రేడియో: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) వర్గములు చేర్చితిని |
చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 5:
|caption = రేడియో
|acronym =
|other_names = నిస్తంత్రీ ప్రసారం, ఆకాశవాణి
|uses = నిస్తంత్రీ విధానంలో సమాచార ప్రసారం
|inventor = మార్కోనీ
పంక్తి 14:
కాంతి వేగ
==చరిత్ర==
===మాక్స్ వెల్ ప్రయోగం===
ప్రయోగాత్మక భౌతిక
===హెర్ట్ జ్ ప్రయోగం===
దీన్ని నిరూపించిన వాడు [[హెర్ట్జ్]] అనే జర్మనీ భౌతిక శాస్త్రవేత్త. 1887 నవంబరులో అతడు ప్రయోగశాలలో ఒక వైపున "విద్యుత్ ప్రేరణ యంత్రాన్ని" మరోవైపున "అనునాదిని" నీ అమర్చాడు. ఒక తీగ చివరల్లో రెండు లోహపు బంతులుంటాయి. తీగను వృత్తాకారంగా వంచి, బంతుల మధ్య సుమారు రెండు సెంటీమీటర్ల దూరం ఉండేలా చేస్తారు. అది అనునాదినిగా పనిచేస్తుంది. ప్రేరణ యంత్రంలో పెద్ద లోహపు పలకలుంటాయి. దీనికీ, అనునాదినికీ మధ్య గాలి తప్ప మరే సంబంధం ఉండదు.
ప్రేరణ యంత్రంలో లోహపు పలకలకు ఏకాంతర విద్యుత్ ను సంధిస్తే, వాటి నుంచి విద్యుదయస్కాంత తరంగాలు ఉత్పత్తి అవుతాయని, ఇవి ప్రయోగశాలలో ఒక వైపు నుంచి మరో వైపుకు కాంతి వేగంతో ప్రయాణం చేస్తాయనీ, ఈ తరంగాలు అనునాదిని పై పడినపుడు బంతుల మధ్య చిన్న విస్ఫులింగాలు(sparks) ప్రసరిస్తాయని హెర్ట్జ్
37 ఏళ్ళ ప్రాయం లో హెర్ట్జ్ చనిపోయేనాటికి విత్తనం మొలకెత్త సాగింది. హెర్ట్జ్ తరంగాలు, కాంతి ఈ రెండూ విద్యుదయస్కాంత తరంగాలే అనీ, రెండింటికీ తేడా కాంతి తరంగ దైర్ఘ్యం లోనే ఉంటుందనీ భౌతిక శాస్త్రవేత్తలందరూ అంగీకరించక తప్పలేదు. కాంతినైనా చూడగలుగుతాం. కానీ ఇతర విద్యుదయస్కాంత తరంగాలను గుర్తించటానికి ప్రత్యేక పరికరాలు వాడాల్సి ఉంటుంది.
===బ్రాన్లీ ప్రయోగం===
కాథలిక్ విశ్వవిద్యాలయంలో ఎడ్వర్డ్ బ్రాన్లీ భౌతిక శాస్త్ర ప్రొఫెసర్ గా పనిచేశాడు. లోహం పొడి(Metal fillings) పై విద్యుదయస్కాంత తరంగాలు పడినప్పుడు విచిత్రంగా ప్రవర్తిస్తుందని 1890 లో అతడు గమనించాడు. పొడిలోని కణాల మధ్య ఖాళీ స్థలాలుంటాయి కాబట్టి, దాని గుండా విద్యుత్తు ప్రవహించదు. కానీ విద్యుదయస్కాంత తరంగాలు పడినప్పుడు మాత్రం కణాలన్నీ కలుసుకొని పోయి విద్యుత్ వాహకంగా ప్రవర్తిస్తుంది. కణాలు విడిపోయేలా పొడిని బాగా కదిలించేంతవరకు అది వాహకం గానే ఉంటుంది.
