దోమకొండ సంస్థానం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''దోమకొండ సంస్థానం''' [[తెలంగాణా]]లోని ప్రాచీన సంస్థానాల్లో పేరెన్నికగన్న సంస్థానం. దోమకొండ నిజామాబాదు జిల్లాలో ఉన్నది. పాకనాటి రెడ్డశాఖకు చెందిన కామినేని వంశస్థులు ఈ సంస్థానాధీశులు. ఈ సంస్థానాధీశులు దోమకొండ కేంద్రంగా కాసాపురం, సంగమేశ్వరం, మహ్మదాపురం, విస్సన్నపల్లి, బాగోత్‌పల్లి, కుందారం, పాల్వంచ, దేవునిపల్లి వంటి నలభై గ్రామాలను పాలించారు.<ref>[http://www.andhrajyothi-sunday.com/AJweeklyshow.asp?qry=2011/aug/7/telangana&more=2011/aug/7/sundaymain తెలంగాణ గడీలు - 6 రెడ్డి దొరల కళావైభోగం దోమకొండ గడీ - ఆంధ్రజ్యోతి]</ref> 19వ శతాబ్దంలో ఈ సంస్థానపు సంవత్సర ఆదాయం రెండు లక్షల రూపాయలు. అందుకే దోమకొండ కోశాగారానికి కాపలాగా ఇరవై మంది అరబ్బులు ఉండేవారట. వీరు రెడ్డిదొరలైనప్పటికీ నిజాం ప్రభువులు వీరికి ''రావుబహద్దూర్'' అనే బిరుదు ఇవ్వడంతో కొంతమంది పాలకులు పేరు చివర రావు అన్న పేరుతో చలామణీ అయ్యారు.
 
1636లో అబ్దుల్ హుస్సేన్ కుతుబ్ షా కామారెడ్డికి ఈ సంస్థానాన్ని ఇచ్చాడు. ఈ ప్రాంతంలోని అనేక గ్రామాలు వారి వంశీయుల పేర్లయిన కామారెడ్డి, సంగారెడ్డి, ఎల్లారెడ్డి, మాచారెడ్డి, సదాశివనగర్, పద్మాజివాడి, తుక్కోజివాడి, తిమ్మోజివాడిల మీదనే వెలిశాయి. సంస్థానంలోని కట్టడాలు శిల్పకళా సంపదను సాక్షాత్కరిస్తాయి. కోట, అద్దాల బంగళా, రాజుగారి భనాలు, అశ్వగజ శాలలు, కుడ్యాలు, బురుజులు, కందజంకందకం పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ. ఈ అద్దాల మేడలోనే కామినేని వంశీయులు సాంస్కృతిక కార్యక్రమాలు జరిపించేవారు. పురావస్తుశాఖ ఆధ్వర్యంలో పునర్నిర్మాణ పనులు జరగడంతో చారిత్రక సంపదను కాపాడుకున్నట్లయింది.
 
==కామినేని వంశము==
కామినేని వంశానికి ఆద్యుడైన కామినేని చౌదరి తరువాత 15వ తరానికి చెందిన ఉమాపతిరావుకు రామేశ్వరరావు, రామచంద్రరావు, రాజేశ్వరరావు, సోమేశ్వరరావు, రాఘవేంద్రరావు అనే అయిదుగురు సంతానం. ఇందులో సోమేశ్వరరావుకు రెండవ ఉమాపతిరావు, అన్నారెడ్డి, రాజేశ్వరరావు అనే కొడుకులు కలిగారు. ఇందులో రెండవ ఉమాపతిరావుకు మూడవ రాజేశ్వరరావు, రామచంద్రరావు, వెంకటేశ్వరరావు అనే పుత్రులు కలిగారు. మరోవైపు రాజేశ్వరరావుకు రామేశ్వరరావు అనే ఏకైక కొడుకు కలిగాడు.
 
