గ్రామ రెవిన్యూ అధికారి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
పూర్వం [[కరణం]] [[మునసబు]] [[పటేల్]] [[పట్వారీ]] లు వారి సొంత గ్రామాల్లోనే ఉండి పాలన నడిపేవారు. [[1985]] లో వీరిని తీసేసి గ్రామ పాలనాధికారుల్ని ([[వి.ఏ.వో]] ) ప్రవేశపెట్టారు. [[పంచాయితీ]]ల నుంచి రెవెన్యూ వ్యవస్థను వేరు చేసిన నేపథ్యంలో [[2007]] ఫిబ్రవరి నుంచి వీఆర్వోల విధానం అమలులోకి వచ్చింది. జనాభా ప్రాతిపదికన వారిని నియమించారు.
==అధికారుల కేటాయింపు మరియు నియమించు విధము==
2001 జనాభా లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో మొత్తం 28,123 [[గ్రామాలు]] న్నాయి. అందులో 26,613 నివాసిత గ్రామాలు 1,510 నివాసాలు లేని గ్రామాలు. వీటి నిర్వహణకు జనాభా ప్రాతిపదికన అధికారులను కేటాయించుతారు. 5000 జనాభా ఉంటే ఒకరు, 5 వేల నుంచి 10,000 మంది వరకు ఉంటే ఇద్దరు, పది వేల నుంచి పదిహేను వేల మంది ఉంటే ముగ్గురు చొప్పున గ్రామ రెవిన్యూ అధికారి [[వీ.ఆర్.వో]] లు ఉండడానికి అనుమతి ఇచ్చారు.ఆయా జిల్లాల్లో ఖాళీగా ఉన్న వీఆర్వో ఉద్యోగాల భర్తీ సంబంధిత జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్‌సీ) చేస్తుంది. కొన్ని గ్రామాలను కలిపి ఒక సమూహం (క్లస్టర్) గా ఏర్పాటుచేశారు. రాష్ట్రంలోని 21,809 గ్రామ పంచాయతీలను పరిపాలనా సౌలభ్యం కోసం 12,397 క్లస్టర్లుగా ఏర్పాటు చేసింది. 5 వేల జనాభా ఉన్న ఒకటి లేదా రెండు మూడు పంచాయతీలను కలిపి ఒక క్లస్టరుగా గుర్తించారు. ప్రతి క్లస్టర్‌కు ఒక గ్రామ రెవిన్యూ అధికారి వుండాలి. పంచాయతీ క్లస్టర్ 5 కిలోమీటర్ల పరిధిలో ఉండాలి. రాష్ట్రంలో 12,397 క్లస్టర్లు ఉన్నాయి.
 
==విధులు==
గ్రామ ఆదాయ ఆధికారి విధులు జి.ఒ.ఎమ్.ఎస్ సంఖ్య 1059 రెవిన్యూ( గ్రామ పరిపాలన)శాఖ 31.7.2007 లో పేర్కొన్నారు (<ref>[http://apard.gov.in/grama_revenue_paripalana_margadarshini.pdf గ్రామ పరిపాలన మార్గదర్శిని] </ref>. దీని ప్రకారం సాధారణ పరిపాలన రెవిన్యూ విధులు, పోలీస్ విధులు మరియు సామాజిక సంక్షేమం అభివృద్ధి వున్నాయి. గ్రామ రెవిన్యూ అధికారికి సహాయకునిగా గ్రామంలోనివసించే వారిలో ఒకరిని గ్రామ రెవిన్యూసహాయకునిగా నియమించుతారు.
 
== వనరులు==
* రాష్ట్రంలో 12,397 క్లస్టర్లు ఉండగా 17,008 వీఆర్వోలు అవసరం. ప్రస్తుతం సుమారు 14,800 మంది వీఆర్వోలే ఉన్నారు.
{{మూలాల జాబితా}}
 
* 2001 జనాభా లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో మొత్తం 28,123 [[గ్రామాలు]] న్నాయి. అందులో 26,613 నివాసిత గ్రామాలు 1,510 నివాసాలు లేని గ్రామాలు.
 
[[వర్గం:పాలనా విభాగములు]]