గాజు నాళంలో ఉంచిన లోహం పొడి విద్యుదయస్కాంత తరంగాలను గుర్తించడానికి చాలా ఉపకరిస్తుందన్నమాట. దీనికి బ్రాన్లీ "కొహెరర్" అని పేరు పెట్టాడు. ఈ తరంగాలు ఉపయోగానికి సంబంధించి అనేక ప్రయోగాలు జరిగాయి. [[టెలిగ్రాఫ్]] సంకేతాలను ప్రసారం చేయటానికి వీటిని వాడవచ్చునని [[లార్ట్ కెల్విన్]] సూచించాడు. లోహపు తీగలను డాబా పై ఉంచితే విద్యుదయస్కాంత తరంగాలను ఇంకా ఎక్కువ దూరం నుంచి గుర్తించటానికి వీలవుతుందని [[రష్యా]] కి చెందిన ప్రొఫెసర్ [[పావోవ్]] కనుగొన్నాడు. దీన్ని ఇప్పుడు మనం ఏరియల్ అని పిలుస్తున్నాము. ఇలాంటి ఏరియల్ని [[మోర్స్ టెలిగ్రాఫ్]] గ్రాహకానికి సంధించి కొన్ని మైళ్ళ దూరంలో మెరిసే మెరుపులను బ్రాన్లీ గుర్తించగలిగాడు.
పంక్తి 33:
మార్కోనీ తన పరికరాల్ని ఇంటి ముందుండే తోటలోకి మార్చాడు. క్రమంగా సంకేతాలు వెళ్ళగలిగే దూరాన్ని పెంచుతూ పోయాడు. ఓ చిన్న గుట్ట ఆవలిపైపు దాకా సంకేతాలు వెళ్ళగలిగాయి. సంకేతం ఆవలి వైపున చేరగానే దాన్ని గుర్తించానని తెలియజేయడానికి గాను ఆయన తమ్ముడు గుట్టపై నిలబడి నాట్యం చేసేవాడు. 1896 నాటికి ఈ సంకేతాలు రెండు మైళ్ళ దాకా వెళ్ళగలిగేవి. మార్కోనీ తల్లి వుట్టినిల్లు [[ఐర్లండ్]] అయితే మెట్టినిల్లు [[ఇటలీ]]. పరికరాన్ని [[బ్రిటన్]] కు తీసుకొని వెడితే బాగుంటుందని ఆమె సలహా యిచ్చింది.
===పేటెంట్ హక్కులు===
[[లండన్]] వెళ్ళగానే మార్కోనీ వైర్ లెస్ పరికరాన్ని పేటెంట్ కార్యాలయం లో రిజిస్టర్ చేయించాడు. జనరల్ పొస్టాఫీసులో ప్రధాన ఇంజనీరుగా పనిచేస్తున్న విలియం ప్రీస్ పరికరాన్ని ప్రదర్శించడానికి మార్కోనీకి అనుమతి సంపాదించిపెట్టాడు. ఇంజనీర్లు, విజ్ఞాన శాస్త్రవేత్తలు, వ్యాపార సంస్థల అధిపతులు ఈ ప్రదర్శనకు ఆహ్వానించబడ్డారు. ఇంట్లో తయారు చేసిన మొరటుపరికరాలు ఎలా పనిచేస్తాయో ఏమో అని మార్కోనీ అధైర్య పడ్డాడు. కానీ ప్రయోగం సంపూర్ణంగా విజయవంతమైంది. మరుసటి ప్రదర్శన పదాతిదళం, నావికాదళం అధిపతుల సమక్షంలో జరిగింది. మార్కోనీ పరికరంతో సంకేతాలను ఎనిమిది మైళ్ళ దాకా పంపడానికి వీలయ్యేది.
===నీళ్లపైన ప్రయోగం===
1897 మే లో తొలి వైర్ లెస్ టెలిగ్రాఫ్ స్టేషన్ కార్డిఫ్ వద్ద నెలకొల్పబడింది. ఏరియల్ ని వంద అడుగుల ఎత్తులో బిగించారు సంకేతాలు నీళ్ళ మీదుగా ఎలా ప్రయాణిస్తాయో పరిశీలించాలని బ్రిస్టల్ చానల్ మధ్య భాగం నుంచి ప్రసారం ప్రారంభించాడు. మొదట్లో సంకేతాల జాడే కనిపించలేదు. నిరాశ చెందకుండా మార్కోనీ ఎక్కడ లోపముందో పరీక్షించి, పరికరంలో తగిన మార్పులు చేసాడు. సంకేతాలు వచ్చాయి కానీ అవి బలహీనంగాను, లోపభూయిష్టంగానూ ఉండేవి. ఏరియల్ పొడవును పెంచి సంకేతాలను సంతృప్తికరంగా గుర్తించటం జరిగింది. ఈ ప్రయోగాలను పరిశీలించటానికి బెర్లిన్ అధికారులు ప్రొఫెసర్ స్లాచీ, జార్జ్ ఆర్కో అనే ఇద్దరు నిపుణులను పంపించారు కూడా.
