భలే రాముడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
 
==చిత్రకథ==
జమీందార్ నారాయణ రావు (జంధ్యాల) కు ఇద్దరు కూతుర్లు; రూప మరియు తార. ఇద్దరికీ ముద్దుగా పెంచుతూ నాట్యం నేర్పిస్తాడు. జమీందారు వద్ద గుమస్తా గా పనిచేస్తున్న (సి.ఎస్.ఆర్.) కొడుకు రాము. రాము రూపకు పూలగుచ్చాన్నిపూలగుచ్ఛాన్ని బహుకరిస్తూబహుకరిస్తూండగా రూప మెట్ల మీదనుండి జారి పడిపోతుంది. తద్వారా కుంటిదై పోతుందని బాధపడుతున్న జమీందారు రామునువెంటబడి వెంటబెట్టిరామును రివాల్వర్ తో కాలుస్తాడు. గాయపడిన రాము నదిలో దూకేస్తాడు. జమీందార్ పోలీసులకు భయపడి పారిపోతాడు. తన ఆస్తిని మరియు పిల్లల సంరక్షణ గుమస్తాకు అప్పగిస్తాడు.
 
చాలాకాలం తర్వాత రాము, కృష్ణ (అక్కినేని) పేరుతో తిరిగి పట్నానికి వస్తాడు. ఈ మధ్యకాలంలో గుమస్తా జమీందారీ వ్యవహారాల్ని చేజిక్కించుకుని పిల్లల్ని పేదరికానికి విడిచిపెడతాడు. కృష్ణ అప్పన్న (రేలంగి) తో స్నేహం చేస్తాడు. రూప కృష్ణకు ఆశ్రయమిస్తుంది క్రమేణా అది ప్రేమగా మారుతుంది. చివరికి రూప వైద్యం కోసం జమీందారీ నుండి డబ్బును దొంగిలిస్తాడు. గుమస్తా చిన్న కొడుకు చలం తారను ప్రేమిస్తాడు. రాము వారిద్దరికీ వివాహం జరిపిస్తాడు. జమీందారు ఎక్కడ తిరిగి వస్తాడో అనే భయంతో అతన్ని బయటపెట్టడానికి నృత్య ప్రదర్శన ఏర్పాటుచేస్తాడు. చివరికి పోలీసులు వచ్చి రాము మరియు కృష్ణ ఇద్దరూ ఒక్కరేనని పుట్టుమచ్చ ఆధారంగా గుర్తిస్తారు. చివరికి రాము మరియు రూప వివాహంతో కథ సుఖాంతం అవుతుంది.
"https://te.wikipedia.org/wiki/భలే_రాముడు" నుండి వెలికితీశారు