సంస్కృతం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 88:
 
“సంస్కృతభాషయు తన్నిబద్ధవిషయములును భారతదేశమునకు పరంపరాగతములైన పెన్నిధానములు. ఇవి భారతీయులకు పూర్వులనుండి వారసత్వముగా సంక్రమించిన మహోత్కృష్టభాగ్యరాశిగా చెప్పదగినవి. ఇవి భారతదేశములో నిలచియున్నంతకాలము ఈదేశమునకు మూలభూతమైన ప్రతిభ జీవించియుండును”
ఇది భారతప్రధాని శ్రీ నెహ్రూగారు సంస్కృతభాషావాఙ్మయములనుగురించి వెలుబుచ్చిన అమూల్యాభాప్రాయము.==సంస్కృతభాషావైభవము==
 
====అమృతభాష====
 
సంస్కృతము ఏప్రాంతములోను నిత్యవ్యవహారభాష కానంత మాత్రముచేత కొందరు దీనిని మృతభాషయనుట అసమంజసము. భారతదేశములో సంస్కృతము జీవద్భాషయే యనునది స్పష్టమైన సత్యము. మృతభాషలైన గ్రీకు, లాటినులను సంస్కృతముతో పోల్చి చూతుమేని మృతభాషావాదము నిస్సారమని తెలియగలదు. నేడు ఒక సంస్కృతగ్రంథము ముద్రింపబడుచో సంవత్సరమునకు కొన్ని వేల ప్రతులు విక్రయింపబడుటను చూచుచున్నాము. అట్టి గ్రంథములు వందలకొలది ముద్రితము లగుచున్నవి; చెల్లుబడి యగుచున్నవి. గ్రీకు, లాటిన్ గ్రంథముల కింత ఆదరము లేదు సరికదా యిందులో శతాంశమైనను లేదు. నేడు వేలకొలది ప్రజలుగల సభలలో సంస్కృతమున ఉపన్యాసములు జరుగుటయు, ప్రజలు వాని నర్థముచేసికొనుటయు చూచుచున్నాము. మద్రాసువంటి ఆధునికపట్టణములో వేలకొలది మంది అర్థము చేసికొను భాషను మృతభాషయనుటకంటె అసత్యము మరొకటి యుండదు. గ్రీకు భాషలో ఉపన్యాసము జరుగుచో ఇంగ్లండులోనేకాదు గ్రీసు దేశములోకూడ ఏపట్టణములోను నూరుమందికూడ అర్థము చేసికొనజాలరు. ఇట్టి యనేక కారణములవలన సంస్కృతము నేటికికూడ జీవద్భాషయే యని స్పష్టమగుచున్నది. సంస్కృతము నేర్వనివారికి కూడ లోకోక్తి రూపముగాను, సుభాషితరూపముగాను పదులకొలదిగనైనను సంస్కృతశ్లోకములు వచ్చియుండును. పైని చెప్పిన లక్షణములలో ఏదియు మృతభాష కుండదు.
 
సంస్కృతము మృతభాష కాకుండుటయేకాక మాధుర్యభరితమై యున్నందున అమృతభాషయని చెప్పదగియున్నది.
 
హిందూమతముతో బాటు సంస్కృతమును జీవింపక తప్పదు. సంస్కృతవిరహితమైన హిందూమతము ఊహకుకూడ అందనిది. హిందువుల మతగ్రంథములన్నియు - వేదములు, పురాణేతిహాసములు, భాష్యములు మున్నగునవన్నియు - సంసంకృతములోనే యుండుటచేతను, నిత్యకర్మలును. నిషేకాదిశ్మశానాంతకర్మలును, శ్రేతపౌరాణిక యజ్ఞములును, పారాయణగ్రంథములును, అన్నియు సంస్క\తములోనే యున్నందున హిందువులకిది శాశ్వతముగ సమాశ్రయణీయము. మహాత్మా గాంధి యిప్పట్ల నుడివిన యీ మాటలు గమనింపదగినవి.
 