పంక్తి 39:
అనతి కాలంలోనే మార్కోనీ ప్రయోగాల విజయ గాధలు యూరప్ అంతా వ్యాపించాయి. ఎక్కడ చూసినా ప్రజలు ఆయన వినూత్న ఆవిర్భావాన్ని గురించి చర్చించుకోసాగారు. ఇది వరకు ఇంగ్లండ్ లో అతడిని గేలి చేసిన వాళ్ళూ, విమర్శించిన వాళ్ళూ ఇప్పుడు జోహార్లర్పించడం మొదలుపెట్టారు. సముద్రం మీద ప్రయాణం చేస్తున్న ఓడలలో వార్తా ప్రసార సౌకర్యాలు ఏర్పరుచుకునే అవకాశం దగ్గర పడుతోందని సామాన్య ప్రజలకు కూడా నమ్మకం కుదిరింది.
==వైర్ లెస్ ప్రసారాలు==
క్రమంగా సంకేతాలను ఎక్కువ దూరం ప్రసరించేలా చేయడంలో మార్కోనీ కృతకృత్యుడయ్యాడు. 1898 వేసవి లో సముద్ర మధ్యంలో జరిగిన పడవ పందేలను గురించి ఎప్పటికప్పుడు వార్తలు పంపడానికి డబ్లిన్ వార్తా పత్రిక మార్కోనీని నియమించింది. అతడు సముద్ర తీరంలో గ్రాహకాన్ని అమర్చి, వైర్
వేల్స్ రాకుమారుడు ఒకసారి విహార నౌకలో వెడుతూ వైట్ దీవుల కావల జబ్బు పడ్డాడు. కుమారుని ఆరోగ్య పరిస్థితిని ఎప్పటి కప్పుడు తెలుసుకోవాలని విక్టోరియా రాణి సంకల్పించింది. వెంటనే మార్కోనీని అభ్యర్థించగా అతడు వైర్ లెస్ పరికరాలను నెలకొల్పి, 16 రోజుల పాటు నిర్విరామంగా వార్తలను చేరవేసే ఏర్పాటు చేశాడు. మొత్తం 150 టెలిగ్రాంలు అటూ, యిటూ ప్రసారం చేయబడ్డాయి.
కొన్నాళ్ళకు ఇంగ్లీషు ఛానెల్ మీదుగా వైర్ లెస్ ప్రసార సౌకర్యం నెలకొల్పబడింది. కొన్ని డజన్ల మైళ్ళ వరకు ఈ సౌకర్యం కల్పించడం సులభంగానే జరిగిపోయేది గానీ, కొన్ని వేల మైళ్ళు దూరమైతే ఇది సాధ్యమవుతుందా? ప్రసారిణి సామర్థ్యాన్ని పెంచి, గ్రాహకం మరీ సున్నితంగా ఉండేలా చేయడం ఓ పద్ధతి. ఇక్కడ మౌలికమైన ప్రశ్న ఒకటుంది. విద్యుదయస్కాంత తరంగాలు ఆకాశంలో ఋజుమార్గంలో ప్రసరిస్తాయా లేదా భూమి తలానికి సమాంతరంగా వక్ర మార్గంలో వెడతాయా? ఋజుమార్గంలో వెళ్ళేటట్లైతే అన్ని సముద్రాలను వైర్ లెస్ ద్వారా కలిపే ఆలోచన పగటి కలే అవుతుంది. ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ప్రయోగం చేయాల్సిందే.
==సముద్రాన్ని దాటిన వైర్ లెస్ తరంగాలు==
|