గాలిబ్ గీతాలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
|||
పంక్తి 12:
ఉర్దూ గజలులు రెండు పద్యపాదంలను మాత్రమే కల్గివుండును. దాశరథి గారు కూడా క్లుప్తత చెడకుండా రెండు పాదాలలోని భావాన్ని చాలావరకు రెండు పాదాలలోనే వ్రాసాడు. వివరణ అవసరమైన చోట పద్యపాదాలను నాలుగు పాదాలుగా పెంచిరాసాడు. అనువాదానికి ఆటవెలది, తేటగీతం వాడుకున్నాడు. అవసరమైనచోట ద్విపదను, రగడను ఉపయోగించినాడు.
===మచ్చునకు
<poem>
'''నరుడు నరుదౌట యెంతొ దుష్కరము సుమ్ము.'''
</poem>
లోకంలో ప్రతిపని సులభంగా నెరవేరదు. దానికై కష్టపడితేనే సాధ్యం.
<poem>
'''సింధువును జేరి బిందువు సింధువగును'''
'''ధ్యేయమును బట్టి ప్రతిపని దివ్యమగును.'''
</poem>
నీటి బిందువన్నది వెళ్ళి మురికికాల్వలో చేరిన అది కలుషితమై మురికినీరవ్వుతుంది. పంటకాలువలో కలిస్తే మొక్కలకు చేరుతుంది. మరి అది సముద్రంలో కలిస్తే, దానితో మమేకమై సముద్రంగా మారుతుంది. వున్నతమైన వ్యక్తులతో కూడితే మనం వున్నతులమవ్వుతాము.
<poem>
'''నడుము బిగియుంచుచుంటివి నన్ను దునుమ,'''
'''నాకు తెలియులే నీకెంత నడుము కలదొ!'''
</poem>
ప్రియుడు తనప్రియురాలిని పైకి నిందించునట్లు అన్పించినను, నర్మగర్భంగా ప్రియురాలి దేహసొబగును మెచ్చుకుంటున్నాడు. తనను చంపటానికి కొంగును నడుముకు బిగిస్తున్నది చెలియ. నడుమేలేని చాన కొంగు ఎక్కడబిగించగలదు. కందిరీగవంటి నడుమున్నప్రేయసి అని కవిభావము.
<poem>
'''అన్ని రోగములకు నౌషధం బుండియు'''
'''ప్రణయ రోగమునకు కనము మందు '''
</poem>
ఈలోకంలో అన్నిరకాల జబ్బులకు ఔషధాలున్నాయి. కొత్తకొత్త జబ్బులకు కొత్తరకం మందులను పరిశోధించి కనుగొంటున్నారు. అయితే అనాదికాలం నుండి నేటి వరకు, అదేమి విచిత్రమో? ఇంతవరకు ఎవ్వరు కూడా ప్రేమరోగానికి ఎలాంటి నివారణఓషధును కనిపెట్టలేకపోయారు. అనగా ప్రణయపవిరహంలో నున్నవాడికి ప్రియురాలి ప్రేమొక్కటే మందు.
<poem>
'''ఏల నన్ను మరచె నెరుగబోయితి, నామె'''
'''వలపుచూపు చూచె భస్మమైతి'''
</poem>
ఎందుకో?ఎమో?!ఈ మధ్యకాలంలో గాలిబ్ ప్రియురాలు గాలిబ్ను అంతగా సరకు చెయ్యడంలేదు. మరచినట్లు నటిస్తున్నది.ఎందుకలా?. కోపంతో, బాధతో అడుగబొయ్యిన గాలిబ్ ప్రేయసిచూసిన వలపు చూపునకు భస్మమైయ్యాడు. అంతేకదా? కలకంఠి కొనచూపుకు లొంగని పురుషపుంగువులున్నారే ఇలలో?.రెండువాక్యాలలో ఇంతుల,పుబంతుల వాలుచూపులెంత సమ్మోనకారమో తెలియచెప్పాడు.
<poem>
'''నాదు గుండెగాయము కుట్టు సూదికంట'''
'''ఆశ్రుజలధార దారమై అవతరించె'''
</poem>
ఆమెను అతను ఎంతగానో మోహిస్తున్నాడు. కాని ప్రియురాలేమో
<poem>
'''మృత్యు వేతెంచినపుడామె లేఖవచ్చె,'''
'''చదువకయె వక్షమున నుంచి చచ్చినాను.'''
</poem>
పాపం?అతను ఆమెను మనసారా వలచాడు.కాని ప్రియురాలేమో అతనిప్రేమను కఠినంగా తిరస్కరించింది.కాని అతడు సర్వసంవదలి ఆమె ప్రేమకై, అమె అంగీకారానికై జీవితాంతం అమెగురించిన మధురభావనలతో ఎదురుచూస్తూనే వున్నాడు. ఎట్టికేలకు ప్రేయసి మనస్సుకరిగి, అంగీకారంతెల్పుతు లేఖ పంపినది. లేఖ చేతికందినది. కాని చదవకయే కనుమూసినాడు. ఏ ప్రియురాలు ప్రేమకై చకోరపక్షిలా ఎదురుచూసాడో, ఆ ప్రేయసి తనప్రేమ నంగీకరించిందన్ననిజం తెలియకుండనే మరణించాడు. ఎంతటి దురదృష్టవంతుడు?శరత్బాబు దేవదాసు గుర్తుకొస్తున్నాదు.
<poem>
'''అన్ని బంధాల విదలించినట్టి యెడద '''
'''కురుల ఉరులందునన్ చిక్కుకొనెను,చెలియ!'''