“ప్రతి హిందూబాలుడును, బాలికయును సంస్కత భాషాజ్ఞానమును సంపాదింపవలయును. ప్రతి హిందువును అవసరము వచ్చినప్పుడు సంస్కృతములో మాట్లాడగల్గియుండవలయును.”(Mahatma Vol. II, p 361)
 
ఒకప్పడు క్రైస్తవమతమునకు పవిత్రభాషగా నుండి క్రైస్తవమతముతోబాటు శాశ్వితముగా జీవించీతీరునను అభిప్రాయమును గల్గించుచుండిన లాటిన్ భాష ఈనాడు క్రైస్తవమతమును వీడినట్లే సంస్కృతముకూడ హిందూమతమును వీడరాదాయను సందేహమెవరికైనను కలుగవచ్చును. అసాదృశ్యము సరియైనదికాదు; (1) ఆదిలో లాటిన్ ద్వారా క్రైస్తవమతము యూరపులో వ్యాపించినను తన్మత మూలగ్రంథము లాటిన్లో పుట్టియుండలేదు. కావున లాటినుకును క్రైస్తవమునకును సంబంధము మూలమట్టమైనదికాదు. (2) హిందూమత మూలగ్రంథములలో అర్ధశక్తియేగాక అక్షరశక్తికూడ కలదు ఆ అక్షరములు అదేరీతిగా, అదేస్వరముతో ఉచ్టరింపబడుచో అపూర్వముపుట్టునని యీమతములోని సిజ్ఝాంతము కావున మూల గ్రంథమునకు ప్రముఖస్ధానము ఎప్పుడును పోదు. (3) ఈ మతమునకు చెందిన ఉద్గ్రంథములలో - ముఖ్యముగ త్రిమతస్ధుల ప్రస్థానత్రయ భాష్యములలో శబ్దవిచారమే ముఖ్యముగా చేయబడినది. “ఇచ్చట ఏవకారమునకు ప్రయోజన మేమి?”,”అక్కడ ఆధాతువునకు ఆప్రత్యయము వచ్చినందున ఆయర్ధము తెలుపబడుచున్నది”__ఇత్యాది ధోరణిలో భాషమీదనే విశేషముగ విచారణ జరిగియున్నందున, ఈ మతముతో సంస్కృత భాషకుగల సంబంధ మెన్నటికిని పోదు. (4) ఇంతవరకు భారతీయ భాషలలో రామాయణ భారత భాగవతములకు అసంఖ్యాక పరివర్తన గ్రంథములు బయలుదేరినను ఏ యొక ధార్మికవిషయమునగాని భక్తివిషయమునకాని తత్వవషయమున కాని సందేహము వచ్చినను మూల సంస్కృతగ్రంథమును చూచియే సందేహమును తీర్చుకొనుచున్నారుకాని యీ ప్రాంతీయభాషాగ్రంథములను చూచి సందేహమునెవ్వరును తీర్చుకొనుటలేదు. కావున ఫ్రామాణికత మూలసంస్కృత గ్రంథములకు పోయే అవకాశము లేదు. (5) సంస్తృతమువంటి అమూల్యరత్న నిధానమును హిందువులు విడిచిపెట్టుకొందురనుటకంటె వీరికిచేయబడు అన్యాయము వేరొండు లేదు.
 
====భారతీయ భాషలకు ప్రాణము====
 
ఆధునిక యుగమున భారతదేశములో ఫ్రాంతీయ భాషలకు సంస్కృతమువలన కలుగు పరిపుష్టి వర్ణనాతీతము. ఏభావమునైనను, భావచ్చాయనైనను తెలుపగల పదములు సంస్కృతములో సిద్ధములై యుండుటయేకాక అవసరమైనకొలదియు నూతన పదములను సృజించుకొను అవకాశము ఇందున్నంత పుష్కలముగా మరి యేభాషలోను లేదు. ఆయా ధాతువులకు చేర్చబడు ఉపపర్గల వలనను తిఙకృత్ప్రత్యయముల వలనను అనంతపదజాలము కల్పింపబడుట కవకాశమున్నది. అట్లే సుబంత తద్ధిత రూపములును కొల్లలుగా సంపాదింపబడును. ఒక్కధాతువునుండి సుమారు 150 పదములను సృజించు అవకాశము సంస్ృతములో కలదు. ఇట్టి యవకాశము మరి యే భాషలోను లేదు. ఇంత భాగ్యవంతమును, సమృద్ధి మంతమును అయిన భాష ఆధునికయుగములో నిర్వహింపవలసిన కార్య మెంతయో కలదు.
 
