తంతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 63:
కట్ట కడపటికి 1843 మార్చి లో మోర్స్ బిల్లు కాంగ్రెస్ లో ప్రతిపాదించబడినది. సమావేశం బహు నాటకీయంగా మరుసటి రోజు తెల్లవారు జాముదాకా జరిగింది. కాంగ్రెస్ లో జరుగుతున్న వాదోప వాదాలను గ్యాలరీ లో కూర్చొని వింటున్న మోర్స్ కి బిల్లు వీగిపోయే సూచనలు కనబడగానే అర్థరాత్రి రైలులో న్యూయార్క్ కి వెళ్ళిపోయాడు. అక్కడి కెళ్ళే సరికి అతని వద్ద 27 సెంట్లు మాత్రమె మిగిలాయి. మరుసటి రోజు ఏకాంతంగా గదిలో కూర్చున్న మోర్స్ దగ్గరికి ఓ మిత్రుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. "89-83 ఓట్లతో బిల్లు ఆమోదించబడింది. నీవు గెలిచావు."
==మోర్స్ టెలిగ్రాఫ్ ప్రారంభం==
వాషింగ్టన్, బాల్డిమోర్ మధ్య పని వెంటనే ప్రారంభమైంది. ఓ ప్రముఖ వాణిజ్య సంస్థ ప్రతినిధి, ఎజ్రా కార్నెల్ రాగితీగలను సరఫరా చేశాడు.(కొన్నేళ్ళ తరువాత బాగాడబ్బు సంపాదించి తన జన్మస్థలంలో కార్నెల్ విశ్వవిద్యాలయం స్థాపించాడు) తపాలా శాఖ అధ్యక్షుడు శక్తి వంచన లేకుండా అనేక అంతరాయాలు కలిగించాడు. అతని మనుషులు రాత్రిపూట తీగలు తుంచివేసేవారు. నాటిన స్థంభాలను పడగొట్టేవారు. పనిచేస్తున్న కార్మికులను బెదిరించటానికి గాలిలో కాల్పులు జరిపేవారు. ఈ విధ్వంసక చర్యలను ఎదుర్కోవటానికి మోర్స్, వైల్ ఇద్దరూ రంగంలోకి దిగారు. విధ్వంశకాండకు కారకులైన వాళ్ళపై ఋజువులతో సహా అమెరికా అధ్యక్షునికి వినతి పత్రం సమర్పించారు. ఫలితంగా తపాలా శాఖ అధ్యక్షుడు రాజీనామా చేశాడు.
 
1844 [[మే 24]] వ తేదీన "భగవంతుడు ఏం చేశాడు"(What hath god wrought) అనే సందేశం టెలిగ్రాఫ్ ద్వారా ప్రసారమైనది. కానీ సామాన్య ప్రజలు దీన్ని పట్టించుకోలేదు. ఇంగ్లండ్ లో జరిగినట్టుగానే కాకతాళీయంగా జరిగిన ఓ చిన్న సంఘటన వల్ల టెలిగ్రాఫ్ అమాంతంగా ప్రచారంలోకి వచ్చింది. అధ్యక్ష పదవికి అభ్యర్థులను నిర్ణయించటం కోసం డమాక్రటిస్ పార్టీ బాల్టిమోర్ లో సమావేశం ఏర్పాటు చేసింది. అమెరికా 11 వ అధ్యక్షుడుగా పోటీ చేయడానికి జేమ్స్ నాక్స్ పోక్‍నీ,ఉపాధ్యక్ష అభ్యర్థిగా సిలాన్ రైట్ నీ సమావేశం ఎన్నుకుంది. ఈ వార్తను వైల్ టెలిగ్రాఫ్ ద్వారా వాషింగ్టన్ కు చేరవేసే సరికి రైట్ కాంగ్రెస్ సభ చర్చల్లో పాల్గొంటున్నాడు. మోర్స్ స్వయంగా సందేశాన్ని రైట్ కి అందించాడు. పోటీలో పాల్గొనటం తనకిష్టం లేదని రైట్ ప్రకటించగానే మోర్స్ ఈ సమాచారాన్ని బాల్టిమోర్ కి పంపించాడు. ఉపాధ్యక్ష పదవికి రైట్ ని ఆమోదించి అరగంట గడవక ముందే అతడు అంగీకరించడం లేదన్న వార్తను డెమోక్రాటిక్ పార్టీ సమావేశం లో ప్రకటించేసరికి అందరూ దిగ్భ్రాంతులయ్యారు. వార్తను నమ్మలేక సతమతమవుతున్న సందర్భంలో వాషింగ్టన్ నుంచి పార్టీ ప్రత్యేక దూత వచ్చి రైట్ తిరస్కృతిని అధికారికంగా తెలియజేశాడు. దీంతో మోర్స్ కనుగొన్న టెలిగ్రాఫ్ సాధనానికి అనన్య ప్రచారం లభించింది. పన్నెండేళ్ళ నిరంతర కృషి, నిరాశా నిస్పృహలు, యాతనలు ముగిశాయి. అతని కీర్తి నలుదిశలా వ్యాపించింది. డాష్, డాట్ లతో కూడిన కొత్త టెలిగ్రాఫ్ భాష జైత్ర యాత్రకు బయలుదేరింది.
 
<!-- గౌరవ సహసభ్యులకు మనవి: ఈ వ్యాసం పూర్తిగా విస్తరించటానికి మూడు రోజుల సమయం పడుతుంది. కనుక అంతవరకు వ్యాసం విస్తరణ దిద్దుబాట్లు చేయకుండా సహకరించండి.అక్షర దోష దిద్దుబాట్లు చేయండి -->
"https://te.wikipedia.org/wiki/తంతి" నుండి వెలికితీశారు