రాజా రాజేశ్వరరావు దాదాపు 30 సంవత్సరాలు ఈ సంస్థానాన్ని పాలించాడు. అతడి సోదరుడైన రాజా రామచంద్రరావు ఎక్కువ కాలం పరిపాలించలేకపోయాడు. మూడవవాడైన వెంకటేశ్వరరావును రాఘవేంద్రరావు కొడుకైన సదాశివరెడ్డి దత్తత తీసుకోవడంతో, రామచంద్రరావు తరువాత సంస్థానాధికారం గురించి సోమేశ్వరరావుతో గొడవలు ఆరంభమై కోర్టు వరకు వెళ్లాయి. కోర్టు తీర్పు ప్రకారం సోమేశ్వరరావుకు పరిపాలనాధికారం లభించింది కానీ ఆయన కూడా ఎక్కువ కాలం అధికారం చేయలేకపోయాడు.
 
దానిక్కారణం... ఓ రోజు గంగిరెద్దులవాడు అడుక్కోవడానికి గడీలోకి వచ్చి సోమేశ్వరరావు దొర దగ్గర రకరకాల విన్యాసాలు చేయించాడు. చివరగా అయ్యగారికి దండం పెట్టు... అవ్వబువ్వ ఆయనే అయితడు... అమ్మగారికి దండం పెట్టు... పట్టుబట్టలు పెట్టి పరమాన్నం పెడతది... అని ఎద్దుకు చెప్పగానే ఆ దొరసోమేశ్వరరావు కాళ్ల దగ్గర ముందుకాళ్ళు వంచి దండం పెట్టే సమయంలో దాన్నోట్లోంచి కారిన సొంగ సోమేశ్వరరావు చేతులపై పడిందట. అది సహించలేని సోమేశ్వరరావు ఆవేశంతో గంగిరెద్దులవాడ్ని కొట్టి చంపేశాడట. పెద్ద సంచలనం సృష్టించిన ఈ ఘటనతో ప్రభుత్వం అతడికి ఆరు సంవత్సరాలు హైదరాబాద్హైదరాబాదు విడిచి వెళ్లరాదని శిక్ష విధించారని స్థానిక గ్రామస్తుల కథనం.
 
==దోమకొండ కోట==
కామారెడ్డి పట్టణానికి దగ్గర్లో ఉన్న దోమకొండ కోట (స్థానికులు దీన్ని దోమకొండ గడీ అని వ్యవహరిస్తారు) నలభై ఎకరాల విస్తీర్ణంలో చుట్టూ రాతి కట్టడంతో కూడిన ప్రహరీగోడతో పాటు బయటివైపు నుంచి శత్రువులు రాకుండా ఉండేందుకు నిజాం రాజుల కోటలాగా నలభై ఎకరాలమొత్తం గోడ చుట్టూ అతి పెద్ద నీటి కందకం కూడా ఉన్నది. తెలంగాణ జిల్లాల్లోని మరే గడీ (సంస్థానాధీశుల మహల్లను గడీలంటారు. ఇవి నిజమైన కోటల్లాగా రక్షణకి కాక కేవలం అధికార ఠీవీని ప్రకటించే భవనాలు) చుట్టూ ఇలాంటి నీటి కందకం లేదు. కోటలో ప్రవేశించేందుకు ముందువైపుపడమర వైపు ఒక పెద్ద కమాన్, వెనుకవైపుతూర్పు వైపు మరొకటి ఉన్నాయి. విశాలమైన ప్రాంగణం మధ్యలో సంస్థానాధీశుల ప్రధాన నివాసం ''వెంకట భవనం'' ఏపుగా పెరిగిన కొబ్బరిచెట్లు, పూలమొక్కల మధ్యన రాజసం ఉట్టిపడేలా కనిపిస్తుంది. భవనం పైభాగంలోని పాలరాతి ఫలకంపై వెంకట భవనం అని తెలుగులో, ఉర్దూలో రాసి ఉంది. ఆ కాలంలోనే ఈ భవనంపై పిడుగులు పడకుండా నిరోధించే పరికరాన్ని (ఎర్తింగ్) బిగించారు.
 