బహువిధోద్యమములతోను, వైజ్ఞానిక సంచలనములతోను చైతన్యవంతమైన ఆధునిక కాలములో సంస్కృతము చేయుచున్నట్టియు, చేయగల్గినట్టియు సహాయ మింతింతయని చేప్పజాలము. సంస్కృతసహాయము లేనిచో సుమారు అర్థశతాబ్దినుండి ఆంధ్రరేశములో ( అట్లే యితర భాషాప్రాంతములలో ) విజృంభించుచున్న అనేకోద్యమము లింతగా ప్రజల హృదయములను తాకెడివికాదు. గ్రంధాలయోద్యమము, వయోజన విద్యాప్రచారము, సహాయ నిరాకరణోద్యమము, గ్రామ్య గ్రాంధికభాషా వివాదము, భావకవిత్వ ప్రస్ధానము, సారస్వత విమర్శనము, చారిత్రక పరిశోధనము - అది యిది యననేల – ఆధునిక జీవిత విజృంభణ మంతయు సంస్కృత భాషావలంబనము చేతనే జరిగినది. సంస్కృతమునకా పటుత్వమున్నది. ఏయుద్యమము బయలుదేరినను అది ప్రజల హృదయములలో నాటుకొనిపోవులనట్లు చేయగల అమోఘ శక్తి సంస్కృతభాష కుండుటచేత సంస్కృతముద్వారా ఉద్యమములు వ్యాపించుటయే కాక ఉద్యమములద్వారా సంస్కృతభాష కూడ అపారముగా వ్యాపించిపోయినది. ఏమాత్రము విద్యాగంధము లేనివారికికూడ ఆయాయుద్యమ భావములతోఁబాటు సంస్కృతభాషా పదములుకూడ అందఁజయఁబడినవి. తత్ఫలితముగా నేఁడు సంస్కృత పదములు వెనుకకంటె హెచ్చు వ్యాప్తిలోనికి వచ్చినవి. మునుపు సంస్కృత పండితులకు మాత్రమే యర్థమగుచుండిన కొన్ని సంస్కృతపదములు నేడు సామాన్యజనుల కర్ఝమగుచున్నవి.
 
1920 వ సంవత్సరమునకు పూర్వము మనదేశములో "గ్రంథపఠనము”, “స్వార్థపరుడు”, “దృఢసంకల్పము” మున్నగు పదములకు అర్థమేమని దారినిపోవువాని నెవ్వని నైనను అడుగుచో అతడు తెల్లబోయెడివాడు. నేడు ఆంధ్రపత్రిక, ఆంథ్రప్రభ మున్నగు పత్రికలను చదువు సామాన్యజనుడు కూడ వీనియర్ధమును గ్రహించగల్గుచున్నాడు. కారణమేమి? ఆయా ఉద్యమములతోపాటు ఇట్టి పదములు కూడ ప్రజలకు పరిచితములైపోయినవి. మనకు తెలియకుండగనే సంస్కృతము మనకు సహాయము చేయుచున్నది. అది సమస్తాధునికోద్యమములకు సహాయము చేయుచు, అన్నింటి మూలముననుకూడ వ్యాప్తిచెందుచు తన విలక్షణప్రభావమును లోకమునకు చాటుచున్నది.
 
