భర్తృహరి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) |
K.Venkataramana (చర్చ | రచనలు) |
||
పంక్తి 23:
అను శ్లోకమున "ఒకానొక బ్రాహ్మణుడు తనకు సూర్యప్రసాదముచే లభించిన ఫలమును తన ప్రభువగు భర్తృహరికి నొసగగా దాని నతడు తన ప్రియభార్తకునిచ్చెను. ఆమె దానిని తాను భుజింపక తన జారునకును, అతడు తన ప్రియేతరకును అర్పించెననియు, నీసంగతి ప్రత్యక్షమైనంతలో రాజు లోక వృత్తముపై నేవగొని విరాగియై గాననముల జేరెను." అన్న జన ప్రతీతి నిట తడవి యున్నాడు గాని దాని సత్యా సత్యముల విమర్శించినట్లు స్ఫురింపదు. సాధారణముగా ప్రసిద్ధ పురుషులం గూర్చి అవినీతులు తమ బుద్ధి బలము కొద్దీ గాథల నెత్తిటినో కల్పించుటయు, వాని నట్టే సత్యములని పామరజనము విశ్వసించుటయు మనకు నేటికిని అనుభవమే. యిదియొక గుడ్డి ఛాందస వృత్తము. వ్యాఖ్యాతలెల్లరు " రత్నము రత్నమె కదా! అది యేనాటిదన్న ప్రశ్న మనకేల?" అన్న నుడికి దాసానుదాసులై తలయొగ్గిరే గాని తమ కవి స్తుత్యాదికములలో అతని కాలముని నిర్ణయించుటకు తగినంత విశదముగా నతనిని ప్రశాంసించవారును లేరు.
అట్లుండినను ప్రబలమైన అధారాంతముచే దీనినికొంతవరకు నిశ్చయింపవచ్చును. పారసీక భాషలో "కలిల ఉ - దిమ్నా" అను గ్రంధము కలదు. ఇది క్రీ.శ 531-579 ప్రాంతముల పారసీక దేశమును పాలించిన యొకానొక ఫాదుషా ప్రోత్సాహమున రచియింపబడిన గ్రంధము. దీనికి మూలము మన సంస్కృత పంచతంత్ర మనుట సర్వాంగీకరింపబడిన విషయము. కనుక పంచతంత్రము అధమ పక్షము క్రీ.శ ఆరవ శతాబ్దారంభము నాటికే ప్రాచుర్యమందియుండెననుట కెలాంటి సంశయము లేదు. పంచ తంత్ర మా మూలాగ్రము స్వతంత్ర మైన రచనము కాదు. నాటికి ప్రశస్తము లైయుండిన గ్రంధరాజము లనేకముల నుంది బహుళముగా నుదాహరణముల గైకొనియున్నది. దాని కాధారములగు గ్రంధములలో నీ నీతి శతక మొకటి. ఇందుండి యొక శ్లోకము " గజభుజఙ్గ విహఙ్గమ బంధనం శశిదివాకరయోర్గ్రం హపీడనమ్; మతిమతాం చ విలోక్య దరిద్ర్క్వ తాం విధిరహో బలవాని తిమే మతిః" (చూడండి. 85 నీతి శతకం) అను శ్లోకమందు లోనికి గ్రహింపబదియున్నది.
ఈ యుదాహరణమే పారశీక గ్రంధమునందును గలదు. కనుక నీతి శతక కర్త క్రీ.శ 500 కు పూర్వమే యుండెననుట స్థిరము. అనగా కవికాలమును అయిదవ శతాబ్ది కీవలికి లాగుటకు వీలులేదు.
మరొక మతము భర్తృహరి క్రీ.శ 7 వ శతాబ్దము వాడనుట. దానికి భర్తృహరి కాళిదాసీయ మగు నొక శ్లోకమును - "భువన్తి నమ్రాస్తర వః పలోద్గమైర్న వాంబుభిర్దూరవిలంబినో ఘనాః, అనుద్దతాః సత్పురుషాః సమృద్ధిభిః స్వభావ ఏవైష పరోపకారిణాం." (శాకుం. 5 అం. శ్లో.12) అనుదనిని (చూ. శ్లో.61 భర్తృ) స్వగ్రంధమున నుదాహరించుటయు, కాళిదాసు 6 వ శతాబ్ది వాడను మతమునే యాధారములు. దీని కాక్షేపణమిది. కాళిదాసు కాలెమే చాల వివాదగ్రస్తమై యుండినది. కాని చాలినని ప్రమాణములను గొని అతడు క్రీ.శ ప్రధమ శతాబ్దమువాడని పండితులు నిశ్చయించియున్నారు. కావున నీవాదము నిలువజాలదు. ఇంకనొక విషయము. ఇత్సింగను చైనా యాత్రికుడు యాత్ర చేయుటకు ఈ దేశమునకు 7 వ శతాబ్దాంతరమున వచ్చియుండి భర్తృహరి తాను వచ్చుటకు పూర్వము నలువది యేండ్ల క్రితము గతించినట్లు వ్రాసి యున్నాడు. ఈ భర్తృహరి వైయాకరణి. ఆధునిక విద్వాంసుల మతమున శతక కవియు, వైయాకరణియు భిన్నులు. ఈ మతమును గూడ నేటిదనుక నాక్షేపించినవారొక్కరు లేరు. కనుక నేడవ శతాబ్దమై యున్నది. భర్తృహరి తన గ్రంధమున నెచటను సమలాలిక కవులనో,సమకాలిక సంభవములనో తడవి యుండని కారణము చేతను, ఇతరు లెవరు నాతనిపేరుదాహరింపని కారనమున సాంప్రదాయికాభిప్రాయములకు విరుద్ధముగా నేలాటి ప్రబల ప్రమాణములును గన్పట్టనందు వలనను పండిత ప్రతీతినే యనుసరింపవచ్చును.
<u>పై విషయ వర్యాలోచన ఫలియంగా భర్తృహరి విక్రమార్కుని కాలమున, అనగా క్రీ.పూ ప్రథమ శతాబ్ది మధ్యమున వెలసె నని నిశ్చయింపవచ్చును.</u>
(సశేషం)
|