'''ధూళిపాళ సీతారామ శాస్త్రి''' తెలుగు నాటక రంగంలో మరియు తెలుగు సినీ రంగంలోనూ తన నటనా ప్రతిభతో విశేషంగా రాణించిన నటుడు. తెలుగు నాటక, చలన చిత్ర రంగాల్లో అసమాన నటుడిగా పేరుతెచ్చుకుని, జీవిత చరమాంకాన్ని శ్రీరామసేవకేశ్రీరామ సేవకే అంకితం చేసిన మహా మనిషి ధూళిపాళ సీతారామ శాస్త్రి. ధూళిపాళ పేరుచెప్పగానే ఆయన నటించిన ‘శకుని’ పాత్రే కళ్లముందు మెదులుతుంది. ఆ పాత్రకు అంతవరకు [[సి.ఎస్.ఆర్]], [[లింగమూర్తి]] వంటివారు న్యాయం చేయగా, ధూళిపాళ ప్రత్యేక తరహా వాచకం, హావభావాలతో వారి సరనస చేశారు. '''ధూళిపాళ'''గా పిలవబడే ఈయన [[గుంటూరు]] జిల్లా [[పల్నాడు]] మండలం [[దాచేపల్లి]]లో [[1921]] [[సెప్టెంబర్ 24]] న జనించాడుజన్మిచాడు. 2001లో సన్యాస ఆశ్రమం స్వీకరించి శ్రీ శ్రీ శ్రీ మారుతీ సేవేంద్ర సరస్వతి గా మారిపొయాడు.
==నట జీవితం==
చిన్నప్పటి నుంచి రంగస్థల ప్రదర్శన పట్ల ధూళిపాళ ఎంతో మక్కువ చూపేవారు. బతుకుతెరువు కోసం గుంటూరులో కొద్దికాలం ప్లీడర్ గుమాస్తాగా పనిచేశారు. 1935లో స్త్రీ పాత్ర ద్వారా నాటకరంగ ప్రవేశం చేశారు. 1941లో గుంటూరులో స్టార్ థియేటర్ను స్థాపించి నాటక ప్రదర్శనలు ఇస్తుండేవారు. ఆయన రంగస్థలం మీద పోషించిన ధుర్యోదన, కీచక పాత్రలకు మంచి ప్రశంసలు లభిస్తుండేవి. 1959లో మద్రాసు పచ్చయప్ప కాలేజీలో నాటక పోటీలకు వెళ్లినప్పుడు ఆ పోటల న్యాయనిర్ణేతల్లో ఒకరైన [[జి.వరలక్ష్మి]] దృష్టిని ఆయన ఆకర్షించారు. సినిమాల్లో నటించమని ఆమె సూచించడమే గాకుండా దర్శకుడు బి.ఎ.సుబ్బారావుకు పరిచయం కూడా చేశారు. దాంతో [[బి.ఎ.సుబ్బారావు]] గారు [[భీష్మ]] (1962) చిత్రంలో ధూళిపాళకు ధుర్యోదనుడిధుర్యోధనుడి పాత్రను ఇచ్చారు. ఆ సినిమాలో భీష్ముడిగా [[ఎన్.టి.రామారావు]] నటించారు. ధూళిపాళలోని నటనా ప్రతిభను మెచ్చుకున్న ఎన్.టి.ఆర్.రామారావు ఆగారు తర్వాత తన బ్యానర్లో నిర్మించిన [[శ్రీ కృష్ణ పాండవీయం]]లో శకుని పాత్రను ధూళిపాళకు ఇచ్చారు. ఆ పాత్ర ధూళిపాళ కెరీర్లోనే మైలురాయిగా నిలిచింది. ఆ తర్వాత గయుడు, రావణుడు, మైరావణుడు వంటి ఎన్నో పౌరాణిక పాత్రలు ఆయన పోషించారు. సాంఘిక చిత్రాల్లో సైతం సాత్విక, దుష్ట పాత్రలు పోషించి అందరినీ మెప్పించారు. [[దానవీరశూరకర్ణ]], [[కథానాయకుడు]] , [[ఆత్మ గౌరవం]], [[ఉండమ్మా బొట్టుపెడతా]] వంటి ఎన్నో చిత్రాల్లో ఆయన నటించారు. [[చూడాలని ఉంది]], [[శ్రీ ఆంజనేయం]], [[మురారి]] వంటివి ఆయన ఆఖరి చిత్రాలు.
==పురస్కారాలు==
Line 49 ⟶ 50:
==ఆధ్యాత్మిక జీవితం==
నటరాజ సేవలో తరించిన ధూళిపాళ చనిపోవడానికి సుమారు పదేళ్ల క్రింతంక్రితం సినీ జీవితానికి స్వస్తి చెప్పి ఆధ్యాత్మిక జీవితానికి తెర తీశారు. పుట్టిన జీవి ఎప్పటికైనా గిట్టక తప్పదని, అయితే మానవ జన్మ విశిష్టత, మోక్షసాధన అవసరాన్ని తెలుసుకుని తరిలించాలని భావించి ''మానవసేవే మాధవసేవ'' లక్ష్యంగా ఆయన సన్యాసం తీసుకుని ఆధ్యాత్మిక పథంలోకి అడుగుపెట్టారు. తనకున్న సంపదను త్యజించారు. 2001 మే 7న కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ద్వారా ఆయన సన్యాస దీక్ష స్వీకరించారు. అప్పటి నుంచి '''శ్రీ మారుతి సేవేంద్ర సరస్వతి''' పేరుతో వ్యవహారంలో ఉన్నారు. గుంటూరు మారుతీ నగర్లో మారుతీ దేవాలయాన్ని నిర్మించి, రామాయణం, సుందరాకాండలను తెలుగు లొకి తిరిగి వ్రాశారు . ధూళిపాళ ట్రస్టును ఏర్పాటుచేసి సేవా కార్యక్రమాలు, ధూళిపాళ కళావాహిని స్థాపించి కళారంగాన్ని ప్రోత్సహిస్తున్నారు. ముడున్నర దశాబ్దాల పాటు కళామతల్లికి సేవలందించి, ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లేందుకు తన శేషజీవాతాన్ని అంకితం చేసిన ధన్యజీవి ధూళిపాళ.