ఆధునిక నాగరికతకును సంస్కృతభాషకును ఇట్టి సంబంధము కలదు. ఇది భారతదేశములోని అన్ని ప్రాంతీయ భాషలకును వర్తించును. కావుననే భారత కేంద్రప్రభుత్వమునకు అధికారభాష కావలసిన హిందీ పదములను స్వీకరింపవలసినపుడు ముఖ్యముగా సంస్కృతమునుండియు, తరువాత ఇతర భారతీయభాషల నుండియు (...by drawing, whereever necessary or desirable, for the vocabulary, primarily on Sanskrit and secondarily on other languages) స్వీకరింపవలయుననని భారత రాజ్యాంగ ప్రణాళికలో ఉపనిబద్ధమైయున్నది. (Part XVII, Chapter IV, 351)
 
భారతదేశములోనేకాదు, ఇతరదేశములలో కూడ ఆధునిక వ్యవహారములకు సంస్కృత సహాయము పొందబడుచున్నది. సయాం, జావా మున్నగు దేశములలో దేశీయ భాషలు ఆధునిక వ్యవహారములకు ఉపయోగవడుటకై పరిపుష్టిని సంస్కృతభాషనుండి పొందుచున్నవి. సింహళ విశ్వవిద్యాలయాచార్యులైన శ్రీ వి. జి. సేకరేస్వీయ దేశ భాషాభివృద్ధి మార్గమును నిర్దేశించుచు నుడివిన యీమాటలు గుర్తింపదగినవి. “ఇంత కాలముపేక్షింపబడిన దేశీయభాష త్వరలోనే గురుతర బాధ్యతలను వహింపవలసివచ్చును. ఈ దేశీయభాషాభీవృద్ధిసందర్భమున మనకు ప్రధానమైన స్ఫూ ర్తి సంస్కృతభాషనుండి రావలసియున్నది. దీనినెల్లరు నంగీకరింతురు. విపులమైన శబ్దజాలము, శాస్త్రీయపారిభాషిక పదసమూహము సంస్కృతమున కాస్థానమును గల్గించుచున్నవి. సంస్కృత ధాతువుల నాధారముగా చేసికొనియే మనము నూతనపదములను నిర్మించుకొనవలసి యున్నది.” (22-6-54 తేదీని జాఫ్నాలో జరిగిన సంస్కృత మహాసభలోని ఉపన్యాసము.)
 
భారతదేశములోని యే ప్రాంతీయ భాషాసాహిత్యములోనైనను ప్రవేశించుటకు గాని గ్రంథరచనగావించుటకుగాని సంస్కృతభాషాజ్ఞానము తప్పనిసరిగా నుండదగినది. ఈ సంస్కృతప్రభావము ప్రాచీనరచనలలోను, అర్వాచీనరచనలలోను సమానముగానే యున్నది. ప్రాంతీయభాషాప్రత్యయములను తొలగించి సంస్కృత ప్రత్యయములను చేర్చుచో సంస్కృతభాషగానే మారిపోవు రచనలు నాడును నేడును గూడ సర్వ ప్రాంతీయభాషలలోను కలవు. సంస్కృతపదభూయిష్టములైన రచనలే అన్ని ప్రాంతీయభాషలలోను జనసామాన్యముచే ఆదరింపబడుచున్నవి. ఏగ్రంథములు సంస్కృతపదములను వాడరాదను అభిప్రాయముతో కవులచే రచింపబడినవో ఆ గ్రంథములే కృతిమములుగాను, కఠినములుగాను గన్పట్టుచున్నవి. ధారాళముగా సంస్కృత పదములు ప్రయోగింపబడిన గ్రంధములు జనసామాన్యమున కర్థమగుచున్నవి. కొన్నిపట్ల సంస్కృతపదభూయిష్ఠరచనయు కఠినముగా నుండవచ్చును. కాని యా కాఠిన్యమునకు కారణము ఆపదములు సంస్కృతపదములై యుండుటకాదు. అట్టిపదములు సంస్తృతగ్రంథములలోనున్నను ఆ గ్రంథములు సంస్కృత పండితులకు కఠినముగానే యుండును. వానికి బదులుగా తేలికయైన సంస్కృతపదములు వాడబడుచో ఆ రచన తెలుగు గ్రంథములోనున్నను తేలికగనే యుండును. సంస్కృతగ్రంథములలోనున్నను తేలికగానే యుండును. కావున కాఠిన్యసౌలభ్యములు ఆ ప్రయుక్తపదములకు సంబంధించినవే కాని భాషకు సంబంధించినవి కావు.
 
