా.ఇక్కడ ప్రాణలు నిలవలన్నా,పోవాలన్నా'నీళ్ళే'కారణమంటే,నీళ్ళు పుస్కలంగాదొరికే రాష్ట్రంలోని ఇతరప్రాంతాలవారు విస్తుపోతారు.
పంక్తి 51:
|}
'''
తాగేటందుకు గుక్కెడునీళ్లకై నెత్తిమీద,భూజలమీద,సంకళ్లో కండలు,కడవలు పెట్టుకొని మైళ్ళకుమైళ్ళు ఆడ,మగ,పిల్లలు అనేతేడా లేకుండ మిట్టమద్యహన్నం,అపరరాత్రి వేళాపాలా లేకుండ నడచి వెళ్ళ డంవుంది.తాగునీటికై రోజూ కొట్లాటలు,తగాదాలు,బుర్రలు బద్దలుకొట్టుకోవాటాలు,జైలుకెళ్ళడాలున్నాయి.ఇంట్లో మంచినీళ్లయిపోతే చెంబుపట్టుకెళ్ళి ఇంటీంటికి తిరిగి అడుక్కొవడంవుంది.పొలంలో నాట్లు వేసి, మబ్బులేలేని ఆకాసం వైపుఆశగా వానచినుకుకై చూసే గాజుకళ్ళబక్కరైతుల బతుకులున్నాయి.కరువొస్తే,తమకుటుంబంలో ఒకరిగాచూసుకొనే గొడ్లకు పిడెకెడు మేతలేక,కొనేసత్తువలేక,మనసు రాయి చేసు కొని కసాయివాళ్లకు అమ్మే పల్లెజీవుల బతుకులున్నాయి.బావుల్లో నీళ్ళుచాలక,కరెంటురాక పంపులు పనిచేయ్యక,లోఒల్టెజి కారణంగా మోటార్లుకాలిపోయి, పైర్లు ఎండిపోతుంటే చూడలేక ప్రాణాలు గిజగిజ లాడుతుంటే,పుట్తినప్పటినించి తామునమ్ముకున్న నేలతల్లిఒడిలోనే కనులుమూసిన ఛిద్రమైన రైతు వ్యధలున్నాయి.
|