ఈ సమయంలో [[1952]] [[అక్టోబర్ 19]]న [[పొట్టి శ్రీరాములు]] అనే గాంధేయవాది, మద్రాసు రాజధానిగా ఉండే ప్రత్యేకాంధ్ర సాధనకై మద్రాసులో ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించాడు."మద్రాసులేని ఆంధ్ర తలలేని మొండెం" అన్నాడు. ఈ దీక్ష ఆంధ్ర అంతటా కలకలం రేపినా, కాంగ్రెసు నాయకులు, కేంద్రప్రభుత్వంలో మాత్రం చలనం రాలేదు. 1952 [[డిసెంబర్ 15]]న 58 రోజుల అకుంఠిత దీక్ష తరువాత పొట్టి శ్రీరాములు '''అమరజీవి''' అయ్యాడు. ఆయన మృతి ఆంధ్రుల్లో క్రోధాగ్ని రగిలించి, హింసాత్మక ఆందోళనకు దారితీసింది. ప్రజల్లో అనూహ్యంగా వచ్చిన ఈ స్పందనను గమనించిన నెహ్రూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా లోక్సభలో 1952 [[డిసెంబర్ 19]]న ప్రకటించాడు. 11 జిల్లాలు, బళ్ళారి జిల్లాలోని 3 తాలూకాలు ఇందులో భాగంగా ఉంటాయి.