నేటి భారతీయ భాషాసాహిత్యములతో సంస్కృతమునకు గల గాఢసంబంధము గట్టిగా మనస్సునకు తట్టవలయున్న్నచో అప్పుడప్పుడు జరుగుచుండు సర్వప్రాంతీయ కవిసమ్మేళమములో పద్యములను మనము వినవచ్చును. ఇంచుమించు అన్నిప్రాంతీయభాషలలోను అవే సంస్కృత పదములు విననగును; భిన్నభారతీయ భాషలనడుమ ఎంత ఐక్యముకలదో స్పష్టముగ గోచరించును.
 
నేటి మన వ్యవహారరంగములోను, సాహిత్యరంగములోను సంస్కృతమెంత సన్నిహిత సంబంధమును గల్గియున్నదో, సంస్కృతాభ్యాసము పెరుగుచో ఈ ఉభయరంగములలోను మన భాషాపాటవ మెంతగా పెరుగునో, జాతీయజీవన మెంత సౌభాగ్య వంతముగానుండునో పై విచారణమువలన తెలియగలదు. నవయుగములో సంస్కృత పునరుజ్జీవనము ప్రాంతీయభాషా పునరుజ్జీవనములో నొక ముఖ్యభాగముగా భావింపవలయుననియు, సర్వప్రాంతీయ భాషలలోను సంస్తృతపదజాలము పెరుగుచున్న కోలదియు భాన్నభిన్న ప్రాంతములవారు పరస్పరము దగ్గరకు చేరుకొనుటకును, భారతీయులలో ఏకజాతీయభావము ఇతోధికముగా సునిరూఢముగుటకును దోహదమేర్పడుననియుకూడ దీనివలన స్పష్టమగుచున్నది.
 
====శబ్దశక్తి====
 
సంస్కృతమునకు ప్రాంతీయభాషలతోగల సంబంధమును గురించిన విచారణము ఇంతటితో నాపి సంస్కృత పదముల సహజశక్తిని గురించి యొకింత చెప్పవనసియున్నది.
 
ఇతర భాషలలో అనేక పదములచే చెప్పవలసిన భావమును సంస్కృతములోని ఒక్క వదము చెప్పగలదు. నాలుగుదాహరణములను మాత్ర మీక్రింద నిచ్చుచున్నాను.
యాయజూకః = తఱచుగా యజ్ఞములు చేయువాడు.
జిగమిషా = పోవలయునను కోరిక.
రామతే = రామునివలె ఆచరించుచున్నాడు.
కేశాకేశి = జుట్టుజుట్టు పట్టుకొని యుద్ధముచేయునట్లు.
ఇట్టి శబ్దపటుత్వము నేటి ప్రపంచభాషలలో దేనికిని లేదు.
 
ఇంతియేకాక రెండు మూడక్షరములు గల చిన్న పదములు గొప్ప భావమును స్ఫురింపజేయుట సంస్కృతములోనే కాంచనగును. ధర్మ శబ్దమువలన దాని నాచరించువాడు మంచిస్ధతిలో ధరింపబడునని బోధింపబడుచున్నది. రధ్యా శబ్దమువలన పూర్వము వీధులు రధమునడుచుటకు తగినంత వెడల్పుగా నుండెనని తెలుపబడును. శరీర శబ్దమువలన నిది శిధిలమైపోవునను (శీర్యతే) తత్వబోధ చేయబడుచున్నది. స్మృతి శబ్దమువలన మనుస్మృత్యాది గ్రంథములు, వేదములను స్మరించుచు వ్రాయబడినవే కాని తత్కర్తల స్వకపోలకల్పితములు కావని తెలియుచున్నది. ఈరీతిగా సంస్కృత శబ్దములకు లోకోత్తరశక్తి కన్పట్టుచున్నది. ఇతర భాషలలో నిది మిక్కిలి తక్కువ. మూలధాతువునకు కాని, మూలపదమునకు కాని దూరముకాకుండ, ప్రత్యభీజ్ఞానావకాశముగల్గునంత దగ్గరలో సంస్కృత పదములు నిలిచియుండుట యీ పరిస్ధితికిగల కారణములలో నొకటి. ఇతర భాషలలో పదములకు సరియైన వ్యుత్పత్తులు లభించుటే కష్టము; లభించినను అవి భాషా ప్రాజ్ఞులకో, లిశేష పరిశోధన గావించిన వారికో మాత్రమే లభించును. అజ్ఞాత వ్యుక్పత్తికములు సంస్కృతములో ఉన్నంత తక్కువగా మరియెందును లేవు.
 
