ఎ.కోదండరామిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[కె.రాఘవేంద్రరావు]] శిష్యుడైన '''కోదండరామిరెడ్డి'''కి దర్శకుడిగా తొ లిచిత్రం "[[సంధ్య]]". హిందీ చిత్రం 'తపస్య' ఆధారంగా తీసారు. కుటుంబ చిత్రంగా ఓ మాదిరిగా విజయవంతమైంది. చాలా కొద్దికాలంలోనే పెద్ద హీరోలతో అవకాశాలు వచ్చాయి. [[చిరంజీవి]]ని తారాపథానికి తీసుకెళ్ళిన [[ఖైదీ]] చిత్రం కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చింది. "[[న్యాయం కావాలి]]" చిత్రంతో మొదలైన వీరి సినీ నిర్మాణ బంధం "[[ముఠా మేస్త్రి]]" సినిమా వరకు సాగింది. వీరిద్దరు కలిపి 23 సినిమాలకు పనిచేసారు. అందులో 80% విజయం సాధించాయి. ఒక్క ఎన్.టి.ఆర్ తో తప్ప అందరు ప్రముఖ నటులతోనూ చిత్రాలు తీసారు.
 
కోదండరామిరెడ్డి [[నెల్లూరు జిల్లా]] [[మైపాడు]]లో మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. ఈయన తండ్రి వెంకూరెడ్డి, తల్లి రమణమ్మ. ఇందుకూరుపేట, నరసాపురంలలో చదువు కొనసాగించి, ఎస్.ఎస్.ఎల్.సి దాకా చదువుకున్నాడు. విద్యార్ధి దశనుండే నాటకాలంటే కోదండరామిరెడ్డికి పిచ్చి. పీయూసీ చదువుతూ మధ్యలోనే చదువు మానేసి సినిమాల్లో హీరో అవ్వాలనే కోరికతో రైలెక్కి మద్రాసు వచ్చాడు.
 
 
==చిత్రసమాహారం==
"https://te.wikipedia.org/wiki/ఎ.కోదండరామిరెడ్డి" నుండి వెలికితీశారు