కేతు విశ్వనాథరెడ్డి కథలు (1998-2003): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
'''కేతు విశ్వనాథరెడ్డి కథలు(1998-2003)'''అనే కథలసంపుటి విద్యావేత్త,సాహిత్యపరిశోధకుడు,విమర్శకుడు, అద్యాపకుడు అయిన ప్రముఖ రచయిత [[కేతు విశ్వనాథరెడ్డి ]] చే విరచితము.
=పుస్తక ప్రచురణ వివరాలు=
కేతు విశ్వనాథరెడ్డి కథలు అనే కథాసంపుటం [[విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్]],[[హైదరాబాద్]] వారిచే ప్రచురింపబడినది.ఈ పుస్తకము 13 కథల సంకలనము.ఇవ్వన్నియు 1998 నుండి 2003 వరకు వివిధ పత్రికలలో ప్రచరింపబడినది.[[విశాలాంధ్ర పబ్లిషింగ్]] వారు ఈ పుస్తకాన్ని 2004 వ సంవత్సరం మేనెలలో పాఠకులకు అందించారు.మొదటి ముద్రణ 1000పుస్తకములు.ముఖపత్ర చిత్రాన్ని [[చంద్ర]]గారు(సాహిత్య ప్రస్థానం-సాహీతీ స్రవంతీ సౌజన్యంతో)గీసారు.పుస్తకంలోని అక్షరాలంకారంను ట్వంటీఫస్ట్‌ సెంచరీ,దిల్‌సుఖ్‌నగర్‌వారుచెయ్యగా,పుస్తకముద్రణ శ్రీ కళాంజళి గ్రాఫిక్స్ ,హిమాయత్ నగర్[[హిమాయత్‌నగర్]] లో జరిగినది.ఈ కథలసంపుటాన్ని రచయిత తన వియ్యంకుడు.కిర్తీ శేషుడైన గోళ్లమూడి సుందరరామిరెడ్డి(1933-1991)కి అంకితమిచ్చాడు.
==రచయిత గురించి ఒకమాట==
కేతు విశ్వనాథరెడ్ది ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతానికి చెందినవాడు.బహుముఖప్రజ్ఞాశాలి.దాదాపు 1961 నుండి రచానావ్యాసంగంలో వున్నవాడు.ఈ పుస్తకం కన్నముందు '''జప్తి ''',మరియు ''' ఇచ్ఛాగ్ని ''' అనే రెండు కథలసంపుటాలు కూడా వెలువడ్డాయి.ఈ కథలతోపాటు '''వేర్లు ''',''' బోధి ''' అనే రెండు నవలికల్నికుడా వ్రాసాడు.తన కథలకు ముందుమాతలు అవసరం లేని రచయిత,కేతు గార్కి మొదటినుంది సాహిత్యవిమర్శమీద,కల్పనా సాహిత్యం మీద శ్రద్డా,అసక్తి,పట్టు వున్న వ్యక్తి.తన సాహిత్య విమర్శావ్యాసాలలోకొన్నింటిని '''దృష్టి ''' అన్న సంపుటంగా విడుదలచేసాడు.సాహిత్య పరిశోధనరంగం మీదకూడా ఇయన మౌలికమైన కృషిచేస్తారు.ఎందరో విద్యార్థులచే కల్పనాసాహిత్యం మీద పరిశోధనలు చేయించాడు.తెలుగు భాషా సాహిత్యాల పాఠ్య ప్రణాళికల్ని చేరా గారితో కలసి రూపొందించారు.కొడవకంటి సాహిత్యాన్ని సంపాదించి ప్రచురించుటకు వారు చేసిన కృషి అపురూపం.ఈయనకు ఎన్నో వ్యాసాంగాలున్న ఆయనగారి ఆత్మ వ్యాసంగం మాత్రం-కథారచనే.కేతు విశ్వనాథరెడ్డి గారిపేరు వినగానే ఆయన కలంనుండి జాలువారిన '''నమ్ముకున్న నేల ''',''' కూలిన బురుజు ''', '''పీర్లచావడి ''','''గడ్డి ''','''దాపుడుకోక ''','''జప్తు '''వంటి ఎన్నో కథలు జ్ఞాపకానికొస్తాయి.కేతుగారు వుద్యోగరీత్యా నగరవాసి అయినప్పటికి,[[కడప]]జిల్లాను,పల్లెప్రజలను,మట్టివాసనను మరువలేదు.