ప్రపంచములో ఏ భాషలోని పదములకైనను వ్యుత్పత్తికావలసినచో సాధారణముగా ఇతరిభాషలలోనికి పోయి వెదకవలసియుండును. ఒక ఇంగ్లీషు పదమునకు వ్యుత్పత్తి కావలసినచో కల్టిక్, ట్యుటానిక్, హైజర్మన్, లోజర్మన్, లాటిన్, గ్రీక్ మున్నగువానిలో అది లభించును; అట్లే యితర భాషాపదములకును, ఈ మూలభాష లనుకొనబడుచున్నవాని పదములకు వ్యుత్పత్తి కావలసినచోకూడ మరొక భాషలో నన్వేషణము చేయవలసియుండును. గ్రీకులోని పదములకు కూడ అనేకములకు సంస్కృతములో వ్యుత్పత్తి లభించును. ఒక్క సంస్కృతములోని పదములకు మాత్రము వ్యుత్పత్తి అన్య భాషల కేగనక్కరలేకుండ ఆభాషలోనే లభించును. సంస్కృతముయొక్క సర్వ ప్రాచీనతకును స్వతమత్రతకును ఇది ప్రబల లిదర్శనము.
 
====శ్రావ్యత్వము====
 
అర్ధముకానివారికి కూడ శ్రవణ సుఖమును గల్గించు భాష సంస్కృతము. సంస్కృత శ్లోకములను విని యానందింపని వాడుండడు. నేటి భాషలలో కాని గ్రీకులాటినులలోగాని సంస్కృత వృత్తములంత మధురములైన వృత్తములు లేవు. Most musical metres – మధురతమ వృత్తములు - ఆని ఎ. ఎ. మాక్డొనెల్ సంస్కృత వృత్తములను వర్ణించి యున్నాడు. భగవత్గీతాది గ్రంధములలోని అనుష్టుప్ శ్లోకములును, మందాక్రాంత, వియోగిని, ద్రుతవిలంబితము, మాలిని మున్నగు వృత్తములు మధురాతి మధురములై సర్వ మనోరంజక శక్తిగలవై యొప్పుచున్నవి.
 
====చరమపరీక్ష====
 
సంస్కృత పండితులు సరస సాహిత్య సల్లాపములను గావింపునపుడు కాని, వేదాంతగోష్ఠిని నెరపునపుడు కాని, పురాణ ప్రవచనము సలుపునపుడు కాని వినునట్టి నవీన విద్యానాగరికతా సంపన్ను లెల్లరును తద్భాషా సౌందర్యము నకును, విషయ మహత్త్వ మాధుర్యములకును ముగ్ధులగుటను గాంచుచున్నాము. ఆధునిక సభ్యతలో నెంత ఉన్నతస్థతిలో నున్న వారును ఈ భాషాను వాఙ్మయమును నేర్చియుండినచో తమ జన్మ ధల్యమయ్యెడిదని భావించుట సర్వత్ర కాంచనగును. సంస్కృతమునకు గల అద్వితీయ మాధుర్య మహత్త్వముల కిది ప్రబల నిదర్శనము.
 
ఇట్టి సర్వతోముఖ సౌరభ సౌభాగ్యములు గల్గిన సంస్కృతభాష భారత భాగ్యరాశిలో అమూల్యరత్న మగుటయేకాక భారతీయులకు భారతీయతను నిలబెట్టగల్గిన సర్వప్రముఖ సాధనమై యలరారుచున్నది.
 
==సంస్కృతభాషావైభవము==
 
== చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/సంస్కృతం" నుండి వెలికితీశారు