</poem>
జీవితంలోని అన్నిబంధాలనుండి విముక్తుడయ్యాడు.అదేమి విచిత్రమో! ప్రియురాలి వలపుగాలంలో చిక్కుకున్నాడు. వురుల(వుచ్చుల)వంటి ప్రియురాలికురులలో ప్రియుడిమనస్సు చిక్కుకుపోయి, బంధి అయ్యాడట!. కాంతకనకాలకు లొంగనివాడెవ్వడు ఇలలో.
<poem>
'''లోకమందు సుఖము శోకమ్ము కలవండ్రు'''
'''శోకమనసె ఇచ్చె నాకు బ్రహ్మ'''
</poem>
జగతిలో మనష్యులకు సుఖదుఃఖాలు సహజం. కొన్నిదినాలు కష్టాలనుభవించినను, పిమ్మట సుఖలను,భోగాలను పొందటం సహజం, అనివార్యం. పాపం? గాలిబుకు మాత్రం నుదుట అన్నిదుఃఖాలనే, కష్టాలనే రాసాడు ఆ బ్రహ్మ.
<poem>
'''కత్తి చేతలేక కదనమ్ము జరిపెడి'''
'''ఇంతి కెవ్వ దనువు లీయకుండు?'''
</poem>
యుద్ధం చేయువారు, రెండువైపులవారు ఆయుధాలను చేతధరించి సమరంచేస్తారు, పోరాటం సల్పుతారు. ఇక్కడేమో కదనం రమణీమణితో. చేస్తున్నది ప్రేమయుద్ధం. పూబోణిచేతిలో ఎటువంటి ఆయుధం చేతపట్టక, తన రమణియసౌందర్యంతో, వలపుచూపులతో హృదయాన్ని తూట్లుపొడుస్తుంటె, తనువులర్పించని వారుంటారా జగతిలో ?
<poem>
'''ఈ జగత్తు స్వభావమ్ము హీనమౌర!'''
'''మంచిచేసిన వానిని ముంచునౌర!'''
<poem>
రానురాను ప్రపంచము లో మనస్సుల మధ్య విలువలు నిస్సిగ్గుగా వలువలు విప్పుకుంటున్నాయి, నగ్నంగా నర్తిస్తున్నాయి. ఒక్కప్పుడు అందరి కోసం ఒక్కడు-ఇప్పుడు నాకోసం అందరు. ఒకప్పుడు పక్కవాడికి మనమేమైన సహయపడగలమా? అని తోటి వాడు ఆలోచించేవాడు. మరినేడు మీ ఇంటికొస్తే ఏమిస్తావు! మా ఇంటికొస్తే ఏమితెస్తావూ!. అపకారికి ఉపకారం చేయమన్నారు నాడు - నీకు ఉపకారం చేసినవాడికే ద్రోహం చెయ్యడం నేటి నీతి.
<poem>
'''వేరులో నుండి కొమ్మలు వెలసినట్లు'''
'''అన్ని శబ్ధాలు నిశ్శబ్దమందె పుట్టె'''
</poem>
చెట్టు కాండం, కొమ్మలు, ఆకులు పెరగాలంటె దాని వేరే ములాధారం. అలాగే శబ్ధంకూడా నిశ్సబ్దం నుండె ఆవిర్భవించింది. ప్రణవనాదం (ఓం కారం) పుట్టుకకు ముందు విశ్వమంత నిశ్శబ్దమే రాజ్యమేలింది. బిగ్బ్యాంగ్ సిద్ధాంతం కూడా అదే చెప్పుతున్నది.
<poem>
'''తారలెల్ల పగలు పరదాల దాగె'''
'''రాత్రివేళ నవి దిగంబరమ్ములయ్యె.'''
</poem>
ఈ పద్యంలో ద్వందార్థాలు గోచరిస్తాయి పాఠకునికి. నక్షత్రాలు ఆకాశంలో ఎప్పడూ వుంటాయి. అయితే పగలు సూర్యకాంతి గగనమంతా పరచుకున్నందున, దాని ప్రకాశంలో చుక్కలు పగలు కంటికి ఆనవు. రాత్రివేళ గగనమంతా నిండుకొని కనులవిందు చేస్తాయి. పగటిపూట సూర్యాకాంతిని ఆకాశాన్నికప్పిన పరదాగా భావించాలి. మరోఅర్థంలో అంతపురంలోని గోషాస్త్రీలు బురకాలుధరించి పరులకు, పురుషులకు కన్పించరు. రాత్రివేళ సంగమవేళ దిగంబరులవుతారు ప్రియునితో కూడుటకై.
<poem>
'''వలపు లేనాటికి నిష్పలము కావు,'''
'''కాయ గాయని వృక్షమ్ము కాదు వలపు.'''
</poem>
కాయలుకాసి పండ్లనివ్వనిచెట్లు ఎలావ్యర్థమో, అలాగే ప్రేమించని హృదయంకూడా వ్యర్దమేనంటున్నాడు గాలిబు.
<poem>
'''జ్వాలయే దీపమునకు సర్వస్వమట్లు'''
'''ప్రణయమే జీవనమునకు సర్వస్వమయ్యె.'''
</poem>
దీపం నిరంతరం వెలుగుటకు జ్యాల (మంట) ఎంత అవసరమో. జీవితానికి ప్రేమ అంతటిఅవసరం. ప్రేమే జీవితం. ప్రేమైకజీవితమే రమ్యం, ధన్యం, పరిపూర్ణం.
|