కోట నలభై ఎకరాల చుట్టూ నీటి కందకంతో పాటు కామినేని వంశస్థులే ఎత్తయిన రాతి గోడను నిర్మించారనీ కొందరంటే, కాకతీయులు ఆ గోడను నిర్మించగా సంస్థానాధీశులు అందులో భవనాలు కట్టుకున్నారని కొందరంటారు. కోటలోని మహదేవుని (శివుడు) ఆలయం ఉండడమే కాకతీయుల నిర్మించారనటానికి తార్కాణమని భావిస్తారు. దోమకొండ సంస్థానాధీశులు మొదట బికనూర్ (నిజామాబాద్ జిల్లా) సంస్థానాధిపతులనీ, బికనూర్ పక్కనే సైనికులు, కాశీ యాత్రికులు రాకపోకలు సాగించే 'దండు రాస్తా' ఉన్నందువల్ల ఇబ్బందిగా భావించి దోమకొండకు వచ్చారనీ, అప్పటికే దోమకొండలో కాకతీయులు ప్రహరీగోడ, మహదేవుని ఆలయం నిర్మించారనీ కొందరి అభిప్రాయం. అయితే ఈ కథనానికి ఆధారాలేవీ లేవు
పంక్తి 17:
నగారా భవంతి - కోటలో నగారాను వినిపించడం కోసం ప్రత్యేకంగా ఒక భవంతిని నిర్మించారు. ఆ భవంతిపైన ఒక నీటి తొట్టెను ఏర్పరచి, దాంట్లో ఒక గిన్నెకి రంధ్రం చేసి ఉంచేవారట. తొట్టిలోని నీరు గిన్నెలోకి నిదానంగా చేరి మునిగిపోయేది. దీని ఆధారంగా సమయాన్ని చెప్పేవారట. తెల్లవారు ఝామున నాలుగు గంటల నుండి నగారా మోగించేవారట. ఇది కూడా శుక్ర, ఆదివారాల్లో ప్రతి మూడు గంటలకొకసారి, మిగతా రోజుల్లో ఆరు నుండి పన్నెండు గంటలకొకసారి నగారా మోగించేవారట.
 
రాజ దర్బార్ - కోటలో నగారా భవంతికెదురుగా అతిపెద్ద రాతిగోడలు, వాటి చివర్లో ఎత్తయిన బురుజులు ఉన్నాయి. గోడకు ఉన్న అతి పెద్ద దర్వాజాకు శత్రువులు ఏనుగులపై వస్తే వాటిని అడ్డుకోవడానికి అనేకమైన ఇనుప శూలాలను బిగించారు. అలాగే దర్వాజాపైన గల రంధ్రాల్లోంచి సలసల కాగే నూనెను పోసే ఏర్పాటు కూడా చేసుకున్నారు. దర్వాజా దాటి లోపలికి వెళ్తే వచ్చే అందమైన భవంతే రాజ దర్బారు. అందులోనే హరికథలు, పురాణాలు, కవితాగానాలు, నృత్యాలు రోజంతా జరిగేవట. ఆ భవంతిపైన దాసీలు నృత్యం చేయడానికి జిట్రేగి కట్టెలతో చేసిన వేదిక కూడా ఉంది. ఈ కోటలో కూడా దాసీ వ్యవస్థ ఉండేదట. అద్దాల మేడ ముందు నీళ్లని ఎగజిమ్మే ఫౌంటెన్‌లను ఏర్పరిచారు. దీని పక్కనే రాణీమహలు ఉన్నప్పటికీ అది పూర్తిగా శిథిలమైపోయింది.
దొరగారి దర్బార్
కోటలో నగారా భవంతికెదురుగా అతిపెద్ద రాతిగోడలు, వాటి చివర్లో ఎత్తయిన బురుజులు ఉన్నాయి. గోడకు ఉన్న అతి పెద్ద దర్వాజాకు శత్రువులు ఏనుగులపై వస్తే వాటిని అడ్డుకోవడానికి అనేకమైన ఇనుప శూలాలను బిగించారు. అలాగే దర్వాజాపైన గల రంధ్రాల్లోంచి సలసల కాగే నూనెను పోసే ఏర్పాటు కూడా చేసుకున్నారు.
అయితే ఈ దర్వాజా దాటి లోపలికి వెళ్తే... కళ్ళు చెదిరిపోయే అందమైన భవంతి ఉంది. అది దొరగారి దర్బారు... అందులోనే హరికథలు, పురాణాలు, కవితాగానాలు, నృత్యాలు రోజంతా జరిగేవట. ఆ భవంతిపైన దాసీలు నృత్యం చేయడానికి జిట్రేగి కట్టెలతో చేసిన వేదిక కూడా ఉంది.
ఈ గడీలో కూడా దాసి వ్యవస్థ ఎక్కువగా ఉండేదట. అద్దాల మేడ ముందు నీళ్లని ఎగజిమ్మే ఫౌంటెన్‌లను ఏర్పరిచారు. దీని పక్కనే దొరసాని గడీ ఉన్నప్పటికీ అది పూర్తిగా శిథిలమైపోయింది.
 
