హరిత విప్లవం నీటి పారుదల పంటలకు మాత్రమే వర్తించింది. వర్షాధార పంటలైన పప్పు, చిరుధాన్యాల దిగుబడులను పెంచడానికి ప్రయత్నించలేదు. హరిత విప్లవాన్ని [[పంజాబ్]], [[హర్యానా]], [[ఢిల్లీ]], [[రాజస్థాన్]], ఉత్తర ప్రదేశ్ ప్రాంతాల్లో రైతులు బాగా వినియోగించుకుని లబ్ధి పొందారు. హరిత విప్లవం ప్రభావం వల్ల గోధువుల ఉత్పత్తి 11 మిలియన్ టన్నుల నుంచి 75 మిలియన్ టన్నులకు పెరిగింది.