తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీ ప్రారంభించిన రాజ్ న్యూస్ కలక్రమంలో టి న్యూస్ గా మారింది.
{{శుద్ధి}}
టీ న్యూస్ రాకే ఒక సంచలనం. ప్రతి అడుగు..ప్రతి కదలికా....ప్రతి మాట..తెలంగాణ.., తెలంగాణ తెలంగాణ.,
సీమాంధ్ర మదాంధ ఛానళ్లకు చెంపపెట్టు. అబద్ధాలు చలామణీలో పెట్టి....ఉద్యమాన్ని వీలైనంత నీరుగార్చాలనే కుట్రలు చేస్తున్న కుల పిచ్చ ఛానళ్లకు వెన్నులో వణుకుపుట్టించింది టీన్యూస్ ఎంట్రీ.
తెలంగాణా బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ఆధ్వర్యంలో నడపబడుతున్నదీ న్యూస్ ఛానల్ ..
కొన్ని దశాబ్దాలుగా ప్రింట్ మీడియా, గత పదేళ్లుగా ఎలక్ట్రానిక్ మీడియా నూటికి నూరు శాతం సీమాంధ్ర పక్షపాతిగా ఉంటుంన్నది. ఇలాంటి సమయంలో తెలంగాణ స్వరం వినిపించటానికి ఒక ఆల్టర్నేట్ మీడియా అవసరం మొదలైంది. ప్రపంచంలో ఆల్టర్నేట్ మీడియా రానంత కాలం కొన్ని వర్గాలు చెప్పినవే నిజాలు చలామణీ అవుతూ వచ్చినయ్...
కప్పి ఉంచిన నిజాల్ని విప్పి చెప్తూ, అబద్దాల ముసుగుల్ని చీల్చి తొలగిస్తూ , వార్తల్ని వాస్తవాలుగా చూపిస్తూ, తెలంగాణ ఘోషను, తెలంగాణ నుడికారాన్ని, తెలంగాణా పోరాటాన్ని, యాసను, భాసను సంస్కృతిని, ప్రతిబింబిస్తూ..నాలుగున్నరకోట్ల ప్రజల గుండె చప్పుల్లని నలుదిశలా చాటుతూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలుస్తోంది టీ న్యూస్.
ప్రస్తుత సీఈవో నారాయణరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కొహెడ సురేష్ సారధ్యంలో టీ న్యూస్ తెలంగాణ వాణిని వినిపిస్తూ ఉంది.