==కళాపోషణ==
కామినేని వంశంలో అయిదవవాడైన మొదటి ఎల్లారెడ్డి కాలం నుండి సంస్థానంలో సాహితీ వికాసం జరిగింది. ఇతని కాలంలో సంస్థానంలో పలువురు కవులు ఉండేవారు. మొదటి ఎల్లారెడ్డి మనుమడైన రెండవ కాచిరెడ్డి కాలాన్ని సాహితీ స్వర్ణయుగంగా పేర్కొంటారు. మూడవ కాచిరెడ్డి కుమారుడైన మల్లారెడ్డి స్వయంగా కవియే కాకుండా పద్మపురాణోపరి భాగాన్ని అనువదించారు. మల్లారెడ్డి సోదరుడైన రెండవ ఎల్లారెడ్డి కూడా వాసిష్టము, లింగపురాణం అనే గ్రంథాలు రాసినట్టు చెబుతారు.
 
బహుభాషా విద్వాంసులైన మూడవ రాజేశ్వరరావు ఉర్దూ, పార్శీ, అరబ్బీ భాషల్లో చిరస్థాయిగా నిలిచే రచనలెన్నో చేశారు. ఈయన ఆధ్వర్యంలో పలు నిఘంటువులు, సంకలన గ్రంథాలు కూడా వెలువడ్డాయి. ఈయన 'అజ్గర్' అనే కలం పేరుతో రాసేవారు. దోమకొండ కోటకు తిరుమల[[తిరుపతి వేంకట కవులు|తిరుపతి వేంకటకవులు]] కూడా వచ్చేవారట.
 
==స్వాతంత్ర్యానంతరం==
వీరిదోమకొండ సంస్థానాధీశుల పాలనకు మెచ్చి నైజాం రాజు హైదరాబాదులోని నాంపల్లి దగ్గర ఉమాబాగ్ అనే 30 ఎకరాలు ఇనాంగా ఇచ్చారు. సోమేశ్వరరావు పాలన సాగుతున్నప్పుడు తెలంగాణ భారత సమాఖ్యలో కలిసిపోవడంతో సంస్థానం రద్దయింది. దాంతో కామినేని వంశస్థులు హైదరాబాదు వెళ్లిహైదరాబాదులో స్థిరపడ్డారు. 1954 నుంచి ఆరేళ్లపాటు దోమకొండ గడీలోకోటలో జనతా కాలేజీ నడిచింది. తర్వాత దాన్ని పాలెంకు తరలించారు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ సంస్థానాలు]]
"https://te.wikipedia.org/wiki/దోమకొండ_సంస్థానం" నుండి వెలికితీశారు