మందుముల నరసింగరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
పాలమూరు జిల్లాకు చెందిన సమరయోధులలో ప్రముఖుడైన మందుముల నరసింగరావు మార్చి 17, 1896న ప్రస్తుత రంగారెడ్డి జిల్లా చేవెళ్ళలో జన్మించాడు. న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యాడు. పర్షియన్ భాషలో కూడా ఇతను గొప్ప పండితుడు మరియు ప్రముఖ పత్రికా రచయితగా పేరుపొందాడు. 1921లో ఆంధ్రజనసంఘాన్ని స్థాపించిన వారిలో ఒకడు. 1927లో న్యాయవాదవృత్తికి స్వస్తి చెప్పి పత్రికారచన, రాజకియాలుచేపట్టారు.రయ్యత్ అనే ఉర్దూ వార్తాపత్రికకు వ్యవస్థాపక సంపాదక బాధ్యతలు చేపట్టాడు. మందుముల సమరరంగంలో కూడా కీలకపాత్ర వహించి 1937లో ఇందూరు (నిజామాబాదు)లో జరిగిన 6వ ఆంధ్రమహాసభకు అధ్యక్షత వహించాడు. 1938-42 కాలంలో నిజాం లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులుగా ఉన్నాడు. 1947లో జాయిన్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అరెస్టు అయ్యాడు. ఇవేకాక బాల్యవివాహాల రద్దుకు, వితంతు వివాహాలకు బాగా కృషిచేశాడు. 1952లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున హైదరాబాదు శాసనసభకు ఎన్నికయ్యాడు. 1957-62 కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో పనిచేశాడు. నిజాం కాలంలోని దుష్పరిపాలనను వర్ణిస్తూ "50 సంవత్సరాల హైదరాబాదు" గ్రంథాన్ని స్వీయజీవిత చరిత్రగా రచించాడు. మార్చి 12, 1976న మందుముల మరణించాడు.
==ఇవి కూడా చూడండి==
 
*[[50 సంవత్సరాల హైదరాబాదు (పుస్తకం)]]
 
[[వర్గం:మహబూబ్ నగర్ జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:1896 జననాలు]]
[[వర్గం:1976 మరణాలు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకులు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ఆంధ్ర ప్రదేశ్ రచయితలు]]
"https://te.wikipedia.org/wiki/మందుముల_నరసింగరావు" నుండి వెలికితీశారు