భర్తృహరి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) |
K.Venkataramana (చర్చ | రచనలు) |
||
పంక్తి 3:
సుభాషిత త్రిశతి లేక సుభాషిత రత్నావళి యను నది కావ్యములలో లఘుకావ్యజాతిలో చేరిను. ఈ కావ్యమును రాసిన భర్తృహరి విఖ్యాత సంస్కృత భాషా ప్రాచీన కవులలో ఒకడు. అతనిని, ఆతని గ్రంధములను గూర్చి విశ్వసనీయము లగు చారిత్రికాధారములు కానరావు. అతని జీవియములోని కొన్ని సంభవములు మాత్రము కథారూపమున అనుశ్రుతముగా సంప్రదాయబద్దమై లోకమున వ్యాపించి యున్నను నవి యొండొంటికి పొంది పొసగి యుండకపోవుటచే నానా విధ గాథలకును సామరస్య మేర్పరచుట దుస్సాధ్యమేయగును. భర్తహరి ఉజ్జయినీ రాజ వంశస్తుడనియు తనకు రాజ్య పరిపాలనార్హత యున్నను తన భార్య దుశ్శిలముచే సంసారమునకు రోసి రాజ్యమును తన తమ్ముడగు విక్రమార్కున కప్పగించి తాను వానప్రస్థుడయ్యెననియు నొక ప్రతీతి కలదు. ఈ విక్రమార్కుడే విక్రమ శకాబ్దమునకు మూల పురుషుడు. అది యటుండనిండు. భర్తృహరి విరచితమౌ లగు శతకముల నుండి యతనికి జీవితమున నాశా భంగము మిక్కిలిగా యేర్పడెననియు, స్వకుటుంబమునో యిరుగుపొరుగులనీ సూక్ష్మ దృష్టితో పరిశీలించుట వలన స్త్రీ శీలమున నతనికి సంశయము బలపడెననియు విశదమగును. అతనిని గూర్చి గ్రంధస్థమైన విషయములలో గొన్నింటిని పెర్కొందము.
==అయన గూర్చి వివిధ గ్రంధములలో విషయములు==
*
* ఇంకొక గ్రంధమున భర్తృహరి తండ్రి వీరసేనుడను గంధర్వుడనియు నీతనికి భర్తృహరి, విక్రమాదిత్యుడు, సుభటవీర్యుడను ముగ్గురు కుమారులును మైనావతి యను కుమార్తె యును గా నలుగులు సంతాన మన్యు దెలియవచ్చును.
* భర్తృహరి
* భర్తృహరి తల్లి సుశీల, ఆమె మూలమున నితడు మాతామహుని రాజ్యమున కథికారియై దానిని తనసోదరుడు విక్రమాదిత్యునకొసగెనని యింకొక గాధ.
* చంద్ర గుప్తుడను బ్రాహ్మణునకు నాల్గు వర్ణముల నుండియు నల్గురు భార్యలనియు వారికి యధాక్రమమున వరరుచి,విక్రమార్కుడు,భట్టి,భర్తృహరి యను కుమారులు జనించిరని మరియొక గాథ.
* మరియొక గాథ ననుసరించి విక్రమాదిత్యునకు బ్రాహ్మణ,క్షత్రియ,వైశ్య,శూద్ర కాంతలు నలువురు భార్య లనియు వారియందు వరరుచి, విక్రమార్క,భట్టి,భర్తృహరులు
ఇట్టి గాథల పరంపర ను బట్టి కవి చరిత్రను నిర్థారించుట ఎంత కష్టమో చదువరులు ఊహించవచ్చును. కాని పై గాధలనుండి ఈ కవి "మహారాజు అని, ఇహపర సౌఖ్యములను విడిచి విరాగియై సన్యాసం స్వీకరించినాడని, గొప్ప విధ్వాంశుడనీ, కవి అనీ, యోగి అనీ తెలియుచున్నది."
==కవి-కాలము==
ఈ కవి తన గ్రంధమునందు తన కాలనమును గూర్చి యేమాత్రము తెలియ జెయలేదు. కనుక పండిత ప్రతీతిని, గ్రంధస్థ ప్రమాణములను, ఇతర కవుల వ్రాతలను సాథనములుగా గొని నిర్థారింపవససియున్నది.
|